చిలుకూరి వీరభద్రరావు

చరిత్ర పరిశోధకుడు

చిలుకూరి వీరభద్రరావు పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్రుల చరిత్ర రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, ఆంధ్రకేసరి, సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు. ఆంధ్ర మహాసభ ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా పుస్తకాలు ప్రచురింపబడినవి.[1] దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది.[2] ఆయన 1939 లో మరణించాడు. [3]

చిలుకూరి వీరభద్రరావు
జననం17 అక్టోబర్ 1872
రేలంగి, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం1939
వృత్తిచరిత్ర పరిశోధకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆంధ్రుల చరిత్రము
బిరుదుచరిత్రచతురానన

రచనా వ్యాసంగం మార్చు

ఫెరిస్తా అనే విదేశీ యాత్రికుడు, చరిత్రకారుడు అళియ రామరాయలు పూర్వం గోల్కొండ నవాబైన కుతుబ్‌షా వద్ద పనిచేసెననీ, మరొక సుల్తాను ఆయన కోటపై పడి దాడిచేస్తే ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోగా గోల్కొండ కుతుబ్‌షా తరిమేసెననీ, అప్పుడు కృష్ణదేవరాయల వద్ద ఉద్యోగం సంపాదించాడనీ వ్రాశారు. అదికూడా ఎవరో అనామకుడైన చరిత్రకారుడు చెప్పగా విశ్వసిస్తూ వ్రాశారు.అళియ రామరాయల ప్రవర్తన, వ్యక్తిత్వం, తళ్ళికోట యుద్ధంలో వీరత్వంతో పోరాడి మరణించిన విధానం చూడగా అది సరికాదని నమ్మిన వీరభద్రరావు లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారు.[4]

రచనలు మార్చు


బిరుదులు మార్చు

రాజమహేంద్రవరమున గల ఆంధ్రచరిత్ర పరిశోధకసభా ప్రతిష్ఠాపకులలో ఒకరైన వీరభద్రరావు గారికి 1928 లో నంద్యాల యందు సర్వేపల్లి రాధాకృష్ణన్ యాజమాన్యమున జరిగిన ' ఆంధ్ర మహాసభ ' లో ఆంధ్రచరిత్రచతురానన యను బిరుద మిచ్చి సత్కరించిరి.[5]

ఇవీ చూడండి మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


వనరులు మార్చు

  1. "వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. [[ఏల్చూరి మురళీధరరావు]], సుజనరంజని జులై 2012". Archived from the original on 2016-03-15. Retrieved 2013-03-14.
  2. Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939[permanent dead link]
  3. నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి
  4. 4.0 4.1 వీరభద్రరావు, చిలుకూరి.   అళియరామరాయలు. వికీసోర్స్. 
  5. ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, 1950, పేజీలు: 257-9.