ఆంధ్ర రచయితలు

తెలుగు పుస్తకము


ఆంధ్ర రచయితలు ప్రముఖ తెలుగు రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1950లో ముద్రించారు.

ఆంధ్ర రచయితలు
ఆంధ్ర రచయితలు1.jpg
కృతికర్త: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
ముద్రణల సంఖ్య: 3
అంకితం: ఆకొండి రామమూర్తి శాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): జీవితచరిత్ర
ప్రచురణ: అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి
విడుదల: 1950, 1975, 2013

ఇది 1975 సంవత్సరాలలో ద్వితీయ పర్యాయం ముద్రించబడినది.[1] మధునాపంతుల వారు 1992లో పరమపదించేవరకూ సేకరించిన మరో 12 మంది కవుల చరిత్రను కూడా కలిపి ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మధునాపంతుల ట్రస్టు ద్వారా ఈ తాజా సంపుటాన్ని (మూడవ ముద్రణ) 2013లో వెలువరించారు.[2]

ప్రథమభాగములోని రచయితలుసవరించు

 
పుస్తకం మొదటి ముద్రణ ముఖచిత్రం

ప్రముఖుల అభిప్రాయాలుసవరించు

" శ్రీసత్యనారాయణ శాస్త్రిగారి యీ గ్రంథ నిర్మాణమాయా గ్రంథకర్తల దేశకాలములు గ్రంథముల పేళ్ళు మచ్చు పద్యములు నను తీరున గాక ధ్వని ప్రాయమైన చతుర కవితా విమర్శనముతో వక్రోక్తి చమత్కృతితో రసవత్కావ్యమువలె గంభీరార్థమై మనోజ్ఞమై యున్నది. కొందరు కవులు గూర్చి వీరు నెరపిన ప్రశంసా వాక్యములలో కొన్ని పలుకుబళ్ళై భాషలో పాదుకొనిదగియున్నవి. శాస్త్రిగారు పద్య రచనమందు, గద్యరచనమందును మంచి వైపువాటములెరిగిన జగజాణలు. " - వేటురి ప్రభాకర శాస్త్రి

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు