మేఘ సందేశం (సినిమా)
మేఘసందేశం 1982 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒక కళాత్మక చిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ముఖ్య పాత్రల్లో నటించారు. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ చిత్రంలో పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పి. సుశీల, కె. జె. ఏసుదాసు, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు.
మేఘ సందేశం (1982 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
నిర్మాణం | దాసరి పద్మ |
కథ | దాసరి నారాయణ రావు |
చిత్రానువాదం | దాసరి నారాయణ రావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జయప్రద , జయసుధ, కొంగర జగ్గయ్య |
సంగీతం | రమేష్ నాయుడు |
సంభాషణలు | దాసరి నారాయణ రావు |
ఛాయాగ్రహణం | పి ఎన్ సెల్వరాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియెషన్స్ |
పంపిణీ | తారక ప్రభు ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 24 సెప్టెంబరు 1982 |
నిడివి | 151 ని |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
తారాగణంసవరించు
- అక్కినేని నాగేశ్వర రావు - రవీంద్ర బాబు
- జయసుధ - రవీంద్ర బాబు భార్య
- జయప్రద - పద్మ
- కొంగర జగ్గయ్య - రవీంద్ర బాబు బావ
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ - స్వయం
- సుభాషిణి
- సలీమా
సంగీతంసవరించు
క్రమసంఖ్య | పేరు | గీత రచన | నేపథ్యగానం | నిడివి |
---|---|---|---|---|
1. | "ఆకాశ దేశాన" | వేటూరి సుందర్రామ్మూర్తి | యేసుదాసు | |
2. | "ఆకులో ఆకునై పూవులో పూవునై" | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పి.సుశీల | |
3. | "పాడనా వాణి కళ్యాణిగా గానం -" | వేటూరి సుందర్రామ్మూర్తి | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |
4. | "ప్రియే చారుశీలె" | జయదేవ | యేసుదాసు | |
5. | "ముందు తెలిసెనా, ప్రభూ" | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పి.సుశీల | |
6. | "నవరస సుమ మాలిక" (పద్యం) | వేటూరి సుందర్రామ్మూర్తి | యేసుదాసు | |
7. | "నిన్నటిదాకా శిలనైనా" | వేటూరి సుందర్రామ్మూర్తి | పి.సుశీల | |
8. | "రాధికా కృష్ణా" | జయదేవ | యేసుదాసు | |
9. | "శీత వేళ రానీయకు రానీయకు" | దేవులపల్లి కృష్ణశాస్త్రి | పి.సుశీల, యేసుదాసు | |
10. | "సిగలో అవి విరులో" | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
బహుమతులుసవరించు
సంవత్సరం | ప్రతిపాదించిన విభాగం | పురస్కారం | ఫలితం |
---|---|---|---|
1983 | దాసరి నారాయణ రావు | జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు చిత్రం | విజేత |
రమేష్ నాయుడు | జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీతదర్శకులు | విజేత | |
పి సుశీల | జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయని | విజేత | |
కె జె యేసుదాస్ | జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ గాయుకుదు | విజేత | |
దాసరి నారాయణ రావు | నంది ఉత్తమ చిత్రాలు - స్వర్ణ నంది | విజేత | |
దాసరి నారాయణ రావు | ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం | విజేత |
విశేషాలుసవరించు
- ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన 200వ చిత్రం.
- ఈ చిత్రంలోని శ్రావ్యమైన గానానికి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకి ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది పురస్కారం లభించింది.
- ఈ చిత్రం మలయాళంలో కూడా ఇదే పేరుతో డబ్ చేయబడింది.