ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు
(ముత్తంసెట్టి శ్రీనివాసరావు నుండి దారిమార్పు చెందింది)

ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్ గా సుపరిచితులు) భారతీయ రాజకీయవేత్త, విద్యావేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ నందలి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అవంతి విద్యా సంస్థలు నడుపుతున్నాడు. ఈ విద్యా సంస్థలు విశాఖపట్నం నకు చెందిన అవంతీ ఎడ్యుకేషన్ సొసైటీ చే నడుపబడుచున్నవి. ఆయన 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈయన వైఎస్సార్సీపీ లో చేరి నియోజకవర్గం నుంచి గెలిచాడు.అనంతరం ఈయనకు మంత్రి పదవి వర్చింది[2][3].అతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడు[4]

అవంతి శ్రీనివాస్

భీమిలి శాసనసభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 – 2022 ఏప్రిల్ 10[1]
ముందు గంటా శ్రీనివాసరావు
నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 జూన్ 1967
ఏలూరు,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఎం.జ్ఞానేశ్వరి
సంతానం ప్రియాంక, వెంకట శివనందేష్‌
నివాసం విశాఖపట్నం
మతం హిందూ

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన జూన్ 12, 1967 లో వెంకటనారాయణ, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎం.జ్ఞానేశ్వరిని జూన్ 20, 1986న వివాహమాడాడు. వారికి కుమార్తె ప్రియాంక, కుమారుడు వెంకట శివనందేష్‌ ఉన్నారు.[5][6]

సెక్స్ ఆడియో టేప్ లీక్‌లు : మార్చు

అవంతి శ్రీనివాసరావు ఆడియో టేపు లీకేజీ అవంతి అతనిని ఇబ్బందికి గురి చేసింది."లవ్ యు డార్లింగ్" మరియు "లవ్ యు బంగారమ్" అంటూ అవంతి శ్రీనివాస్ మరియు మరో మహిళల మధ్య ఆరోపించిన ఆడియో టేప్.టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మరియు అతను కనికరం లేకుండా ట్రోల్ చేయబడ్డాడు.టేప్‌పై స్పందిస్తూ, తాను పరువు నష్టం కేసు పెడతానని, ఆ ఆడియో తనది కాదని ఆరోపించాడు[7].

రాజకీయ జీవితం మార్చు

ఆయన 2009 - 2014 మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యునిగా పనిచేశాడు. మే 2014 లో ఆయన 16వ లోక్ సభకు ఎన్నికైనాడు. లోక్ సభలో ఆయన రూరల్ కమిటీ సభ్యునిగానూ, పరిశ్రమల కమిటీకి సభ్యునిగానూ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు సభ్యునిగానూ ఉన్నాడు.[5]

జనవరి 21, 2016 న ఆయన రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసి తన నియోజకవర్గంలోని తుని, కొత్తవలస జంక్షన్ (వయా నర్శీపట్నం, చోడవరం, మాడుగుల) రైల్వే మార్గాన్ని రూ.16.82 కోట్లతో బడ్జెట్ లో కేటాయించేట్లు చేశాడు.[8]

మూలాలు మార్చు

  1. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  2. "Constituencywise-All Candidates". Archived from the original on 18 మే 2014. Retrieved 17 May 2014.
  3. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Bhattacharjee, Sumit (2019-03-27). "Caste factor to play a crucial role in Bhimili". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-02-02.
  5. 5.0 5.1 "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-04.
  6. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  7. Arikatla, Venkat (2022-11-14). "Sex talk audio lands Avanti in tight spot again!". greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-01.
  8. "Funds sanctioned for DPR on Tuni-KTV line". The Hindu (in Indian English). 2016-02-27. ISSN 0971-751X. Retrieved 2016-03-04.