తలారి రుద్రయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వేపంజేరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

తలారి రుద్రయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1983 - 1985
ముందు బంగాళా ఆరుముగం
తరువాత గుమ్మడి కుతూహలమ్మ
నియోజకవర్గం వేపంజేరి

వ్యక్తిగత వివరాలు

జననం 1930
తలారిపల్లె, రామకృష్ణాపురం పంచాయితీ, పెనుమూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 29 జులై 2016
తిరుపతి, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
నివాసం తలారిపల్లె

రాజకీయ జీవితం

మార్చు

తలారి రుద్రయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 1983లో జరిగిన శాసనసభ ఎన్నికలలో వేపంజేరి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంగాళా అరుముగన్ చేతిలో 20591 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1985లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి కుతూహలమ్మ చేతిలో 5707 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1][2]

తలారి రుద్రయ్య 1989లో జరిగిన శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి కుతూహలమ్మ చేతిలో 17790 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేశాడు.

మూలాలు

మార్చు
  1. Andhrajyothy (28 May 2022). "నాయకుడంటే.. ఇలా కదా ఉండాలి!". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. Sakshi (30 July 2016). "మాజీ ఎమ్మెల్యే తలారి రుద్రయ్య కన్నుమూత". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.