బొత్స అప్పలనర్సయ్య

బొత్స అప్పలనర్సయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

బొత్స అప్పల నర్సయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం గజపతినగరం నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గం గజపతినగరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
గజపతినగరం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గురు నాయుడు
జీవిత భాగస్వామి అనురాధ
బంధువులు బొత్స సత్యనారాయణ (అన్న)

జననం, విద్యాభాస్యం మార్చు

బొత్స అప్పలనర్సయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గజపతినగరంలో 1964లో జన్మించాడు. ఆయన బి.ఈ పూర్తి చేసి విజయనగరం ఎస్సీ కార్పొరేషన్‌లో డీఈగా ఉద్యోగం సంపాదించాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

బొత్స అప్పలనర్సయ్య తన అన్న బొత్స సత్యనారాయణ స్పూర్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001లో బొండపల్లి, 2006లో దత్తిరాజేరు జెడ్పీటీసీగా గెలిచాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పడాల అరుణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అప్పలనర్సయ్య 2014లో జరిగిన ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపన పోటీ చేసి ఓడిపోయి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (27 March 2019). "గజపతినగరంలో పాగావేసేదెవరు..?". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.