షేక్ మహబూబ్ బాషా, నెల్లూరు

(షేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరు నుండి దారిమార్పు చెందింది)
బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు ....వీరు వ్రాసిన కవితలు, కథలు, కథానికలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. . కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో కూడా ప్రచురితం అయ్యాయి.

బాల్యము మార్చు

బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు జిల్లా నందవరంలో 1961 మే 28న జన్మించారు. వీరి తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ మస్తాన్‌ సాహెబ్‌. చదువు: బి.ఎ (లిట్)., ఎంఎ., బిఎ.ఎం.యస్‌. ఉద్యోగం: 'హైదారాబాద్‌ మిర్రర్‌' దినపత్రిక విజయవాడ ఎడిషన్‌ బాధ్యత వహించారు.

రచనా వ్యాసంగము మార్చు

1979లో 'బీడిముక్క' కథానిక ఆంధ్రాపత్రిక దినపత్రికలో ప్రచురితం కావడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం అయ్యింది. అప్పటి నుండి వివిధ పత్రికలలో కవితలు, కథలు, కథానికలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. . కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో ప్రచురితం అయ్యాయి.

రచనలు మార్చు

1. చీకి మూసిన ఏకాంతం, 2. భారత నారీ బాధపడకు, 3. ప్రేమ పూజారులు, 4.ఎస్‌ నేనే, 5. ఆ రోజు..., 6. సమాజం కట్టిన సమాధాులు, 7. యుగధర్మం (నవలలు). 1984లో రాసిన 'చీకటి మూసిన ఏకాంతంలో' (నవల) పాఠకుల మన్నన పొందింది. 1985లో పురుష ద్వేషం పై స్త్రీల మనోభావాలను సృజిస్తూ రాసిన 'భారత నారీ బాధపడకు' (నవల) ధూషణ- భూషణలకు కారణమై గుర్తింపు తెచ్చి పెట్టింది. లక్ష్యం: సమాజాన్ని మానవత్వపు మూసలో పోయాలని.


మూలాల జాబితా మార్చు

  • సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 56


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ