గాలి భానుప్రకాష్

గాలి భానుప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయ నాయకుడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నగరి శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి రోజా చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇతను దివంగత రాజకీయనేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు. 2024 శాసనసభ ఎన్నికల్లో నగరి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[1][2]

జీవిత విశేషాలు మార్చు

భానుప్రకాష్ 1991 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్య పూర్తి చేశాడు. 1993 లో వికాస్ జూనియర్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 1997 లో ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన ఎంజె కాలేజ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, 2000 సంవత్సరంలో అమెరికాలోని బ్రిడ్జ్‌పోర్ట్ విశ్వవిద్యాలయం నుంచి పిజి సాధించాడు.[3]

మూలాలు మార్చు

  1. "పుత్తూరులో 'ప్రజాగళం' రేపు". EENADU. Retrieved 2024-03-26.
  2. Vennelakanti, Pradeep (2024-02-25). "Tirupati: TDP names 3 new faces from Chittoor in first list". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-26.
  3. "Gali Bhanu Prakash(TDP):Constituency- NAGARI(CHITTOOR) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-03-26.