చిత్తూరు జిల్లా కథా రచయితలు

మనిషి పరిణామక్రమంలో కథ ప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతియుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఒకటి. ఈ జిల్లా ఎంతో మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్టులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా మార్చు

 
మధురాంతకం రాజారాం
క్ర.సం. రచయిత పేరు ప్రస్తుత నివాసం కలం పేరు పుట్టిన సంవత్సరం పుట్టిన ఊరు (చిత్తూరు జిల్లా)
1 పొన్న లీలావతి తూర్పు గోదావరి పానకం
2 బడబాగ్ని శంకరరావు చిత్తూరు 1959 జూన్ 1 పీలేరు
3 బడబాగ్ని అరుణకుమారి చిత్తూరు 1968 జూన్ 7 పీలేరు
4 చీకోలు సుందరయ్య హైదరాబాద్
5 కోలుఅంతర్వాణి, సవనక్రాంత్, సి, సుందరి, | |సుహాసిని 10-Dec-55 కుక్కంబాకం శ్రీకాళహస్తి
5 సి. ఉమాదేవి హైదరాబాద్ 1947 ఫిబ్రవరి 4 చిత్తూరు జిల్లా
6 మూలింటి చంద్రకళ కర్నూలు 1969 సెప్టెంబరు 6 అరగొండ
7 చెంచు నాగార్జునశర్మ చిత్తూరు 1965 అక్టోబరు 21 చిత్తూరు జిల్లా
8 గోపిని కరుణాకర్ 1966 ఏప్రిల్ 26 పీలేరు
9 శింగు మునిసుందరం   తిరుపతి 1937 సెప్టెంబరు 14 పారకాలువ, చిత్తూరు జిల్లా
10 మధురాంతకంరాజారాం 1930అక్టోబరు5 చిత్తూరు జిల్లా
11 వారణాసి భానుమూర్తిరావు హైదరాబాదు 28.04.1956 కలం పేరు లేదు మహల్ రాజుపల్లి చిత్తూరు జిల్లా

ఇవి కూడా చూడండి మార్చు