భరత్ అరుణ్

భారతీయ క్రికెటర్

1963, డిసెంబర్ 14ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించిన భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. బౌలింగ్ లో మీడియం పేసర్ గా, బ్యాటింగ్ లో క్రింది వరుసలో ఆడేవాడు. 1986-87 లో దులీప్ ట్రోఫి సెమీపైనల్స్ లో సౌత్ జోన్ తరపున ఆడుతూ 149 పరుగులు చేయడమే కాకుండా 7 వ వికెట్టుకు డబ్ల్యూ.వి.రామన్తో కలిసి 221 పరుగులు జోడించాడు [1]. అండర్-25 లో శ్రీలంక పై 107 (నాటౌట్) పరుగులు చేసి జాతీయజట్టులో స్థానం సంపాదించి తొలి టెస్ట్ శ్రీలంకపైనే ఆడినాడు. 1979లో రవిశాస్త్రి నేతృత్వంలో శ్రీలంక పర్యటించిన అండర్-19 భారత జట్టులో కూడా ఇతను సభ్యుడే.

భరత్ అరుణ్

భరత్ అరుణ్ భారత జట్టు తరపున 2 టెస్టులు ఆడి 4 వికెట్లు సాధించాడు. ఇతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేక్షణ 76 పరుగులకు 3 వికెట్లు. ఇది శ్రీలంకపై తొలి టెస్టులో సాధించాడు. రంజీ ట్రోపీ లలో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మూలాలు మార్చు

  1. http://cricketarchive.com/Archive/Scorecards/47/47939.html