అనకాపల్లి రెవెన్యూ డివిజను

అనకాపల్లి రెవెన్యూ డివిజను, అనకాపల్లి జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ విభాగం ప్రధాన కార్యాలయం అనకాపల్లి. ఈ రెవెన్యూ డివిజను పరిధిలో 12 మండలాలున్నాయి.

అనకాపల్లి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనకాపల్లి
ప్రధాన కార్యాలయంఅనకాపల్లి
మండలాల సంఖ్య12

చరిత్ర మార్చు

విశాఖపట్నం జిల్లాలో భాగంగా వున్నప్పుడు, 11 మండలాలు, 387 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]

డివిజను లోని మండలాలు మార్చు

  1. అచ్యుతాపురం
  2. అనకాపల్లి
  3. ఎలమంచిలి
  4. కశింకోట
  5. కె. కోటపాడు
  6. చోడవరం
  7. దేవరాపల్లె
  8. పరవాడ
  9. బుచ్చెయ్యపేట
  10. మునగపాక
  11. రాంబిల్లి
  12. సబ్బవరం

జనాభా గణాంకాలు మార్చు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ డివిజన్ గా వున్నప్పుడు, 2011 జనాభా లెక్కల ప్రకారం 8,21,034 జనాభా ఉండగా, అందులో గ్రామీణ జనాభా 7,09,263 ఉంటే పట్టణ జనాభా 1,11,771 ఉన్నారు.జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 7.45% షెడ్యూల్డ్ తెగలు 3.57% ఉన్నారు.జనాభాలో హిందువులు 98.27% కాగా క్రైస్తవులు 0.70% ముస్లింలు 0.69%. ఉన్నారు.2011 జనాభా లెక్కల నాటికి తెలుగు మాట్లాడేవాళ్ళు 98.99% ఉన్నారు.[2] [3]

మూలాలు మార్చు

  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
  2. "Population by Religion - Andhra Pradesh". censusindia.gov.in. Office of the Registrar General & Census Commissioner, India. 2011.
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in.

వెలుపలి లంకెలు మార్చు