చామర్తి కనకయ్య తెలుగు రచయిత. ఆయన కనక ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు.[1]

విశేషాలు మార్చు

ఇతడు తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు గ్రామంలో 1933, అక్టోబర్ 24వ తేదీన జన్మించాడు.ఇతడు ఇంగ్లీషు తెలుగు భాషలలో పట్టభద్రుడు. ఇతడు తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీవిరమణ చేశాడు.

రచనలు మార్చు

  1. అద్దానికి అటూ ఇటూ
  2. ఒప్పందం
  3. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
  4. పతివ్రత
  5. ఇంద్రధనుస్సులో సంగీతం
  6. విరజాజి మరుమల్లి

పురస్కారాలు మార్చు

  1. 2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం.

మరణం మార్చు

ఇతడు 2010, ఫిబ్రవరి 21వ తేదీన కాకినాడలో మరణించాడు.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు