వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 12వ వారం

(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి)

బ్రాహ్మణగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామము. ఇది నిడదవోలు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామం చాగల్లు మండలం లోని ఒక ప్రముఖ పంచాయతి. ఈ ఊరి జనాభా సుమారుగా 12,000 వరకూ ఉంటుంది. పూర్వం "బాపన్న" అనే వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి మొదట నివాసం ఏర్పరుచుకున్నాడు. అతని పేరుమీదుగానే "బాపన్నగూడెం" అని పిలుస్తూ ఉండేవారు. కాల క్రమేణా అది బ్రాహ్మణగూడెంగా మార్పు చెందినది.


వూరిలో అధిక జనం వ్యవసాయం మీద అధారపడి జీవిస్తున్నారు. ఊరి వ్యవసాయం కోసం 3 చెరువులు ఉన్నాయి. అవి: ఉప్పుగుంట చెరువు, ప్రత్తిపాటి చెరువు, రావుల చెరువు. గ్రామీణ గ్రంథాలయం, 3 కమ్యూనిటి హాళ్ళు ,పశు వైద్యశాల, త్రాగునీటి అవసరాల కోసం 3 రక్షిత మంచినీటి టాంకులు కలవు. ఊరికి పాసింజరు బళ్ళకోసం చిన్న హాల్ట్ రైల్వే స్టేషన్ కలదు. బస్టాండ్ కలదు. 6 పెద్ద రైస్ మిల్లులు, 3 భారీ పౌల్ట్రీ ఫారంలు, 2 కోకోనట్ ప్రోసెసింగ్ యూనిట్లు, 1 ఇంజనీరింగ్ కంపెనీ, 1 ఎగ్ ట్రే తయారీ యూనిట్ ఉన్నాయి. 3 ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు, 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 4 ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళు ఉన్నాయి.


ఇక్కడి ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది.ఊరి చుట్టూ చెరువులు, చెట్లు,గట్లూ చాలా అందంగా కనిపిస్తాయి. కనుకనే ఇ.వి.వి.సత్యనారాయణ లాంటి దర్శకులు ఇక్కడ సినిమాలు తీశారు. నువ్వంటే నాకిష్టం అనే తెలుగు సినిమా చాలా భాగం ఈ ఊరిలోనే చిత్రీకరించారు .. ....పూర్తివ్యాసం: పాతవి