కఠెవరం

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా గ్రామం

కఠెవరం, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తెనాలి నుండి 4 కి. మీ. దూరంలో ఉంది.

కఠెవరం
—  రెవిన్యూ గ్రామం  —
కఠెవరం
కఠెవరం
కఠెవరం
కఠెవరం is located in Andhra Pradesh
కఠెవరం
కఠెవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°15′36″N 80°38′11″E / 16.260019°N 80.636346°E / 16.260019; 80.636346
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తెనాలి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ బండికళ్ళ ప్రసాద్
జనాభా (2011)
 - మొత్తం 13,209
 - పురుషుల సంఖ్య 6,608
 - స్త్రీల సంఖ్య 6,601
 - గృహాల సంఖ్య 3,554
పిన్ కోడ్ 522202
ఎస్.టి.డి కోడ్ 08644

గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3554 ఇళ్లతో, 13209 జనాభాతో 1696 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6608, ఆడవారి సంఖ్య 6601. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3397 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 296. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590294[1].పిన్ కోడ్: 522202. యస్.టీ.డీ.కోడ్ 08644.

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా 11444, అందులో పురుషుల 5785 ఉండగా, మహిళలు 5659 మంది ఉన్నారు. నివాసగృహాలు 2963

సమీప గ్రామాలు మార్చు

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి తెనాలిలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల తెనాలిలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల తెనాలిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

కఠెవరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

కఠెవరంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

కఠెవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 296 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1399 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 285 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1113 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

కఠెవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 985 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 128 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

కఠెవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, పసుపు, అరటి, అపరాలు, కూరగాయలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామ పంచాయతీ 1937 అక్టోబరు 8 నాడు ఆవిర్భవించింది. 2013, జూలైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గంపల శివనాగేశ్వరరావు సర్పంచిగా ఎన్నికైనాడు. ఆ తరువాత ఇతను గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైనాడు.2021 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బండికళ్ళ ప్రసాద్ విజయం సాధించి సర్పంచి గా ఎన్నికయ్యారు.

గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  1. ఈ గ్రామంలో 2013 ఆగస్టు 24, ఆదివారం ఉదయం 8-23 గంటలకు శ్రీ విఘ్నేశ్వర రామ సాయి పంచలోహ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా పూర్ణకుంభ పూజ, అభిషేక పూజలను రుత్వికులు నిర్వహించారు.
  2. ఈ గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల దశమి నాడు వైభవంగా నిర్వహించెదరు.

గ్రామ ప్రముఖులు మార్చు

  • బత్తుల మోహన్ కుమార్ - మారాథాన్ వీరుడు. ఇతను 1972 లోనే, కఠెవరం నుండి మంగళగిరి పానకాలస్వామి ఆలయం వరకూ పరుగుతీసాడు. క్రీడల కోటాలో 1980లోనే ఇతను ఓడరేవుల విభాగంలో ఉద్యోగం సంపాదించి, అటుపైన మరాథాన్ ను కొనసాగించాడు. పలు జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని, పతకాలు పొందాడు. ఓడరేవుల విభాగంలో క్రీడా విభాగంలో ఇప్పటికీ క్రీడాకారుడిగా కొనసాగుతున్న ఈ 56 ఏళ్ళ మారాథాన్ వీరుడు, 2014, ఫిబ్రవరిలో ఒడిషాలోని పరదీప్ ఓడరేవులో జరుగనున్న పది కి.మీ.ల మారాథాన్ పోటీలలో విశాఖ ఓడరేవు జట్టు తరఫున పాల్గొనబోవుచున్నాడు.
  • కడియాల వెంకటేశ్వరరావు - రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ ఉప సంచాలకులుగా పదవీ విరమణ పొందాడు. వీరు పురావస్తు ప్రేమికులు. మన ప్రాచీన వారసత్వ సంపద, వాటి నిర్ధారణ అంశాలు భావి తరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైనా ఉందని, తనవంతు కృషిచేస్తున్నారు. దశాబ్దాలుగా అదే అంశంపై సాగుచున్న ఆయన ప్రస్థానం మన రాష్ట్రంలోనే 20 నూతన బౌద్ధక్షేత్రాలను వెలుగులోనికి తెచ్చింది. వీరు 2014, సెప్టెంబరు-27న, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వేడుకలో, రాష్ట్రస్థాయి పర్యాటక పురస్కారం, అందుకున్నారు. "పురాతన కట్టడాలు - నిర్మాణం, మన పర్యాటక రంగానికి మేలు చేస్తాయి" అనే అంశంతో ఆయన పర్యాటక విభాగానికి అందించిన సమాచారం నేపథ్యంలో అవార్డ్స్ ఫర్ ఎక్సెలెన్సీ పురస్కారాన్ని అందుకున్నారు.
  • లక్కంరాజు వెంకంరాజు - ప్రముఖ రంగ్థల నటుడు.వీరు 4 దశబ్దాలు పాటు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నాటకంలో సిద్దయ్య పాత్రలో అద్భుతంగా రాణించి రాష్ట్ర స్థాయిలో పేరొందినారు.ఈయనకు ముందు శ్రీ పూసపాటి లక్ష్మణరాజు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రలో రాణించారు.
  • మంచాల హనుమంతరావు - ప్రముఖ పౌరాణిక కళాకారుడు. వీరు మూడు దశాబ్దాలపాటు శ్రీకృష్ణుడు, నారదుడు మొదలైన పొరాణిక పాత్రలలో రాణించారు. వీరు 2014, అక్టోబరు-21న 84వ ఏట తన స్వగృహంలో కన్నుమూశారు.
  • తాళ్ళూరి రామారావు - జాతీయ పతాకం సాధించిన తోలి లిఫ్టర్.

గ్రామ విశేషాలు మార్చు

జాతీయస్థాయి దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తి కిరణ్ పురస్కారాలకు ఈ గ్రామం ఎంపికైనది. 2018-19 ఆర్ధికసంవత్సరానికి గాను రాష్ట్రం మొత్తం మీద ఆరు పంచాయతీలు ఎంపికకాగా, వాటిలో గుంటూరు జిల్లా నుండి అంగలూరు, కఠెవరం గ్రామాలూన్నవి. పల్లెలలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, త్రాగునీరు, పొదుపు సంఘాల నిర్వహణ, ఆన్‌లైన్ నమోదు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ ఎంపిక చేసినారు. ప్రతి సంవత్సరం కొత్తఢిల్లీలో ఆయా గ్రామపంచాయతీల సర్పంచులకు, కేంద్రమంత్రి చేతులమీదుగా, ఈ పురస్కారాలను అందజేసెదరు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కఠెవరం&oldid=3870312" నుండి వెలికితీశారు