లాలా లజపతిరాయ్
భారతీయ రచయిత మరియు రాజకీయవేత్త
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
లాలా లజపత్ రాయ్ (జనవరి 28, 1865 - నవంబరు 17, 1928) (ఆంగ్లం : Lala Lajpat Rai) - (పంజాబీ భాష : ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; హిందీ భాష : लाला लाजपत राय) భారత్ కు చెందిన రచయిత మరియు రాజకీయనాయకుడు. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం జనవరి 28, 1865, మరణం నవంబరు 17, 1928. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు పంజాబ్ కేసరి అనే బిరుదును నొసంగారు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.
sing saheb | |
---|---|
జనవరి 28, 1865 - నవంబరు 17, 1928 | |
![]() పంజాబ్ కేసరి | |
జన్మస్థలం: | ఫిరోజ్పూర్., పంజాబ్, భారతదేశం |
ఉద్యమము: | భారత స్వతంత్ర సంగ్రామం |
ప్రధాన సంస్థలు: | భారత జాతీయ కాంగ్రెస్, ఆర్య సమాజ్ |
లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ (బాలగంగాధర తిలక్), పాల్ (బిపిన్ చంద్రపాల్) త్రయం, ఆకాలంలో ల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి. వీరిలో ఒకడు.
1928 లో భారతదేశ పర్యటనకు వచ్చిన సైమన్ విచారణ సంగము (సైమన్ కమిషన్ ) ను వ్యతిరేకించుతు
లలా లజపతిరాయి చేసిన ఆందోళన బ్రిటిష్ ఇండియా చరిత్రలో చాల ప్రముఖమైనది. 1920-30 దశాబ్దములో జాతీయకాంగ్రెస్సు వారి మెత్తదనపు మితవాద సిద్దాంతమును విడనాడి తీవ్రజాతీయవాదు లలో లాలా లజపతిరాయి ప్రముఖుడు. 1924 ట్రిబ్యూన్ అను పత్రికలో అనేక వ్యాసములు ప్రచురించెను తద్వార కాంగ్రెస్సు వారు తమ తరఫున హిందు మహాసభ ను ప్రతినిధిగా నియమించవలసినదని ప్రతిపాదించాడు