మేదరమెట్ల
దీనితో పోలిన పేరుగల తెలంగాణా రాష్ట్రంలోని మరియొక గ్రామం కొరకు, మేదరమట్ల చూడండి.
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°43′00″N 80°01′00″E / 15.716667°N 80.016667°ECoordinates: 15°43′00″N 80°01′00″E / 15.716667°N 80.016667°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | కొరిశపాడు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 16 కి.మీ2 (6 చ. మై) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08593 ![]() |
పిన్(PIN) | 523212 ![]() |
మేదరమెట్ల బాపట్ల జిల్లా కొరిశపాడు మండలానికి చెందిన గ్రామం.
చరిత్రసవరించు
మేదర వృత్తి చేసేవారు తొలిగా గ్రామంలో ఆవాసం ఏర్పరుచుకోవడం వల్ల మేదరమెట్ల గ్రామానికి ఆ పేరు ఏర్పడిందని గ్రామనామాలు అధ్యయనం చేసిన బాలగంగాధరరావు పేర్కొన్నాడు.[1]
ఈ గ్రామాభివృద్ధికి 1949 నుండి 1986 వరకూ యర్రం కోటిరెడ్డి, మన్నే సీతారామయ్య తదితరులు కృషిచేశారు. 1986 నుండి 2001 వరకూ, 15 ఏళ్ళపాటు సమస్యాతకంగా ముద్ర పడిన తదుపరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సిమెంటురోడ్లు ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్ ఏర్పడటంతో భూముల ధరలు పెరిగినవి. భారీ పరిశ్రమలు ఏర్పడటంతో ఉపాధి అవకాశాలు మెరుగైనవి. [2] ఈ గ్రామ సమీపంలో తమ్మవరం వెళ్ళే దారిలో మిరపకాయలను వినియోగించి నూనె తీసే ఒక కర్మాగారం 2013లో ఏర్పాటుచేసారు. ఈ కర్మాగారంలో సుమారు 600 మందికి పైగా పనిచేస్తున్నారు.</ref> ఈనాడు ప్రకాశం; 2016, సెప్టెంబరు-26,3వపేజీ.</ref>
భౌగోళికంసవరించు
సమీప గ్రామాలుసవరించు
కొరిశపాడు 4 కి.మీ, కొత్తకోట 4 కి.మీ, బొడ్డువాని పాలెం 5 కి.మీ, రావినూతల 5 కి.మీ, కుర్రావానిపాలెం 7 కి.మీ.
గ్రామ పంచాయతీసవరించు
విద్యా సౌకర్యాలుసవరించు
ఇక్కడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, శారద డిగ్రీ కళాశాల వున్నాయి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు, హ్యాండ్ బాల్ పోటీలలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో తమ సత్తా చాటుచున్నారు [5] ఈ పాఠశాల విద్యార్థి పి.సాయికిరణ్, స్కూల్ గేంస్ ఫెడెరేషన్ ఆధ్వర్యంలో 2015, నవంబరు-14 నుండి 17 వరకు, పశ్చిమగోదావరి జిల్లాలోని నారాయణపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ పోటీలలో తన ప్రతిభ చాటి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనాడు. [6]
మౌలిక వసతులుసవరించు
రవాణ సౌకర్యాలుసవరించు
జాతీయ రహదారి 16, నార్కెట్పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి లకు కూడలి ఈ గ్రామం దగ్గరలోనే వున్నది.
రక్షిత మంచినీటి పథకంసవరించు
స్థానిక తమ్మవరం రహదారిలో నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ పథకానికి, తమ్మవరం ద్వారా, గుండ్లకమ్మ జలాశయం నీరు వచ్చుచున్నది. ఈ నీటిని ఫిల్టర్లద్వారా శుద్ధిచేసి, చుట్టుప్రక్కల 22 గ్రామాలకు పంపవలసియుండగా, ప్రస్తుతం పది గ్రామాలకే ఈ శుద్ధినీరు పంపించున్నారు[7]
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.సవరించు
ఈ ఆరోగ్యకేంద్రం పరిధిలో మణికేశ్వరం, కొంగపాడు, వేలమూరిపాడు, విప్పర్లపాలెం, రాజీవ్ కాలనీ, వెంకటాపురం గ్రామాలు ఉన్నాయి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు
- శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం:గ్రామంలోని అద్దంకిరోడ్డులోని ఈ ఆలయంలో, వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించెదరు.
- శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం
- శ్రీ షిర్డీ సాయి మందిరం
ప్రధాన పంటలుసవరించు
వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులుసవరించు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులుసవరించు
- వై.వి.సుబ్బారెడ్డి - రాజకీయనాయకుడు. లోకసభ సభ్యుడు.
మూలాలుసవరించు
- ↑ "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక". Archived from the original on 2014-09-02. Retrieved 2014-03-16.
- ↑ ఈనాడు ప్రకాశం; జులై-20,2013. 8వపేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం/అద్దంకి, సెప్టెంబరు 26, 2013.
- ↑ ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-10; 2వపేజీ.
- ↑ ఈనాడు ప్రకాశం; 2014, డిసెంబరు-21; 9వపేజీ
- ↑ ఈనాడు ప్రకాశం; 2015, నవంబరు-26; 15వపేజీ.
- ↑ .ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, జూన్-15; 1వపేజీ.