ఇలపావులూరి పాండురంగారావు
ఇలపావులూరి పాండురంగారావు శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు.
ఇలపావులూరి పాండురంగారావు | |
---|---|
![]() వక్తగా ఇలపావులూరి | |
జననం | ఇలపావులూరి పాండురంగారావు మార్చి 15, 1930 ![]() |
మరణం | 2011 [[డిసెంబరు
25]] ఢిల్లీ |
మరణ కారణము | అల్జీమర్స్ వ్యాధి |
వృత్తి | ఉపాధ్యాయుడు |
మతం | హిందూ |
భార్య / భర్త | రాధామహాలక్ష్మి |
పిల్లలు | ఐ.వి.సుబ్బారావు |
తండ్రి | వెంకటసుబ్బయ్య |
తల్లి | సరస్వతి |
జీవిత విశేషాలుసవరించు
ఇతడు ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, ఇలపావులూరు గ్రామంలో 1930, మార్చి 15వ తేదీన సరస్వతి, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. బి.ఇడి చదివాడు. ఇలపావులూరు గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా కొన్ని రోజులు పనిచేశాడు. హిందీ భాషా సాహిత్యాంశాలలో డాక్టరేటు సాధించి రాజమండ్రిలో హిందీ లెక్చరరుగా పనిచేశాడు. భారత భాషా పరిషత్, యు.పి.ఎస్.సి, భారతీయ జ్ఞానపీఠ్కు డైరెక్టరుగా పనిచేశాడు. ఇతనికి సంస్కృతం, తెలుగు, హిందీ, బెంగాలీ సహా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇతడు హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు.సంస్కృతం నుండి ఈశ్, కేన, మాండూక్య, ఐతరేయ, కఠోపనిషత్తులను తెలుగులోనికి గేయాలుగా తర్జుమా చేశాడు. త్యాగరాజకీర్తనలను హిందీలో గేయరూపంలో అనువదించాడు. బలివాడ కాంతారావు నవల ఇదే స్వర్గం, ఇదే నరకం రంగనాయకమ్మ నవల పేకమేడలు మొదలైనవాటిని హిందీలోనికి అనువాదం చేశాడు. ఇతడు అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతూ తన 81 యేట 2011, డిసెంబర్ 25న మరణించాడు.
రచనలుసవరించు
- అనుదిన రామాయణము
- ఆది-అనాది[1]
- కామాయని (హిందీ నుండి అనువాదం)
- చిదంబర (హిందీ నుండి అనువాదం)
- కన్నీరు (హిందీ కవి జయశంకర ప్రసాద్ రాసిన ఆఁసూ కావ్యానికి అనువాదం)
- మెట్టుకు పై మెట్టు (తకళి శివశంకరపిళ్ళై మలయాళ నవలకు అనువాదం)
- సహస్రధార
- శ్రీ సహస్రిక
- ఆత్మానందలహరి
- శ్రీ విష్ణు సహస్రనామం (వ్యాఖ్యానం)
- బాబా ఫరీద్ సూక్తులు[2]
- ఇహం - పరం (కఠోపనిషత్తు కావ్యానువాదం)
- తులసీమంజరి
- మీరామాధురి
- ఉపనిషత్సుధ
- Valmiki - Makers Of Indian Literature
- The Art of Translation ( సహ రచయిత: ఉమాశంకర జోషి)
- The universe that is god
- Women in Valmiki
- vedamu venkataraya sastri
- रामायण के महिला पात्रा
- सत्य सती
- संत त्यागराज
పురస్కారాలుసవరించు
- 1966లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాదకుడుగా పురస్కారం
- 1938లో కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద ప్రక్రియలో అవార్డు
- 2003లో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిచే విశిష్ట పురస్కారం
- ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ వారి సత్కారం మొదలైనవి
మూలాలుసవరించు
- జీవనరేఖలు - తాళ్లపల్లి మురళీధరగౌడు - 2005 - పేజీలు 53-58