అరిపిరాల నారాయణరావు

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ వై.ఎన్.కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు ఎన్నో జాతీయ, రాష్ట్ర సదస్సులు నిర్వహించిన సాహితీ దిగ్గజం.ప్రముఖులచేత అవధానాలు నిర్వహింపజేయడమే కాదు,మాడుగుల నాగఫణి శర్మ వంటి ఉద్దండుల అవధానాల్లో పాల్గొని తనదైన ముద్రవేశారు. విభిన్న కోణాల్లో తన సాహితీ ప్రతిభను చూపిన డాక్టర్ అరిపిరాల ఇల్లే ఓ లైబ్రెరీగా ఉంటుందని చెప్ఫాలి.నరసాపురం {వై.ఎన్.కళాశాల}లో తెలుగు వెలుగు కార్యక్రమ నిర్వహణతో జాతీయస్థాయిలో కూడా తన సత్తా చాటారు.

అరిపిరాల నారాయణరావు
జననం (1949-06-10) 1949 జూన్ 10 (వయసు 74)
వృత్తితెలుగు రీడర్, వై.ఎస్.కళాశాల, నరసాపురం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సాంస్కృతిక కార్యకర్త
గుర్తించదగిన సేవలు
తెలుగు వెలుగు వ్యాస మంజూష
జీవిత భాగస్వామిమహాలక్ష్మి
పిల్లలువేంకట రవి, శేషసాయికుమారి
తల్లిదండ్రులుఅరిపిరాల సత్యవతి,బ్రహ్మాజీరావు

జననం - కుటుంబ నేపధ్యం మార్చు

అరిపిరాల సత్యవతి,బ్రహ్మాజీరావు దంపతులకు10-6-1949లో ఉండేశ్వరపురంలో జన్మించిన నారాయణరావు రాజమండ్రి మున్సిపల్ కాలనీలొని ప్రాధమిక పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి,గౌతమి విద్యాపీఠం ఒరియంటల్ హైస్కూల్,గౌతమి ఒరియంటల్ కళాశాలలో విద్యను పూర్తిచేసారు.ప్రభుత్వ శిక్షణ కళాశాలలో పండిట్ శిక్షణ పొందారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు.ఈయనకు భార్య మహాలక్ష్మి,ఒక కుమారుడు వేంకట రవి,ఒక కుమార్తె శేషసాయికుమారి ఉన్నారు. 1970నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్.ఆర్.పి.అగ్రహారం గరగపర్రు, దొడ్డిపట్ల, చాగల్లు జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసారు. 1981లో లెక్సరర్ గా శ్రీ వై.ఎన్.కళాశాలలో చేరి,1994లో రీడర్ గా పదోన్నతి పొందారు. 1995సెప్టెంబరు నుంచి అదే కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా సేవలందించారు.

సాధించిన విజయాలు మార్చు

1983లో క్రొవ్విడి లింగరాజు అశీతి(80వ జన్మదినోత్సవం) మహోత్సవం మొదలుకుని 2016లో జరిగిన ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకులు యాతగిరి శ్రీరామ నరసింహారావు అశీతి వరకూ ఎన్నో ప్రత్యేక సంచికలకు డాక్టర్ అరిపిరాల సంపాదకత్వం వహించారు. ఆంధ్రకేసరి యువజన సమితి రజతోత్సవ సంచిక,స్వర్ణోత్సవ సంచిక ఇలా 50కి పైగా సావనీర్లకు సంపాదకత్వం వహించి,వాటిని అందంగా తీర్చిదిద్దారు. సామినేని ముద్దు నరసింహనాయుడు 200సంవత్సరాల క్రితం ప్రకటించిన 'హితసూచని' ఆరుద్ర పీఠికతో పునర్ముద్రించారు. సభలు సమావేశాల నిర్వహణలోనే కాదు, ఉపన్యాసాలు ఇవ్వడంలోనూ డాక్టర్ అరిపిరాల దిట్టే. 1980నుంచి ఈనాటి వరకూ ఎన్నో సభల్లో ఆయన అర్ధవంతమైన ప్రసంగాలు చేసి, మన్ననలు అందుకున్నారు. ఎదురీత వంటి ఎన్నో పుస్తకాలను సంకలనం చేసారు.

ఉత్తమఉపాధ్యాయ అవార్డు గ్రహీత మార్చు

సాహిత్య సాంఘిక సంస్కర్త గురజాడ,కందుకూరి సాహిత్యం, గురజాడ సాహిత్యం,డాక్టర్ చేబోలు చిన్మయ బ్రహ్మకవి సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం,తాపీ ధర్మారావు రచనలు,ఎంకి పాటలు ... ఇలా విభిన్న అంశాలపై ప్రసంగాలు చేసిన డాక్టర్ అరిపిరాల,ఎన్నో పురస్కారాలు, గౌరవాలు కూడా అందుకున్నారు.1998లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం స్వీకరించారు. అంతేకాదు, రాజమండ్రి వీరేశలింగం పురమందిరం,తణుకు ప్రభుత్వ కళాశాల,నర్సాపురం రీడర్స్ ఫోరం, పాలకొల్లు రసధుని రాజమండ్రి శరన్మండలి, రాజోలు సాహితీ హేమంతం, మలికిపురం డిగ్రీ కళాశాల ఇలా పలుచోట్ల సత్కారాలు అందుకున్నారు.

తెలుగువెలుగు వ్యాస మంజూష మార్చు

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్వీయ చరిత్ర పూర్తి గ్రంధాన్ని మిత్రుల సహకారంతో పునర్ముద్రణ చేయడం ద్వారా అందరి మన్ననలు పొందిన డాక్టర్ అరిపిరాల నరసాపురం వై.ఎన్.కళాశాలలో 1985నుంచి నిర్వహించిన తెలుగు వెలుగు కార్యక్రమం ద్వారా వెలుగులు పూయించిన డాక్టర్ అరిపిరాల అక్కడితో వదలకుండా దివాకర్ల వేంకటావధాని,మల్లంపల్లి శరభేశ్వరశర్మ,ఆరుద్ర, కాళీపట్నం రామారావు, డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు వంటి ప్రముఖుల ఉపన్యాసాలను క్రోడీకరించి, సీడీల్లో, ఆడియో టేపుల్లో రికార్డు చేసిన ఉపన్యాసాలకు అక్షర బద్దం చేసారు. ఇందుకోసం దాదాపు రెండేళ్లపాటు శ్రమించి వెయ్యి పేజీలతో "తెలుగువెలుగు వ్యాస మంజూష" గ్రంధంగా తీసుకొచ్చారు. ఈ గ్రంధం ఇటీవలే నరసాపురం శ్రీ వై.ఎన్.కళాశాలలో ఆవిష్కరణోత్సవం జరుపుకుంది. రాజమహేంద్రవరంమిత్రులంతా కల్సి సుహృన్మండలి ఆధ్వర్యాన ఏ.వి. అప్పారావు రోడ్డులోని దాట్ల సుభద్రాయమ్మ కళాంగణంలో జనవరి 20 ఉదయం 'తెలుగు వెలుగు వ్యాస మంజూష' పరిచయ సభ నిర్వహించి,అరిపిరాల దంపతులను ఘనంగా సత్కరించారు.[1]

శ్రీగౌతమీ లైబ్రెరీ లో గ్రంథాల డిజిటలైజేషన్ మార్చు

రాజమండ్రిలో పురాతన గ్రంధాలయంగా వెలుగొందుతున్న శ్రీగౌతమీ ప్రాంతీయ గ్రంధాలయం లో అపురూప గ్రంధాలను పరిరక్షించే ఉద్దేశ్యంతో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ సహకారంతో పుస్తకాల డిజిటలైజేషన్ కి డాక్టర్ అరిపిరాల నడుంకట్టారు. దాదాపు 30వేల పుస్తకాలను డిజిటలైజేషన్ చేసే అరుదైన కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ స్వచ్ఛందంగా శ్రమిస్తూ, పలువురి మన్ననలు అందుకుంటున్నారు. నరసాపురం వై.ఎన్.కళాశాలలో సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ రావు ఏవిధంగా ప్రోత్సాహం ఇచ్చారో, ఇక్కడ శ్రీగౌతమీ గ్రంధాలయ అభివృద్ధికి డాక్టర్ ఆకుల సత్యనారాయణ కూడా అలాగే ప్రోత్సాహం అందిస్తున్నారని డాక్టర్ అరిపిరాల చెబుతూ, ఇది పూర్వ జన్మ సుకృతమని అంటుంటారు.

మూలాలు మార్చు

http://www.anandbooks.com/Edureeta-Telugu-Book-By-Dr-Aripirala-Narayana-Rao Archived 2018-02-09 at the Wayback Machine https://plus.google.com/u/0/114307724867267928627/posts/aof18x7jD4s