కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

కౌండిన్య వన్యప్రాణి రక్షిత కేంద్రం చిత్తూరు జిల్లా, పలమనేరుకు సమీపంలో ఉన్న ఒక అభయారణ్యం. ఇది హార్సిలీ హిల్స్ నుండి 106 కిలో మీటర్లు, మదనపల్లె నుండి 78 కిలో మీటర్ల దూరములో, పలమనేరు నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. కౌండిన్య వన్య ప్రాణి రక్షిత కేంద్రం అభయారణ్యం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ప్రముఖమైనది. ఇక్కడ ఏనుగుల సంరక్షణ కేంద్రముకూడ ఉంది. 1990 లో స్థాపించబడిన కౌండిన్య వన్య ప్రాణి రక్షిత కేంద్రంలో .... ఆంధ్రప్రదేశ్ లో వున్న అభయారణ్యములలో ఇక్కడ మాత్రమే ఏనుగుల సంరక్షణ కేంద్రమున్నది. తమిళ నాడు, కర్ణాటక అడవులనుండి ఇక్కడికి ఏనుగులు వలస వస్తుంటాయి. ఇక్కడ ఏనుగులే కాకుండా చిరుత పులులు, నాలుగు కొమ్ముల జింకలు, సాంబార్ జింకలు, మౌస్ జింక, కుందేళ్లు, అడవి పందులు, అడవి పిల్లి, నక్కలు, ఎలుగుబంటులు, ఇంకా అనేక రకాల పక్షులు నివాసముంటున్నాయి.

కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
సంరక్షిత కేంద్రం ఒక దృశ్యం
Map showing the location of కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
Map showing the location of కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ పటంలో కౌండిన్య వన్య ప్రాణి సంరక్షిత కేంద్రం ప్రాంతం
ప్రదేశంఆంధ్రప్రదేశ్,
సమీప నగరంచిత్తూరు
భౌగోళికాంశాలు13°01′30″N 78°38′42″E / 13.02500°N 78.64500°E / 13.02500; 78.64500[1]
విస్తీర్ణం357.6 km2 (88,400 acres)
స్థాపితండిసెంబరు 1990
పాలకమండలిఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ

కౌండిన్య అభయారణ్యం లోతైన కొండకోనలతో, ఎత్తైన శిఖరాలతో దట్టమైన అరణ్యముతో అలరారుతున్నది. ఇక్కడ కైగల్, కౌండిన్య అనే చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. ఈ అభయారణ్యం సుమారు 358 చదరపు. కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించివున్నది. ఇక్కడ అల్బీజియామర, మర్రి జ్వాల, మర్రి రెలిజియోసా, మర్రి బెంగాలెన్సిస్, వెదురు వంటి చెట్లు వివిధ జాతులు ఉన్నాయి. ఇది గ్రే గూడబాతులు, రోజీ గూడబాతులు, పెయింటెడ్ గూడుకొంగలు, తదితర పక్షులకు ఆవాసముగా ఉంది. కౌండిన్య వన్య ప్రాణి రక్షిత కేంద్రం సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్, ఏప్రిల్ మధ్య అనుకూలంగా ఉంటుంది. శీతాకాల నెలల్లో ఇక్కడికి వలస వచ్చే అనేక పక్షుల సందడితో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

మూలాలు మార్చు

  1. "APFD Website". Forest.ap.nic.in. Archived from the original on 2012-05-21. Retrieved 2012-07-30.