కర్నూలు జిల్లా కథా రచయితలు

తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంఙలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది. ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో కర్నూలు జిల్లా ఒకటి. ఈ జిల్లా ఎంతో మంది తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు.

రచయితల జాబితా మార్చు

హనుమంత రెడ్డి. కొడిదెల. న్యూ జెర్సీ, అమెరికా హెచ్చార్కే 10-అక్టోబర్ 1951
గని, నంద్యాల తాలూకా, కర్నూలు జిల్లా
బేరి మధుసూదన్ కర్నూలు చార్మింగ్ ప్రిన్స్, మధురిమ, గంధర్వ, కాసనోవా 05-Nov-74 ఎదురుపాడు, ఆత్మకూరు మండలం
చక్కిలం విజయలక్ష్మి కర్నూలు కర్నూలు
గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి కర్నూలు దినకర్, శాశ్త్రీజీ, శాశ్త్రీజీ బాంచవేయ, మణి, శిఖవాహన 20-Sep-44 నంద్యాల
గుంపుల వెంకటేశ్వరులు కర్నూలు గుంపుల, గర్జణవాణి, గుంపులవాణి 02-Jun-63 బీరవోలు
గన్నమరాజు సాయిబాబా కర్నూలు 01-Oct-46 కర్నూలు

బేరి మధుసూధన్ మార్చు

బేరి మధుసూదన్ కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని ఎదురుపాడులో 1974 నవంబరు 5న జన్మించాడు. బేరి మధుసూదన్ చార్మింగ్ ప్రింస్, మధురిమ, గంధర్వ, కాసనోవా అనే కలం పేర్లతో రచనలు సాగించాడు.

చక్కిలం విజయలక్ష్మి మార్చు

చక్కిలం విజయలక్ష్మి కర్నూలు జిల్లా రాజధాని అయిన కర్నూలు నగరంలో జన్మించింది.

గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి మార్చు

గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి 1944 సెప్టెంబరు 20న కర్నూలు జిల్లాలోని నంద్యాలలో జన్మించాడు. గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి దినకర్, శాస్త్రీజీ, శాస్త్రీజీ బాంచవేయ, మణి, శిఖవాహన అనే కలం పేర్లతో కథారచన చేసారు.

గుంపుల వెంకటేశ్వర్లు మార్చు

గుంపుల వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా బీరవోలు 1963 జూన్ మాసం 2న నగరంలో జన్మించాడు. గుంపుల వెంకటేశ్వర్లు గుంపుల, గుర్జణవాణి, గుంపులవాణి అన్న కలంపేర్లతో కథారచన కొనసాగించాడు.

 
కొండారెడ్డి బురుజు

గున్నంరాజు సాయిబాబా కర్నూలు జిల్లా ప్రధాన నగరంలో 1946 అక్టోబరు 1న జన్మించాడు.

ఇవి కూడా చూడండి మార్చు

వెలుపలి లింకులు మార్చు