సత్యయుగం

(కృత యుగము నుండి దారిమార్పు చెందింది)

సత్య యుగం (సంస్కృత: सत्ययुग), హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు. "సత్య యుగం (యుగము లేదా యుగం)", మానవత్వం దేవతలచే మానవత్వంతో పరిపాలించబడినప్పుడు, ప్రతి వ్యక్తి ఆచరించే పని స్వచ్ఛమైన ఆదర్శానికి దగ్గరగా ఉంటుంది. మానవత్వం, అంతర్గత మంచితనం కలిగి పాలించటానికి సర్వశ్రేష్టమైన పరమాత్మ అనుమతిస్తుంది. దీనిని కొన్నిసార్లు "స్వర్ణయుగం" అని పిలుస్తారు.సత్య యుగం 1,728,000 సంవత్సరాలు లేదా 4800 దైవిక సంవత్సరాలు ఉంటుంది.నైతికతకు ప్రతీకగా ధర్మ దేవుడు (ఆవు రూపంలో చిత్రీకరించబడింది) సత్యయుగంలో నాలుగు కాళ్లపై నిలబడ్డాడు.తరువాత త్రేతా యుగంలో ఇది మూడు కాళ్లపై, తరువాత ద్వాపరా యుగంలో రెండు కాళ్లపై నిలబడ్డది. ప్రస్తుతం జరుగుచున్న అనైతిక యుగంలో (కలియుగం) ఇది ఒక కాలు మీద నిలుచుని పరిపాలిస్తుంది.

కేదరేశ్వర్ గుహ ఆలయం అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్రగడ్ అనే కొండ కోట వద్ద ఉంది. లింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒకే స్తంభం మాత్రమే చెక్కుచెదరకుండా ఉంది.ఈ స్తంభాలు యుగం లేదా కాలానికి చిహ్నాలు అని నమ్ముతారు. అవి సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలకు చిహ్నాలుగా భావిస్తారు.

వివరణ మార్చు

ప్రతి మతానికి దాని నియమాలు, భావాలు ఉన్నాయి.హిందూ అనేది మతం కాదు ధర్మం. సమయం, విశ్వోద్భవ శాస్త్రం వివేక సిద్ధాంతాలు హిందూ ధర్మాన్ని ప్రత్యేకమైనవిగా చేసాయి.సమయం సృష్టి, విధ్వంసం, చక్రంగా పరిగణించబడ్డాయి.హిందూధర్మసమయం ప్రకారం నాలుగు యుగాలుగా విభజించబడింది.ఇవి ఒకదాని తరువాత ఒకటిగా అనుసరిస్తాయి.వేదాల ప్రకారం సమయం గతించిపోయే చక్రంలాగా నాలుగు యుగాలుగా విభజించబడింది.అందులో మొదటిది సత్య యుగం -- 4 * 432000 సంవత్సరాలు, త్రేతా యుగం -- 3 * 432000 సంవత్సరాలు, ద్వాపర యుగం - 2 * 432000 సంవత్సరాలు, కలియుగం -- 432000 సంవత్సరాలుగా వేదాలు ప్రకారం నిర్వచించబడింది.సత్యయుగం నుండి యుగాలు గతించేకొద్దీ యుగాలు ధర్మం, జ్ఞానం,మేధో సామర్థ్యం, భావోద్వేగం, శారీరక బలం క్రమంగా క్షీణించడం జరుగుతుంది.భగవంతుడిని ధర్మం, అమల, యోగేశ్వర, పరమాత్మ, అవ్యక్త పేర్లతో పిలిచేవారు.[1]

సత్య యుగం పరిపాలన మార్చు

ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ధర్మం సుప్రీం. మానవని పొట్టితనం 21 మూరలుగా ఉంటుంది.మానవుడు అన్ని భ్రమల నుండి విముక్తి పొందుతాడు.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.ధర్మ స్తంభాలన్నీ పూర్తిగా ఉన్నాయి. సత్య యుగంలో, ప్రజలు మంచి, ఉత్కృష్టమైన పనులలో మాత్రమే నిమగ్నమయ్యారు.సత్య యుగంలో, విష్ణువు నాలుగు రూపాల్లో అనగా,మత్స్య,కూర్మ,వరాహ,నరసింహ అవతారలలో అవతరించాడు.సత్య యుగంలో మానవుడి సగటు ఆయుర్దాయం సుమారు 1,00,000 సంవత్సరాలు. [1] జ్ఞానం, ధ్యానం, తపస్సు ఈ యుగంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.[2]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Interesting facts about Satya Yug". ApniSanskriti - Back to veda (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-23. Retrieved 2020-08-04.
  2. Raghunath Ghosh (2008). Humanity, Truth, and Freedom: Essays in Modern Indian. Northern Book. p. 81. ISBN 978-81-7211-233-2.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=సత్యయుగం&oldid=4004908" నుండి వెలికితీశారు