వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2007 45వ వారం

విఠలేశ్వరుడి ఆలయ సముదాయంలో ఉన్న ఏకశిలా రథం
విఠలేశ్వరుడి ఆలయ సముదాయంలో ఉన్న ఏకశిలా రథం

విజయనగరం లేదా హంపి 13-15 శతాబ్ధముల మధ్య దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాలలో ఒకటైన విజయనగర సామ్రాజ్యపు రాజధాని, ఇప్పుడు ఒక చారిత్రాత్మక పట్టణం. ఈ విజయనగర అవశేషాలు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని హంపి గ్రామంలో కనిపిస్తాయి. ఈ పురాతన నగరములో ప్రసిద్ధమైన విరుపాక్ష దేవాలయం ఉన్నది. ఈ నగరానికి ప్రక్కన ఉన్నది హంపి అనే గ్రామము. హంపిని చరిత్రకారులు విజయనగర అవశేషాల సంగ్రహాలయంగా వర్ణిస్తారు. 1999 సంవత్సరములో హంపి యునెస్కో సంరక్షిస్తున్న చారిత్రక ప్రదేశాల జాబితాలో, ప్రపంచ వారసత్వపు‌ స్థలాలో ఒకటిగా చేరింది.

విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశానికి చెందిన హక్క రాయలు(హరిహర రాయలు),బుక్క రాయలు స్థాపించారు. హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రధాన పాత్ర చూపగా, తరువాత రాజ్యానికొచ్చిన ఈయన సోదరుడు బుక్క రాయలు రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యం ముందు తుంగభద్ర నది ఉత్తర తీరాన అనెగొందిని రాజధానిగా చేసి స్థాపించగా విద్యారణ్య స్వామి అధ్వర్యంలో రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరానికి తరలించి విజయనగరం అనే పేరుతో ఈ నగరాన్ని శత్రుదుర్భేద్యమైన రీతిలో నిర్మించారు. విజయనగరం అంటే విజయాన్ని ఇచ్చే నగరము అని అర్థం. పూర్తివ్యాసం: పాతవి