జటావల్లభుల పురుషోత్తము
జటావల్లభుల పురుషోత్తము రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన బొంబాయి కార్యస్ధానముగా నడచుచున్న సంస్కృత విశ్వపరిషత్తు స్ధాపక సభ్యులలో ఒకడు. ఈయన తూర్పుగోదావరి జిల్లా వాస్తవ్యులు. ఈయన 1906 లో తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయపురంలో జన్మించాడు. ఆయన తండ్రి (వేదశ్రౌతనిధి) కృష్ణసోమయాజులు.
జటావల్లభుల పురుషోత్తము | |
---|---|
![]() | |
జననం | 1906 ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లా |
వృత్తి | రచయిత |
తల్లిదండ్రులు |
|
విద్యాభ్యాసంసవరించు
- తండ్రి (వేదశ్రౌతనిధి) కృష్ణసోమయాజులు వద్ద సంస్కృత కాప్య పఠనము.
- నరేంద్రపురములో పుల్య ఉమామహేశ్వర శాస్త్రి వద్దను, నరసాపురములో వేమూరి రామగోవిందశాస్త్రి వద్దను కావ్యనాటకాలంకార గ్రంథపఠనము, సాహిత్యోపకారక శాస్త్రాభ్యాసము,
- నంద్యాల, నరసాపురము, విజయనగరము లలో ఆంగ్లవిద్యాభ్యాసము,
- 1930 ఆంగ్లము అభిమాన విషయముగా బి.ఏ.,
- 1934 మద్రాసు విశ్వవిద్యాలయములో సంస్కృతాంధ్రములు అభిమాన విషయములుగా ఎం.ఏ.
ఉద్యోగముసవరించు
విశిష్టతసవరించు
ఆ కాలములో కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి వద్ద విద్యారణ్య వేదభాష్యపఠనము, కొన్ని వేదభాగములను సస్వరముగా అధ్యయనము చేయుట, వేదాన్త గ్రంథపఠనము, ధర్మశాస్త్ర వ్యాసంగములో విశేష శ్రద్ధ.
రచనలుసవరించు
- 1933 “వేదకాలపు స్త్రీలు”,
- 1935 “స్మృతికాలపు స్త్రీలు”,
- 1941 “హిందూ మతము”,
- 1948 “భగవద్గీతాప్రవేశము”,
- 1956 “చిత్రశతకము (సంస్కృతము)”,
- 1957 “భారతీయవైభవము”, ”స్మృతి ధర్మమంజరి”
సాహిత్య సేవలుసవరించు
1931 నుండి 1957 ఆంధ్రదేశములోని వివిధ ప్రాంతములలో సహస్రాధికోపన్యాసముల మూలముననూ, బహు పత్రికలలో అనేక శత వ్యాసముల మూలముననూ హిందూ మత ప్రచారము. 1946 ఆంధ్రరాష్ట్ర బ్రాహ్మణ మహాసభాస్థాపనము. ౧౯౫౧ లో స్ధాపింపబడి, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన బొంబాయి కార్యస్ధానముగా నడచుచున్న సంస్కృత విశ్వపరిషత్తు వ్యవస్ధాపక సభ్యులలో ఒకడు.
మూలాలుసవరించు
- పై పరిచయము, తొయ్యేటి భానుమూర్తి "భారతీయ వైభవము” లో, గ్రంథకర్త జటావల్లభుల పురుషోత్తము గురించి వ్రాసినది.
- మూలం: "భారతీయ వైభవము" - రచన: జటావల్లభుల పురుషోత్తము, 1957, విజయవాడ.