పుంగనూరు

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పట్టణం

పుంగనూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం.ఈ ఊరికి "దేవాలయాల పట్టణం" అని ముద్దు పేరు ఉంది. బ్రిటిష్ హయాంలో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉంది. అలాగే అమర శిల్పి జక్కన్న కుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ప్రముఖ ఆకర్షణ.

పట్టణం
పటం
Coordinates: 13°22′N 78°35′E / 13.37°N 78.58°E / 13.37; 78.58
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండలంపుంగనూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం
32.28 కి.మీ2 (12.46 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం
54,746
 • సాంద్రత1,700/కి.మీ2 (4,400/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1010
Area code+91 ( 8581 Edit this on Wikidata )
పిన్(PIN)517247 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

పేరు వ్యుత్పత్తి

మార్చు

పుంగనూరు అసలు పేరు పరుశురామక్షేత్రం. కాల గమనంలో పుంగ పురంగా మారి నేడు పుంగనూరుగా పిలువబడుతున్నది.

చరిత్ర

మార్చు

తిమ్మ రాయలు సంతతి వారు పుంగనూరు జమీందారలుగా వుండే వారు. 1866 లో ఈ సంస్థానంలో ఒక అందమైన రాజ భవనాన్ని నిర్మించారు. స్వాతంత్ర్యానంతరం జమీందారి వ్వవస్థ రద్దు కావడంతో వారు బెంగుళూరుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. దాంతో ఈ రాజమహలు కళా హీనమై వన్నె కోల్పోయింది. ఒకప్పుడు ఈ మహల్ లో గ్రంథాలయం, మ్యూజియం వుండేవి. కాల క్రమంలో అవి కనుమరుగయ్యాయి. వెనుక భాగంలో అత్యంత కళాకాంతులుతో వున్న కళ్యాణ మంటపం ఉంది. గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి ఉంది. ఇక్కడే ఒక బావి ఉంది. గతంలో నేరస్తులకు మరణ శిక్ష విధించి ఈ బావిలో వడవేసె వారని వారి ఆత్మలు ప్రస్తుతం ఈ మహల్ లో తిరుగుతున్నాయని ఇక్కడి జనుల నమ్మకం. దానికి నివారణగా "అష్టబంధనం" అనే మంత్రాన్ని చక్కలపై చెక్కించి గోడలకు తగిలించే వారు. అవి ఈ నాటికి ఉన్నాయి. రాజ ప్రసాదంనుండి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కల బండ వరకు సొరంగ మార్గం వుండేదని, అదిప్పుడు పూడుక పోయిందని అంటారు. ప్రస్తుతం ఈ రాజ మహల్ శిథిలావస్థలో ఉంది.[2]

ఈ గ్రామంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. బ్రిటిష్ హయాములో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉంది. అలాగే అమర శిల్పి జక్కన్న కుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతర ఎంతో ప్రాముఖ్యత గలది. ఈ జాతరకు కర్ణాటక, తమిళనాడు ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.పుంగనూరు చింతపండు, పశువుల వ్యాపారంలో దేశం లోనే ప్రఖ్యాతి గాంచింది. ఈ తాలూకాలో ప్రసిద్ధి చెందిన బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది.

పుంగనూర్ అసలు పేరు పరుశురామక్షేత్రం. కాల గమనంలో పుంగ పురంగా మారి నేడు పుంగనూరుగా పిలువ బడు తున్నది. తిమ్మ రాయలు సంతతి వారు పుంగ నూరు జమీందారలుగా వుండే వారు. 1866 లో ఈ సంస్థానంలో ఒక అందమైన ప్యాలెస్ ను నిర్మీంచారు. స్వాతంత్ర్యానంతరం జమీందారి వ్వవస్థ రద్దు కావడంతో జమీందార్లు బెంగుళూరుకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. దాంతో ఈ రాజ మహలు కళా హీనమై వన్నె కోల్పోయింది. ఒకప్పుడు ఈ మహల్ లో గ్రంథాలయం, మ్యూజియం వుండేవి. కాల క్రమంలో అవి కనుమరుగయ్యాయి. ప్యాలెస్ వెనుక భాగంలో అత్యంత కళాకాంతులుతో వున్న కళ్యాణ మంటపం ఉంది. గత వైభవానికి సాక్షిగా ఇది ఇంకా నిలబడి ఉంది. ఇక్కడే ఒక బావి ఉంది. గతంలో నేరస్తులకు మరణ సిక్ష విధించి ఈ బావిలో వడవేసే వారని వారి ఆత్మలు ప్రస్తుతం ఈ మహల్ లో తిరుగుతున్నాయని ఇక్కడి జనుల నమ్మకం. దానికి నివారణగా "అస్టబందం" అనే మంత్రాన్ని చక్కలపై చెక్కించి గోడలకు తగిలించే వారు. అవి ఈ నాటికి ఉన్నాయి. రాజ ప్రసాదంనుండి మూడు కిలోమీటర్ల దూరంలో వున్న నక్కల బండ వరకు సొరంగ మార్గం వుండేదని, అదిప్పుడు పూడుక పోయిందని అంటారు. ప్రస్తుతం ఈ రాజ మహల్ శిథిలావస్థలో ఉంది.

#పుంగనూరు పుణ్యక్షేత్రం దర్శనభాగ్యం మహాయోగం పుంగనూరుకు పరుశరామక్షేత్రం, పుంగపురి, పులినాడు అనే పేర్లతోను పిలుస్తారు

పుంగనూరు జమీందారుల పాలనలో ఉండేది

సుగుటూరు నుండి గంగమ్మ అనే దేవత పుంగనూరు నందు వచ్చి వెలసింది ఆమెనే గ్రామదేవతగా అక్కడ వారంతా కొలుస్తారు

జమీందారులు వారింటి ఇలవేల్పుగా గంగమ్మను కొలిచేవారు

ఏడాదికి ఒక్కసారి ఆమెకు జరిగే రెండురోజుల జాతర  చాలా విశేషంగా చెప్పదగింది ప్రతి ఏడాది హోలీపండుగ రోజు కామ దహనం చేసి  చాటు పెడ్తారు ఆ తరువాత వచ్చే మంగళవారం బుధవారం గంగమ్మ జాతరను నిర్వహిస్తారు

హొలీ తరువాత ఉగాది మధ్యలో జాతర  జరుపుకుంటారు

గంగమ్మ గురించి ఎన్నో కథలు వినబడ్డాయి....

ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తూ పొలంలో సేదతీరుతుండగా అతనికి ఎండ తగలకుండా నీడగా ఒక పాము పడగవిప్పి ఉండగా ఒక ముని గమనించి ఆ వ్యక్తి గొప్పవాడైతాడని తలచి అదే మాట అతడితో చెప్పగా అతడు నవ్వి కష్టాల్లో ఉన్న నేను గోప్పోడేలా స్వామి అని ప్రశ్నించగా

ముని తన తపోశక్తితో చూసి తన పొలంలో ఒక నిధి ఉన్నదని ఆ నిధిని తీసుకుని ఒక రాజ్యాన్ని స్థాపించమని ఆ సంపదతో పాటు అమ్మవారి విగ్రహం ఉన్నదని ఆమెను ఇంటి ఇలవేల్పుగా కొలవమని చెప్తాడు

అలా జమిందారుగా ఆయన పుంగనూరును పాలించారు

మరొక కథ గంగమ్మను ఒక దున్నపోతు తరుముకోగా పరుగులు పెట్టిన ఆమె సుగుటూరు నుండి పుంగనూరు దాకా పరిగెడుతూనే రాగ పుంగనూరు ప్రజలు అందరూ ఏకమై ఆమెను ఆ దున్నపోతు నుండి రక్షించగా ఆమె పుంగనూరు లోనే కొలువుండిపోయింది అని చెబుతారు

ఆమె అదేరోజు అందరి కలలోను కనబడి ఆమె ఆగిన ఆ చోట గుడి కట్టమని ఆమెను తరుముకున్న దున్నపోతును ఆమెకు ఏడాదికొక్కసారి జాతర నిర్వహించి బలి ఇవ్వాల్సిందిగా చెప్పండంతో ఆ సంప్రదాయాన్ని ఇప్పటికి పాటిస్తూనే ఉన్నారు అక్కడి ప్రజలు

వారివారి కోరికలు నెరవేరడంతో పోటేళ్లను కోళ్ళు బలిస్తారు ప్రజలు

ఆ గంగమ్మ మొదటి పూజ జమీందారుల నుండి అందుకుంటుంది

ఆమె బెస్తవాళ్లకు ఆడపడుచని

గొల్ల వాళ్ళ ఇంటి కోడలని అంటారు

రెండ్రోజులు జాతరలో ఆమె ఎంతో ఆనందంగా గడిపి గురువారం చాలా బాధతో నిమ్మజానం అయ్యి తిరిగి వెళ్ళిపోతుంది

పక్కరాష్టాలనుండి సైతం ప్రజలు తండోపతండాలుగా వచ్చి వెళ్తుంటారు ఆమె దర్శనం కోసం

మొదటిరోజు అమ్మను జమీందారుల భవనం నుండి ఆమెకు తల పులిమి స్నానం చేపించి ఒళ్ళంతా పసుపురాసి ఆమెను అలంకరించు  పూజలు నిర్వహించి బయటకు తెస్తారు అప్పుడు ఆమె ముఖకవళికలు ఎప్పుడెప్పుడు ప్రజలను చూస్తానా అన్నట్టు ఉంటుంది

అదేరోజు రాత్రి ఆమెకు వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆమె స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది

చలువ పిండి దీపాలతో కొలుస్తారు

అంబలి పోసి ఆమెను చల్లబరుస్తారు

భౌగోళికం

మార్చు

మదనపల్లె కు దక్షిణంగా 25 కి.మీ. దూరంలో వుంది.

జనగణన వివరాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణం 12767 ఇళ్లతో, 54767జనాభాతో 1193 హెక్టార్లలో విస్తరించి ఉంది. పట్టణంలో మగవారి సంఖ్య 27567, ఆడవారి సంఖ్య 27654.[3]

విద్యా సౌకర్యాలు

మార్చు

అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల వలసపల్లెలో ఉంది. సమీప వైద్య కళాశాల తిరుపతిలోను, పాలీటెక్నిక్ మదనపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల చిత్తూరులోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

మార్చు

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి.

భూమి వినియోగం

మార్చు

పుంగనూరు (రురల్)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 249 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 207 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 40 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 31 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 11 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 80 హెక్టార్లు
  • బంజరు భూమి: 197 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 373 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 535 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 116 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 116 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

వేరుశనగ, వరి, మొక్కజొన్న, చింతపండుకు ప్రసిద్ధి.

పర్యాటక ఆకర్షణలు

మార్చు

బోయకొండ గంగమ్మ జాతర

మార్చు

ఇక్కడ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉంది. ఇక్కడ జరిగే జాతరకు కర్ణాటక, తమిళనాడు ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారు.

దేవాలయాలు

మార్చు

ప్రముఖులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "History of Punganuru". Archived from the original on 2013-11-27. Retrieved 2022-06-28.
  3. "Office of the Registrar General & Census Commissioner, India – Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పుంగనూరు&oldid=4482770" నుండి వెలికితీశారు