కుక్కునూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, ఏలూరు జిల్లా లోని మండలం


కుక్కునూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 34 గ్రామాలు ఉన్నాయి. 2014 జూన్ 2, న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ఆర్డినెన్స్ వలన ఈ మండలం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో కలుపబడింది[3].OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°33′18″N 81°09′54″E / 17.555°N 81.165°E / 17.555; 81.165
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంకుక్కునూరు
Area
 • మొత్తం349 km2 (135 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం28,392
 • Density81/km2 (210/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1013

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 28,392 - పురుషులు 14,104 - స్త్రీలు 14,288

చరిత్ర మార్చు

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్-3లో పేర్కొన్నారు.అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు భద్రాచలం మండలంలోని భద్రాచలం మినహా బూర్గంపాడు మండలం లోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.[4] ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అమరవరం
  2. అర్వైపల్లి
  3. చీరవల్లి
  4. దాచారం
  5. దమరచర్ల
  6. గొమ్ముగూడెం
  7. కివ్వక
  8. కోమట్లగూడెం
  9. కొండపల్లి
  10. కౌందిన్యముక్తి
  11. కుక్కునూరు
  12. మాధవరం
  13. మారేడుబాక
  14. పోచారం
  15. రామచంద్రాపురం
  16. తొండిపాక
  17. ఉప్పేరు
  18. వింజరం

మండలంలో కొత్తగా చేరిన రెవెన్యూ గ్రామాలు మార్చు

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు 6 గ్రామాలను...తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను...ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఏపీలోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కునూరు , వేలేరుపాడు, భద్రాచలం ( మిగిలిన గ్రామాలు మాత్రమే) కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం, మండలాలతోపాటు బూర్గంపహడ్ మండలానికి చెందిన ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను జూలై 31న గెజిట్-లో ప్రచురించారు.[5][6]

  1. సీతారామనగర్
  2. శ్రీధర
  3. గుంపనపల్లి
  4. గణపవరం
  5. ఇబ్రహీంపేట
  6. పెద్ద రావిగూడెం

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. బంజరగూడెం
  2. కోయగూడెం
  3. కొయ్యగూడెం
  4. ఎల్లప్పగూడెం
  5. ముత్యాలమ్మపాడు
  6. కమ్మరిగూడెం
  7. కుర్లపాడు
  8. ఇసుకపాడు
  9. బెస్తగూడెం
  10. ఉప్పరమద్దిగట్ల

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. ఖమ్మం జిల్లా జనగణన కరపుస్తకం, గ్రామ, పట్టణ ప్రాథమిక జనగణన సారాంశం - 2011 (PDF), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q55972923, archived from the original (PDF) on 23 September 2015
  3. హిందూ లో ఆర్టికల్
  4. "Wayback Machine" (PDF). web.archive.org. 2017-03-29. Archived from the original on 2017-03-29. Retrieved 2022-09-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "తెలుగు ఎక్స్‌ప్రెస్ టి.వి నుండి". Archived from the original on 2021-12-26. Retrieved 2019-01-17.
  6. "List of seven mandals to be included in AP". web.archive.org. 2020-11-01. Archived from the original on 2020-11-01. Retrieved 2021-10-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు మార్చు