పోలాప్రగడ సత్యనారాయణమూర్తి

పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి (1929 - ?) ప్రముఖ కథా రచయిత. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1929లో జన్మించాడు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత భీమవరం, అనంతపురం, ఏలూరు, బాపట్లలో ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేశాడు. 1947లో కథలు రచించడం మొదలుపెట్టాడు.

పోలాప్రగడ సత్యనారాయణమూర్తి
పోలాప్రగడ సత్యనారాయణమూర్తి
జననంపోలాప్రగడ సత్యనారాయణమూర్తి
1929
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు
ఇతర పేర్లుపోలాప్రగడ సత్యనారాయణమూర్తి
ప్రసిద్ధిప్రముఖ కథా రచయిత.
భార్య / భర్తపోలాప్రగడ రాజ్యలక్ష్మి

ఈయన రచనలలో కౌసల్య (1984), భోగి మంటలు (1965), దీపశిఖ (1968), సంఘం చేసిన మనిషి (1970), కవి సార్వభౌమ (1972), నవోదయం (1973), ప్రేమాయణం (1980), సదువుకున్న మారాజులు (1981), ప్రేమకలాపం (1986), మనసిచ్చి చూడు (1983) మొదలైన నవలలు, ఆరోజుల్లో అనే వ్యాస సంపుటి ముఖ్యమైనవి. ఆయన దాదాపు 120 పైగా చక్కని కథలు రచించారు. తల్లిదండ్రులు, రామరాజ్యం, ప్రేమాయణం మొదలైన సినిమాలకు కథలు వ్రాశాడు. రేడియో నాటకాలు కూడా రాశాడు. జాతీయ దూరదర్శిని సీరియల్ 'అప్నా అప్నా ఆస్మాన్' కథా రచయితగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.

1964లో ఆంధ్రప్రభ నవలలో ద్వితీయ బహుమతి, 1989లో స్వాతి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందాడు. 1971లో ఉత్తమ సినీ కథా రచయితగా నంది అవార్డు, 1992లో రవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డు పొందాడు.

ఆయన భార్య పోలాప్రగడ రాజ్యలక్ష్మి కూడా ప్రఖ్యాత రచయిత్రి.

పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి రచించిన పొత్తుల బావి నవల నుండి మార్చు

నీటి బొట్టుకి నోచుకోని కరువు ప్రాంతం అది. ఉరి ప్రజలందరికి ఊపయోగపడుతుందని లక్షలు ఖర్చు పెట్టి తాత బావి తవ్విస్తే, తన ఆనందానికి అనుగుణంగా కొడుకు దాన్ని విభజించి పొత్తుల బావిని చేశాడు. మనవడి రాక్షస రాజకీయాలు వచ్చే సరికి అది కాస్తా చెత్త కుండీగా మారింది. అయితే బండ బారిన గుండేల్లో మమతలు పండిస్తే, ప్రేమామృతాన్ని పండించనూ వచ్చు కన్నీళ్ళ కడలిలో మునిగిపోయిన జన జీవనాన్ని వడ్డున్న దిక్కుకూ చేర్చనూ వచ్చు ఈ నిజాన్ని తరాల వ్యత్యాసంలో సుతారంగా మలచి అందిచిన నవలే పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు రచించిన పొత్తుల బావి నవల.