గణపవరం

ఆంధ్ర ప్రదేశ్, ఏలూరు జిల్లా గ్రామం
(గణపవరం (పశ్చిమ గోదావరి) నుండి దారిమార్పు చెందింది)

గణపవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఏలూరు జిల్లాకు చెందిన గణపవరం మండలం లోని గ్రామం,ఇది సమీప పట్టణమైన భీమవరం నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3338 ఇళ్లతో, 11749 జనాభాతో 619 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5779, ఆడవారి సంఖ్య 5970. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1836 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 72. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588566[1] ఇది మండల కేంద్రం. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యాగారం అనేవారు. గణపవరాన్ని రైసుమిల్లుల పట్టణంగా వ్యవహరించేవారు. ఒకప్పటి రైసు మిల్లుల పట్టణం ఇప్పుడు మంచినీటి చేపల రొయ్యల పెంపకానికి కేంద్రంగా మారిపోయింది.

గణపవరం
—  రెవిన్యూ గ్రామం  —
గ్రామ పంచాయితీ భవనం
గ్రామ పంచాయితీ భవనం
గ్రామ పంచాయితీ భవనం
గణపవరం is located in Andhra Pradesh
గణపవరం
గణపవరం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°42′00″N 81°28′00″E / 16.7000°N 81.4667°E / 16.7000; 81.4667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం గణపవరం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 12,384
 - పురుషులు 6,099
 - స్త్రీలు 6,285
 - గృహాల సంఖ్య 3,098
పిన్ కోడ్ - 534 198
ఎస్.టి.డి కోడ్ 08818

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12384. ఇందులో పురుషుల సంఖ్య 6099, మహిళల సంఖ్య 6285, గ్రామంలో నివాసగృహాలు 3098 ఉన్నాయి

గ్రామ పంచాయతీ మార్చు

2013 ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కూనెరెడ్డి సోమేశ్వరరావు సర్పంచిగా గెలుపొందారు.

దేవాలయాలు మార్చు

గ్రామ దేవత మారెమ్మ దేవాలయం. సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవాలయము. పెద్ద వీధిలో ఆంజనేయస్వామివారి దేవాలయములు ఉన్నాయి. గ్రామదేవత మారెమ్మ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద వీధిలో కల ఆంజనేయ స్వామివారి ఆలయంలో గల స్వామివారి విగ్రహం అతి భారీ ఎత్తులో పెద్దగా ఉంటుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

గణపవరం గ్రామానికి పూర్వనామం పద్మినీపురం. ఈ పద్మినీపురానికి గతంలో కొలని ప్రభువులు ముఖ్యపట్టణంగా చేసుకుని పరిపాలించేవారని, వారి పేరుమీదుగానే దీనికి ఆ పేరు వచ్చిందని గ్రామనామాలపై పరిశోధించిన జి.ఆర్.వర్మ భావిస్తున్నారు.[2]

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల తాడేపల్లిగూడెంలో ఉంది. సమీప వైద్య కళాశాల,సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల సరిపల్లిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఏలూరు లోనూ ఉన్నాయి., పాలీటెక్నిక్‌ భీమవరం లోను, ఉన్నాయి.

కళాశాలలు మార్చు

  • S.Ch.V.P.M.R. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్థాపితం 1972)
  • S.C.B.R. ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపితం 1969)

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

గణపవరంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో 5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

గణపవరంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

గణపవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 238 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 381 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 381 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

గణపవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 381 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

గణపవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, కొబ్బరి

విశేషాలు మార్చు

  • ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా రైసుమిల్లులు కలిగిన మండలంగా పేరెన్నిక గలిగి ఉండేది.
  • 1874లో కట్టిన పశ్చిమడెల్టా నీటిపారుదల వ్యవస్థలో ప్రాముఖ్యంగల చిలకంపాడు లాకులు ఉన్నాయి. గత 130 సంవత్సరాలుగా ఈ లాకులు రైతులకు సేవలందిస్తున్నాయి. 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. గణపవరం, పెంటపాడు, నిడమర్రు, ఉండి, ఆకివీడు, కాళ్ళ మండలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఈ లాకుల ద్వారానే అందుతుంది. ప్రస్తుతం ఈ లాకులు కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకొన్నాయి.

రైసు మిల్లుల స్థితి గతులు మార్చు

గణపవరంలో దాదాపు 40 ట్రేడింగ్, నాన్ ట్రేడింగ్ రైస్‌మిల్లులుఉండేవి. జిల్లాలోనే రైస్‌మిల్లింగ్ పరిశ్రమకు ఇది ప్రముఖ కేంద్రంగా వెలిగింది. 2000 నాటికే మొత్తం మిల్లులన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం ఒకే ఒక ట్రేడింగ్ రైస్‌మిల్లు, రెండో మూడో నాన్‌ట్రేడింగ్ ఉండటం గమనార్హం. మిల్లు గోదాములకు అద్దెలకు ఇవ్వగా కొన్ని మిల్లులు విద్యా సంస్థలుగానూ, మరికొన్ని ఐస్ ఫ్యాక్టరీలుగానూ మారాయి. కొన్ని మిల్లులను తొలగించి ఇళ్ల స్థలాలుగా అమ్మివేసారు. క్షణం తీరిక లేకుండా ఉండే రైస్ మిల్లింగ్ పరిశ్రమ దాదాపు కనుమరుగయిపోయింది.

గణపవరానికే పేరు తెచ్చిన రైసు మిల్లుల మూతకు కారణాలు

రైస్ మిల్లులకు లక్ష్యాలు విధించి ముక్కుపిండి లెవీ వసూలు చేయడం తప్ప వారి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వల్ప వడ్డీపై రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు, పన్నుల రాయితీ వంటి సహకారం కోసం ఎదురుచూసినా మిల్లర్లకుఫలితం కనిపించలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కొత్త మిల్లులతో ఇవి పోటీపడలేకపోవడం మరొక కారణమయినది.కొత్త మిషనరీ ఏర్పాటుకు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావడం. పాత మిషనరీతో మిల్లింగ్ చేసిన బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండు లేకపోవడం.కొత్త మిషనరీ ఏర్పాటుకు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడి అవసరం కావడం. పాత మిషనరీతో మిల్లింగ్ చేసిన బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండు లేకపోవడం. జిల్లాలో ఇతర ప్రాంతాలు, పొరుగునున్న తూర్పుగోదావరి జిల్లాతో పోలిస్తే గణపవరంలో మిల్లింగ్ ఖర్చులు ఎక్కువ కావడం. తాడేపల్లిగూడెంలో బస్తా మిల్లింగ్‌కు 6 రూపాయలు ఖర్చు అవుతుండగా గణపవరంలో 11 రూపాయలు ఖర్చు అవడం. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ధాన్యం ఉత్పత్తి పెరిగి ఇక్కడి నుండి బియ్యం ఎగుమతి మందగించడం. కుండీలలో నానబెట్టిన బాయిల్డ్ రైస్‌లో క్వాలిటీ లేకపోవడం. మిల్లు తిరిగినా... తిరగకపోయినా మినిమమ్ ఛార్జీ కింద నెలకు 50 వేల రూపాయలు బిల్లు విద్యుత్‌శాఖ వసూలు చేయడం.ఇత్యాది కారణాలతో గణప వరంలో మిల్లుల పరిశ్రమ నాశనమయినది.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.
"https://te.wikipedia.org/w/index.php?title=గణపవరం&oldid=3877791" నుండి వెలికితీశారు