కరణం బలరామకృష్ణ మూర్తి
భారతీయ రాజకీయ నాయకుడు
కరణం బలరామకృష్ణ మూర్తి (Karanam Balaram Krishna Murthy) (b. అక్టోబరు 31, 1946,) ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఇతడు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించాడు.
కరణం బలరామకృష్ణ మూర్తి | |
---|---|
![]() కరణం బలరామకృష్ణ | |
జననం | కరణం బలరామకృష్ణ 1946 అక్టోబరు 31 /అక్టోబరు.31,, 1946 తిమ్మ సముద్రం, ప్రకాశం జిల్లా |
నివాస ప్రాంతం | ఒంగోలు |
ఇతర పేర్లు | ఒంగోలు పులి |
ప్రసిద్ధి | ఒంగోలు పార్లమెంట్ సభ్యులు |
పదవీ కాలం | 1978-83 మరియు1985-94 : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సభ్యులు 1999 : 13 వ లోక్సభ సబ్యులు 1999-2000 : కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు |
రాజకీయ పార్టీ | తెలుగు దేశం పార్టీ |
మతం | హిందూ మతము |
భార్య / భర్త | సరస్వతి |
పిల్లలు | ఒక కుమారుడు |
తండ్రి | వెంకటేశ్వర్లు |
తల్లి | అన్నపూర్ణమ్మ |
రాజకీయ జీవితంసవరించు
భారత జాతీయ కాంగ్రెసుకు చాలా కాలంగా విధేయుడిగా నున్న ఇతడు 1977 సంవత్సరం ఇందిరా గాంధీ మీద ఒంగోలులో జరిగిన దాడిలో ఆమెను రక్షించినందుకు మీడియాలో బహుళ ప్రచారం పొందాడు. తర్వాత 1978 ఎన్నికలలో ఇంరిన అతన్ని అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెసు అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికలలో మొదటిసారి ఎన్నికయి శాసనసభలో ప్రవేశించాడు..[1]
నిర్వహించిన పదవులుసవరించు
- 1978-83, 1986-94 & 2004 - 09 - ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా 4 సార్లు ఎన్నిక.[2]
- 1999 - 13వ లోకసభకు ఎన్నిక.[2]
- 1999-2000 -లోకసభలో సమాచార కమిటీ సభ్యుడిగా విధి నిర్వహణ.[2]
2019 శాసనసభ ఎన్నికల లో చీరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. ఆమంచి కృష్ణమోహన్ పై టీడీపీ అభ్యర్థి గా కరణం బలరాం 17,801 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
దీర్ఘ కాలం రాజకీయ జీవితం గల వ్యక్తి.
మూలాలుసవరించు
- ↑ http://timesofindia.indiatimes.com/Cities/Hyderabad/Trouble-brewing-for-TDP-in-Prakasam/articleshow/4247525.cms
- ↑ 2.0 2.1 2.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-05. Retrieved 2013-05-06.