తాతయ్య ప్రేమలీలలు

తాతయ్య ప్రేమలీలలు చిరంజీవి, నూతన్ ప్రసాద్ నటించిన తెలుగు చిత్రం.[1][2] ఇది 1980 లో విడుదలైంది. ఎం ఎస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.వి. ప్రసాద్ దర్శకుడు, రాజన్ నాగేంద్ర సంగీత దర్శకులు. గోవిందరాజు సీతాదేవి రచించిన "తాతయ్య - గర్ల్ ఫ్రెండ్" నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

తాతయ్య ప్రేమలేఖలు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
నిర్మాణం ఎమ్.ఎస్.రెడ్డి
తారాగణం నూతన్ ప్రసాద్ ,
చిరంజీవి,
దీప,
సీమ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

కథ సవరించు

నూతన్ ప్రసాద్ ఒక ధనవంతుడు. అతని కుమారుడు తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుని, అత్యాధునిక ఆధునిక సంస్కృతిలో పెరిగే తన పిల్లలతో (చిరంజీవి, దీప) బొంబాయిలో స్థిరపడతాడు. భార్గవ్ (చిరంజీవి) కు, అతని మరదలు గీతకూ (వారి గ్రామంలో ఉంటుంది) పెళ్ళి చెయ్యాలని నూతన్ ప్రసాద్ కోరుకుంటాడు. పెళ్ళి ప్రతిపాదనతో అతను బొంబాయి వెళ్తాడు. భార్గవ్ ఓ పల్లెటూరి పిల్లను పెళ్ళి చేసుకునే మానసిక స్థితిలో లేడనీ, అతను ఇప్పటికే సీమ అనే అమ్మాయి వలలో చిక్కుకున్నాడనీ అతడు తెలుసుకుంటాడు. సీమ ఒక అవకాశవాది అని కూడా తెలుసుకుంటాడు. నూతన్ ప్రసాద్ ధనవంతుడైన వృద్ధుడిగా నటించి సీమాతో రొమాన్స్ చేస్తాడు.

ధనాశ గల సీమా ఆ వృద్ధుడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. భార్గవ్‌ను వదిలివేస్తుంది. సీమా నిజమైన తత్వమేమిటో తెలుసుకున్న భార్గవ్, గీతను పెళ్ళి చేసుకోవడానికి అంగీకరిస్తాడు.[3]

నటీనటులు సవరించు

పాటలు సవరించు

  • వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం [4]

మూలాలు సవరించు

  1. "Chiranjeevi movie list - Telugu Cinema hero".
  2. "Chiranjeevi Filmography".
  3. "Thathayya Premaleelalu".
  4. "తాతయ్య ప్రేమలీలలు". తెలుగు లిరిక్స్. Retrieved 2020-08-03.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]