చుట్టాలున్నారు జాగ్రత్త

(చుట్టాలొస్తున్నారు జాగ్రత్త నుండి దారిమార్పు చెందింది)

చుట్టాలున్నారు జాగ్రత్త 1980 లో వచ్చిన సినిమా. బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి నటించారు . హత్యకు పాల్పడిన వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజమైన హంతకులను కనుగొనడంలో అతనికి సహాయపడే అతనిలాగే ఉండే వ్యక్తి గురించి ఉంటుంది. ఈ చిత్రం 1980 ఆగస్టు 8న విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఇది తమిళంలో పోక్కిరి రాజా (1982) గా, హిందీలో మావాలి(1983)గా పునర్నిర్మించారు.

చుట్టాలున్నారు జాగ్రత్త
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి. ప్రసాద్
తారాగణం కృష్ణ ,
శ్రీదేవి,
రావు గోపాలరావు
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

కథ సవరించు

ఒక పారిశ్రామికవేత్త కుమార్తె, పారిశ్రామికవేత్త కర్మాగారంలోని మేనేజరూ ప్రేమలో పడతారు. పారిశ్రామికవేత్త యొక్క అత్యాశ బంధువు తన కొడుక్కు ఆ అమ్మాయినిచ్చి పెళ్ళి చెయ్యాలని అనుకుంటాడు. ఆ తండ్రీ కొడుకులు పారిశ్రామికవేత్తను హత్య చేస్తారు. నేరాన్ని ఫ్యాక్టరీ మేనేజరుపై వేస్తారు జైలులో, అతను తనలాగే ఉన్న వ్యక్తిని కలుస్తాడు. వారిద్దరూ కలిసి నిజమైన హంతకులను చట్టానికి పట్టిస్తారు.

నటీనటులు సవరించు

పాటలు సవరించు

సౌండ్‌ట్రాక్‌ను ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచారు. [1]

  1. రావయ్యా రామేశం ఏమయ్యా ఆవేశం
  2. అప్పన్నా తనామనా
  3. అమ్మీఓలమ్మీ
  4. కొకొరొకో కొకురకో
  5. రెక్కలు తొడిగి రెపరెప లాడి రివ్వంటుంది కోరికా
  6. చిక్కావులేరా నాకొండి

మూలాలు సవరించు

  1. "Chuttalunnaru Jagratha (1980)". Archived from the original on 2020-02-25. Retrieved 2020-08-30.