కులశేఖరుడు

(కులశేఖరాళ్వార్ నుండి దారిమార్పు చెందింది)

పన్నెండుమంది ఆళ్వార్లలో ఒకడైన కులశేఖర ఆళ్వార్‌ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్‌’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.ఈయన వేంకటేశ్వరస్వామి ని నీ గర్భగుడి ముందు గడపగా నైనా పడివుండే వరమీయమని అడిగితే స్వామి తథాస్తు అన్నారట. నేటికీ తిరుమల లో గర్భగుడి ద్వారానికున్న గడపని 'కులశేఖర పడి' అని అంటారు. ఇతడు ముకుందమాల అను భక్తి స్తోత్రాన్ని సంస్కృతంలో రచించాడు.[3]

కులశేఖర ఆళ్వార్
జననం3075 BCE[1][2]
Alwarthirunagiri
బిరుదులు/గౌరవాలుఆళ్వార్
తత్వంవైష్ణవం, భక్తి
సాహిత్య రచనలుముకుందమాల, పెరుమాల్ తిరుమోళి
Also a king of Later Chera Kingdom


ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. L. Annapoorna (2000). Music and temples, a ritualistic approach. p. 23. ISBN 9788175740907. Archived from the original on 2013-07-31. Retrieved 2020-01-07.
  2. Sakkottai Krishnaswami Aiyangar (1911). Ancient India: Collected Essays on the Literary and Political History of Southern India. pp. 403–404. ISBN 9788120618503.
  3. కులశేఖరుడు; రంగాచార్యులు, చెలమచర్ల. ఆంధ్ర ముకుందమాల. Retrieved 2 January 2015.
  • Source: Naalaayira divya prabhandham: Commentary by. Dr. Jagadrakshakan. (1997). Aazhvaargal Research Centre, Chennai 600017.