సంగమ వంశం

14వ శతాబ్దపు సామ్రాజ్య రాజవంశం
(సంగమ వంశము నుండి దారిమార్పు చెందింది)
విజయనగర సామ్రాజ్యం
సంగమ వంశం
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవ రాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢ రాయలు 1485
సాళువ వంశం
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశం
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీడు వంశం
అళియ రామ రాయలు 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ రాయలు 1572-1586
వెంకట II 1586-1614
శ్రీ రంగ రాయలు 2 1614-1614
రామదేవ రాయలు 1617-1632
వెంకట III 1632-1642
శ్రీరంగ రాయలు III 1642-1646

సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగిన సమయము.

సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు ఓరుగల్లు ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడా కొన్ని చరిత్రలలో ఉన్నది).

వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు విజయనగరమును పటిష్ఠమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కలఅ కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, ప్రపంచంలో సాటిలేని నగరంగా ప్రకాశించింది.

1336-1365: మొదటి హరిహర రాయలు రాజ్యము.

1356-1377: మొదటి బుక్క రాయలు రాజ్యము.

1377-1404: రెండవ హరిహర రాయలు రాజ్యము

1406-1422: మొదటి దేవరాయల రాజ్యము.

1426-1446: రెండవ దేవ రాయలు రాజ్యము (ప్రౌఢ దేవ రాయలు) - ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించాడు. ఈ ప్రౌఢ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. నికోలో కాంటే అనే ఇటలీ యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.

తరువాత బలహీనులైన రాజుల వల్ల క్రమముగా సంగమ వంశము క్షీణించి, వారసత్వ కలహాల వల్ల, విజయ నగర రాజ్యానికే ప్రమాదము వాటిల్లింది. 1485 నుండి సాళువ వంశము పాలన ప్రారంభమైనది. 1505 నుండి తుళువ వంశము పాలన ప్రారంభమైనది. తుళువ వంశములో శ్రీ కృష్ణ దేవరాయలు సర్వ ప్రసిద్ధుడైన చక్రవర్తి.

ఆధారాలు మార్చు

  • డా. బి.యస్.యల్. హనుమంతరావు గారి "ఆంధ్రుల చరిత్ర"
విజయనగర రాజులు  
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం
"https://te.wikipedia.org/w/index.php?title=సంగమ_వంశం&oldid=3923715" నుండి వెలికితీశారు