అణ్వాయుధ పరీక్షలు (ఆంగ్లం: Nuclear weapons tests), అణ్వాయుధాలను పరిశోధించడానికి, చేపట్టే పరీక్షలే, ఈ అణ్వాయుధ పరీక్షలు లేదా అణుపరీక్షలు. ఇరవై శతాబ్దంలో, అనేక దేశాలు పోటా పోటీగా ఈ పరీక్షలు జరిపి, పరోక్షంగా యుద్ధరంగాలను సిద్ధం చేసాయి.

భూగర్భ అణుపరీక్ష కొరకు తయారీ, 1980లో 'నెవాడా పరీక్షా ప్రదేశం' వద్ద. పరీక్ష నిర్వహణా పరికరాలు, క్రిత పరీక్షలవలన ఏర్పడిన గుంతలు (క్రేటర్లు).

ప్రప్రథమ అణుపరీక్ష అమెరికా 1945 జూలై 16 న "ట్రినిటీ సైట్" అనే చోట, చేపట్టింది. దీని వలన 20 కిలోటన్నుల శక్తికి సమానంగా శక్తి వెలువడింది. అమెరికా చే 1952 నవంబరు 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది. అతిపెద్ద అణుబాంబు సోవియట్ యూనియన్కు చెందిన త్సార్ బోంబా, 1961 అక్టోబరు 30 న 'నొవాయా జెమ్ల్యా' వద్ద పరీక్షింపబడింది. దీని శక్తి విలువ 50 మెగాటన్నులు.

అణువరీక్షల వల్ల జరిగే అనార్ధాలను సభ్యదేశాలకు అవగాహన కలిగించి, అణుపరీక్షలను నిలిపివేసేలా చేసేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు. మానవ మనుగడపై ఈ వినాశకర పరిణామాలను నివారించేందుకు అణుపరీక్షల తొలగింపును ప్రోత్సహిస్తూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.[1]

అణుపరీక్షల రకాలు మార్చు

 
నాలుగు మేజర్ అణుపరీక్షలు : 1. వాతావరణ, 2. భూగర్భ 3. ఆవలి-వాతావరణ, 4. సముద్రగర్భ.
 
కాసెల్ బ్రేవో విస్ఫోటనం, 1954లో, సముద్రంలో 100 మైళ్ళ ప్రభావాన్ని కలుగజేసింది. చుట్టూ వున్న మానవసహిత దీవులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది.

అణుపరీక్షలను చారిత్రకంగా ఈ విధంగా వర్గీకరించవచ్చును.: వాతావరణ, సముద్రగర్భ,, భూగర్భ పరీక్షలు.

  • వాతావరణ పరీక్షలు భూవాతావణంలో చేపడతారు. దీనిలో కుక్కగొడుగు మేఘం (మష్రూమ్ క్లౌడ్) యేర్పడుతుంది.
  • సముద్రగర్భ పరీక్షలు, నీటి లోపల చేపడతారు. సాధారణంగా ఒక ఓడను గాని ఒక బార్జ్ను గాని అణ్వాయుధాన్ని అనుసంధానించి పేల్చివేస్తారు. ఈ పరీక్షల వలన, రేడియోధార్మిక నీరు, చుట్టు ప్రక్కల నీటి ప్రాంతాలను విపరీతంగా కాలుష్యపరుస్తుంది.
  • భూగర్భ పరీక్షలు, భూమి లోపల సొరంగాలను త్రవ్వి అందులో అణ్వాయుధాలను అమర్చి పేల్చుతారు. దీని వల్ల భూమిపై పెద్ద పెద్ద గుంతలు (క్రేటర్లు) ఏర్పడుతాయి.[2] 1974 లో భారతదేశం ఇలాంటి పరీక్షలే చేపట్టింది.

చరిత్ర మార్చు

 
మొదటి అణుపరీక్ష 'ట్రినిటి' 1945 జూలై 16 న జరిగింది. (అమెరికా).
 
ప్రపంచంలోని డజనుకు పైగా ప్రదేశాలలో 2,000 కు పైగా అణుపరీక్షలు జరిగాయి.

భూమిపై మొట్టమొదటి అణుపరీక్ష జూలై 16, 1945 న అమెరికా చేపట్టింది. ఇది మాన్‌హట్టన్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. దీనికి "ట్రినిటి" అని పేరు పెట్టారు. న్యూమెక్సికో లోని "అలమగోడ్రో" ప్రాంతంలో చేపట్టారు. ఈ పరీక్షా ఫలితంగా, జపాన్ పై ఆణుబాంబు ప్రయోగం జరిగింది.

దేశాల వారీగా అణుపరీక్షలు మార్చు

అణు బలాలు గల దేశాలు, ఇప్పటివరకు 2,000 అణుపరీక్షలు జరిపాయి. ఈ విస్ఫోటనాలవలన, ధరిత్రికి ఏలాంటి హాని జరిగింటుందో ఊహించవచ్చు.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "International Day against Nuclear Tests". United Nations. Retrieved 2020-08-29.
  2. For an overview of the preparations and considerations used in underground nuclear testing, see ""Underground Nuclear Weapons Testing" (Globalsecurity.org)". Retrieved 2006-10-19. For a longer and more technical discussion, see U.S. Congress, Office of Technology Assessment (October 1989). The Containment of Underground Nuclear Explosions (PDF). Washington, D.C.: U.S. Government Printing Office. Archived from the original (PDF) on 2013-02-27. Retrieved 2008-05-20.

వెలుపలి లంకెలు మార్చు

  • Gusterson, Hugh. Nuclear Rites: A Weapons Laboratory at the End of the Cold War. Berkeley, CA: University of California Press, 1996.
  • Hacker, Barton C. Elements of Controversy: The Atomic Energy Commission and Radiation Safety in Nuclear Weapons Testing, 1947-1974. Berkeley, CA: University of California Press, 1994.
  • Schwartz, Stephen I. Atomic Audit: The Costs and Consequences of U.S. Nuclear Weapons. Washington, D.C.: Brookings Institution Press, 1998.
  • Weart, Spencer R. Nuclear Fear: A History of Images. Cambridge, MA: Harvard University Press, 1985.