బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు
బొత్స సత్యనారాయణ (జననం 9 జూలై 1958) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రిగా నియమితులయ్యారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతను 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. [1][2]
బొత్స సత్యనారాయణ | |||
![]() బొత్స సత్యనారాయణ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
నియోజకవర్గం | చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
అసెంబ్లీ సభ్యులు
| |||
పదవీ కాలం 2004 - 2011 | |||
ముందు | గద్దె బాబూరావు | ||
నియోజకవర్గం | చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 1999 - 2004 | |||
ముందు | పడాల అరుణ | ||
తరువాత | పడాల అరుణ | ||
నియోజకవర్గం | బొబ్బిలి లోక్ సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ | 1958 జూలై 9||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | బొత్స ఝాన్సీ | ||
సంతానం | ఒక అబ్బాయి( సందీప్ ), ఒక అమ్మాయి ( అనూష ) | ||
నివాసం | కోరాడ వీధి, విజయనగరం | ||
మతం | హిందువు | ||
మూలం | botsa.in లో వివరాలు (ఆర్కైవ్.ఆర్గ్) |
వ్యక్తిగత జీవితం సవరించు
- బొత్స విజయనగరంలో బొత్స గురునాయుడు ఈశ్వరమ్మ లకు 1958లో జన్మించారు.[3] ఈయన మహారాజా కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశాడు. ఇతని వివాహం బొత్స ఝాన్సీ లక్ష్మితో 1985లో జరిగింది. ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి నుండి 2006 లో,[4] విజయనగరం నుండి 2009 లో కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నుకోబడింది. సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్సీపీ నాయకుడు.[5]
రాజకీయ జీవితం సవరించు
- బొత్స సత్యనారాయణ 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు.[3] ఆనాడు ఎన్డీఏ హవా వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలని గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004, 2009 లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీ రాజ్ గృహ నిర్మాణ శాఖ,[6] రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పని చేశారు. ఇతను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.[7]
- 2009 హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు రోశయ్య, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది.
- 2015 లో, బొత్స ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం, మద్దతుదారులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు.[6] 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.[8]
వనరులు సవరించు
- ↑ https://www.thenewsminute.com/article/jagans-25-sworn-full-list-andhra-cabinet-ministers-103242
- ↑ TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ 3.0 3.1 "Botsa Member of Parliament".
- ↑ Saxena, Priya (7 December 2006). "KCR's record win in Karimnagar, Congress wrests Bobbili". RxPG News. Archived from the original on 15 జూలై 2011. Retrieved 3 December 2010.
- ↑ "Botsa family politicians".
- ↑ 6.0 6.1 Chandrashekhar, B. (7 June 2015). "Botcha joins YSR Congress along with kin, followers" – via www.thehindu.com.
- ↑ "Botsa PCC Chief".
- ↑ "పురపాలక శాఖ మంత్రి బొత్స-3 క్యాపిటల్స్".