రైతు స‌మ‌న్వయ స‌మితి

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సహకార సంస్థ.

రైతు స‌మ‌న్వయ స‌మితి, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవసాయ సహకార సంస్థ.[2] ఈ కమిటీల ద్వారా గ్రామస్థాయిలో రైతు పెట్టుబడి సహాయ పథకం, రైతుబంధు పథకంలను పంపిణీ చేస్తుంటారు. తెలంగాణ శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గా ఉన్నాడు.[3][4]

రైతు స‌మ‌న్వయ స‌మితి
స్థాపనమార్చి 2018[1]
వ్యవస్థాపకులుకె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి
రకంవ్యవసాయ సహకార సంస్థ
కేంద్రీకరణవ్యవసాయం
కార్యస్థానం
  • సంగారెడ్డి
మూలాలుSoyaben
సేవా ప్రాంతాలుతెలంగాణ
ముఖ్యమైన వ్యక్తులుచైర్మన్: పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్సీ)
ఉద్యోగులురైతు

చరిత్ర మార్చు

రైతులకు పథకాలు సక్రమంగా అందించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ కమిటీని ప్రకటించగా,[5] 2018 ఫిబ్రవరి 26న అమలులోకి వచ్చింది.

సంస్థ మార్చు

రాష్ట్రంలోని 1,61,000 మంది రైతులు సభ్యులుగా ఈ సమితి ఏర్పడింది. వివిధ స్థాయిలలోని రైతు కమిటీలు:

  • గ్రామస్థాయి - 15 మంది సభ్యులు
  • మండలస్థాయి - 24 మంది సభ్యులు
  • జిల్లాస్థాయి - 24 మంది సభ్యులు
  • రాష్ట్రస్థాయి - 42 మంది సభ్యులు

రాష్ట్ర స్థాయి కమిటీలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ నిపుణులు, రైతులు ఉంటారు. ప్రభుత్వం ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించింది.

కార్పోరేషన్ మార్చు

లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభించబడిన కార్పోరేషన్‌లోని సభ్యులు వ్యవసాయ కార్యకలాపాలైన విత్తనాలను విత్తడం, ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు అమ్మడం వంటి విషయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సివుంటుంది. రైతులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, చర్చించుకోవడానికి, ఇతర రైతులతో అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రతి 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున 2,630 రైతు సంఘ భవనాలు నిర్మించబడతాయి. 137 రైతు వేదికల నుండి మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా పనిచేస్తాయి.

చైర్మన్లు మార్చు

మూలాలు మార్చు

  1. "TELANGANA RASHTRA RYTHU SAMANVAYA SAMITHI". Zauba Corp. Archived from the original on 17 ఏప్రిల్ 2021. Retrieved 17 April 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Tel govt to form farmers' coordination committee | Business Standard News
  3. Relief for Telangana farmers as Budget allocates ₹12,000 cr for ‘Rythu Lakshmi’ scheme - Business Line
  4. Maitreyi, Melly (15 March 2018). "Telangana Budget 2018-19 accords priority to agriculture, irrigation and power sectors". The Hindu. Retrieved 20 February 2020.
  5. Telangana government to set up a new corporation for farmers- The New Indian Express
  6. New indian express (17 Nov 2019). "KCR names Palla Rajeshwar Reddy as chairman of farmers' committee". The New Indian Express. Archived from the original on 1 April 2021. Retrieved 1 April 2021.