కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం (Kasu Brahmananda Reddy National Park), హైదరాబాదు నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నామకరణం చేయబడింది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్తుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కాలుష్య నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.

కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం
Kbr park.jpg
రకంNatural Area
స్థానంజూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ
సమీప పట్టణంహైదరాబాదు
ప్రజా రవాణా సౌకర్యంజూబ్లీ హిల్స్ చెక్ పోస్టు మెట్రో

ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల పక్షులు, 30 రకాల సీతాకోక చిలుకలకు నివాసంగా గుర్తించారు. వాటిలో పంగోలిన్, సివెట్ పిల్లి, నెమలి, అడవి పిల్లి, ముళ్ల పంది మొదలైనవి ఉన్నాయి.

చిరాన్ ప్యాలెస్సవరించు

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న జూబ్లీ హిల్స్ లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో చిరాన్ ప్యాలెస్ నిర్మించబడింది.[1]

మూలాలుసవరించు

  1. Prince Mukarram to give up Chiran Palace Archived 2012-04-05 at the Wayback Machine. The Times Of India, 9 July 2010.

బయటి లింకులుసవరించు

Coordinates: 17°25′N 78°25′E / 17.42°N 78.41°E / 17.42; 78.41