చోళ సామ్రాజ్యం
చోళ సామ్రాజ్యం (తమిళ భాష:சோழர் குலம்), 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాల చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుళోత్తుంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10, 11, 12 శతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. మొదటి రాజరాజ చోళుడు, అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవులు నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్|లోని గోదావరి పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళ భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులుకి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజేంద్ర చోళ ఉత్తర భారతదేశం మీద విజయ యాత్ర చేసి పాటలీపుత్రంని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (మలయ్ ఆర్కిపెలగో) వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్దంకి పాండ్య రాజులు, 13వ శతాబ్ధానికి హోయసల రాజులు వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.
చోళ సామ్రాజ్యం சோழர் குலம் | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సా.శ.పూ 300–1279 | |||||||||
జండా | |||||||||
![]() చోళ సామ్రాజ్యం సా.శ. 1030 లో ఉత్థాన స్థితిలో (నీలిరంగు గీత వ్యాపార మార్గాలు) | |||||||||
రాజధాని | మొదటి చోళులు: పూంపుహార్, ఉరయూర్, మధ్యయుగ చోళులు: పుజైయారాయి, తంజావూరు గంగైకొండ చోళపురం | ||||||||
సామాన్య భాషలు | తమిళం | ||||||||
మతం | హిందూ మతము | ||||||||
ప్రభుత్వం | రాజరికం | ||||||||
రాజు | |||||||||
• 848-871 | విజయాలయ చోళుడు | ||||||||
• 1246-1279 | మూడవ రాజేంద్ర చోళుడు | ||||||||
చారిత్రిక కాలం | మధ్య యుగం | ||||||||
• స్థాపన | సా.శ.పూ 300 | ||||||||
• మధ్యయుగ చోళుల ఆవిర్భావం. | 848 | ||||||||
• పతనం | 1279 | ||||||||
|


ప్రారంభం
మార్చుచోళులను చోడా అని కూడా పిలుస్తారు.[1] వారి మూలానికి సంబంధించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. పురాతన తమిళ సాహిత్యంలో, శాసనాలలో పేర్కొన్నట్లు దాని ప్రాచీనత స్పష్టంగా తెలుస్తుంది. తరువాత మధ్యయుగ చోళులు కూడా సుదీర్ఘమైన, పురాతన వంశానికి చెందినవారుగా పేర్కొనబడ్డారు. ప్రారంభ సంగం సాహిత్యంలోని ప్రస్తావనలు (సా.శ. 150 CE)చోళుల గురించి ప్రస్తావించబడింది.[a] రాజవంశం తొలి రాజులు సా.శ. 100 కంటే పూర్వం ఉన్నట్లు సూచిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దానికి చెందిన అశోకుడి శాసనాలు చోళలను దక్షిణాదిలో ఉన్న పొరుగు దేశాలలో ఒకటిగా పేర్కొన్నారు.[2]
సాధారణంగా ప్రజాభిప్రాయంలో పాలక కుటుంబం ప్రాచీనత చోళ, చేరా, పాండ్య ఒకేలా భావించబడుతుంది. పరిమెలాజగరు ఇలా అన్నాడు: "పురాతన వంశీయులు (చోళులు, పాండ్యాలు, చేరాల వంటివి) ఉన్న ప్రజల స్వచ్ఛంద సంస్థ వారి శక్తి క్షీణించినప్పటికీ సదా ఉదారంగా ఉంటాయి". సాధారణంగా చోళులకు కిల్లి (கிள்ளி), వల్లవను (வளவன்), సెంబియాను (செம்பியன்) సెన్నీ వంటి పేర్లు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.[3] కిల్లి బహుశా తమిళ కిళ్ (கிள்) నుండి వచ్చింది. అంటే త్రవ్వడం లేదా విడదీయడం. త్రవ్వినవాడు లేదా భూమి కార్మికుడు ఆలోచనను తెలియజేస్తుంది. ఈ పదం తరచుగా నేడున్కిల్లి, నలన్కిల్లి వంటి ప్రారంభ చోళ పేర్లలో ఇది అంతర్భాగంగా ఏర్పడుతుంది. కాని తరువాతి కాలంలో ఇది దాదాపుగా ఉపయోగం నుండి తప్పుకుంటుంది. వల్లవన్ చాలావరకు "వళం" (வளம்) తో అనుసంధానించబడి ఉంది. సంతానోత్పత్తి, సారవంతమైన దేశం యజమాని లేదా పాలకుడు. సెంబియాను సాధారణంగా షిబి వంశస్థుడు అని అర్ధం - ఒక పురాణ వీరుడు, ప్రారంభ చోళ పురాణాలలో పావురాన్ని రక్షించడంలో ఆత్మబలిదానం చేయడం. బౌద్ధమతం జాతక కథలలో సిబి జాతక అంశాన్ని ఏర్పరుస్తుంది.[4] తమిళ నిఘంటువులో చోళ అంటే సోజి లేదా సాయి అంటే పాండ్యా లేదా పాత దేశం తరహాలో కొత్తగా ఏర్పడిన రాజ్యాన్ని సూచిస్తుంది.[5] తమిళంలో సెన్నీ అంటే తల.
7 వ శతాబ్దానికి ముందు చోళుల వ్రాతపూర్వక ఆధారాలు చాలా తక్కువ. దేవాలయాల మీద శాసనాలు సహా చారిత్రక రికార్డులు ఉన్నాయి. గత 150 సంవత్సరాలలో చరిత్రకారులు పురాతన తమిళ సంగం సాహిత్యం, మౌఖిక సంప్రదాయాలు, మత గ్రంథాలు, ఆలయాలు, రాగి పలక శాసనాలు వంటి వివిధ వనరుల నుండి ఈ విషయం గురించి గణనీయమైన జ్ఞానాన్ని పొందారు. ప్రారంభ చోళుల అందుబాటులో ఉన్న సమాచారానికి సంగం కాలం ప్రారంభ తమిళ సాహిత్యం ప్రధాన మూలం.[b] " పెరిప్లసు ఆఫ్ ది ఎరిత్రోయిను సీ ", స్వల్పకాలం తరువాత టోలెమీ రచనలో చోళ దేశం, దాని పట్టణాలు, ఓడరేవులు, వాణిజ్యం గురించి కూడా సంక్షిప్త నోటీసులు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో వ్రాసిన మహావంశ అనే బౌద్ధ గ్రంథం, క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో సిలోను చోళ నివాసుల మధ్య అనేక విభేదాలను వివరిస్తుంది.[7] అశోక స్తంభం (క్రీ.పూ. 273-చెక్కినవి) శాసనాలలో చోళుల గురించిన ప్రస్తావన ఉంది. అశోకుడికి లోబడి ఉండకపోయినా ఇక్కడ రాజ్యాలలో చోళులకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి.[c]
చరిత్ర
మార్చుచోళుల చరిత్ర నాలుగు కాలాలుగా వర్గీకరించబడింది: సంగం సాహిత్యంలో ప్రారంభకాల చోళుల తరువాత కొంతకాలం వ్యవధిలో చోళుల పతనం తరువాత కొంతకాల వ్యవధిలో అజ్ఞాతంగా ఉన్న చోళవంశాలు తిరిగి విజయాలయా నాయకత్వంలో మధ్యకాల చోళులుగా విజయాలయా రాజవంశంగా అభివృద్ధి చెందింది. 11 వ శతాబ్దం మద్యకాలంలో కులోత్తుంగచోళ రాజవంశం చివరి చోళరాజవంశంగా పాలన సాగించింది. [d]
ప్రారంభకాల చోళులు
మార్చుసంఘం సాహిత్యంలో స్పష్టమైన ఆధారాలు ప్రస్తావించబడ్డాయి. ఈ సాహిత్యం 1-2 శతాబ్దాలకు చెందినదని చరిత్రకారులు అంగీకరిస్తారు. ఈ సాహిత్యం అంతర్గత కాలక్రమం ఇప్పటికీ స్థిరపడలేదు. ప్రస్తుతం ఈ కాల చరిత్రకు అనుసంధానించబడిన ఆధారాలు పొందలేము. ఇది రాజులు, యువరాజుల పేర్లను, వారిని కీర్తించిన కవుల పేర్లను నమోదు చేస్తుంది.[10] సంగం సాహిత్యం పౌరాణిక చోళ రాజుల గురించి ఇతిహాసాలను కూడా నమోదు చేస్తుంది.[11] ఈ పురాణాలు అగస్త్య ఋషి సమకాలీనుడిగా భావించే చోళ రాజు కాంతమ గురించి మాట్లాడుతుంటాయి. ఆయన భక్తి కవేరి నదిని ఉనికిలోకి తెచ్చింది.[మూలం అవసరం] సంగకాల సాహిత్యంలో ప్రధానంగా కరికాళచోళుడు, కోసెంగన్నను.[12][13][14][15] ఒకరితో ఒకరు వారసత్వ క్రమాన్ని పరిష్కరించడానికి అదే కాలంలో అనేకమంది యువరాజులతో వారి సంబంధాలను పరిష్కరించుకోవటానికి కచ్చితమైన మార్గాలు లేవు.[16][e] ఉరూరు (ప్రస్తుత తిరుచిరాపల్లిలో ఒక భాగం) వారి పురాతనమైనది రాజధాని.[11] ప్రారంభ చోళ రాజధానిగా కావేరిపట్టినం కూడా పనిచేసింది.[17] ఎలలను అని పిలువబడే చోళ యువరాజు తమిళ జాతీయుడైన సాహసికుడు శ్రీలంక ద్వీపం మీద దాడి చేసి క్రీస్తుపూర్వం 235 లో మైసూరు సైన్యం సహాయంతో జయించాడని మహావంశ పేర్కొన్నాడు. [18]
సంగకాలం
మార్చుసంగం యుగం (సి. 300) నుండి పాండ్యులు, పల్లవులు తమిళ దేశంలో ఆధిపత్యం సాధించిన మూడు శతాబ్దాల పరివర్తన కాలం గురించి పెద్దగా సమాచారం లేదు. ఒక అస్పష్టమైన రాజవంశం అయిన కలాభ్రాసు తమిళ దేశం మీద దాడి చేసి అక్కడ ఉనికిలో ఉన్న రాజ్యాలను స్థానభ్రంశం చేసి ఆ సమయంలో పాలించారు.[19][20][21] 6 వ శతాబ్దంలో పల్లవ రాజవంశం, పాండ్య రాజవంశం వారు స్థానభ్రంశం చెందారు.[13][22] 9 వ శతాబ్దం రెండవ త్రైమాసికంలో విజయాలయ ప్రవేశం వరకు మూడు శతాబ్దాలలో చోళుల గురించి చాలా తక్కువగా సమాచారం లభిస్తుంది.[23]తంజావూరు, పరిసరాలలో ఉన్న శాసనాల ఆధారంగా ఈ రాజ్యాన్ని ముతరైయారులు మూడు శతాబ్దాలుగా పరిపాలించారు. క్రీస్తుశకం 848-851 మధ్య ఇలంగో ముతరైయారు నుండి తంజావూరును స్వాధీనం చేసుకున్న విజయాలయ చోళ వారి పాలనను ముగించారు.
ఎపిగ్రఫీ సాహిత్యం ఈ సుదీర్ఘ విరామంలో ఈ రాజుల శ్రేణి మీద వచ్చిన పరివర్తనల కొన్ని సంగ్రహావలోకనాలను అందిస్తుంది. చోళుల శక్తి దాని కనిష్ఠ స్థాయికి పడిపోయిన సమయంలో ఉత్తర, దక్షిణప్రాంతాలలో పాండ్యులు, పల్లవుల అభివృద్ధి చెందారు. [14][24]ఈ రాజవంశం వారి మరింత విజయవంతమైన ప్రత్యర్థుల కింద ఆశ్రయం పొంది పోషణను పొందవలసిన అవసరం ఏర్పడింది.[25][f] ఉరైయూరు పరిసరాలలో క్షీణించిన భూభాగం మీద స్వల్ప సామర్థ్యంతో చోళులు పాలన కొనసాగించారు. అధికారాలు తగ్గి ఉన్నప్పటికీ పాండ్యులు, పల్లవులు చోళ యువరాణులను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు.[g] ఈ కాలంలో అనేక శాసనాలు వారు చోళులతో సాగించిన యుద్ధం గురించి పేర్కొన్నాయి.[h] ప్రభావం, శక్తిలో ఈ నష్టం ఉన్నప్పటికీ చోళులు వారి పాత రాజధాని ఉరైయూరు చుట్టూ ఉన్న విజయాలయ భూభాగం మొత్తం పట్టును కోల్పోయే అవకాశం లేదు. ఆయన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు. [26][28]
7 వ శతాబ్దంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశులో చోళ రాజ్యం అభివృద్ధి చెందింది.[26] ఈ తెలుగు చోళులు వారి సంతతిని ప్రారంభ సంగం చోళులు గుర్తించినప్పటికీ ప్రారంభ చోళులతో వారికి సంబంధం ఉందో లేదో తెలియదు.[30] పాండ్యులు, పల్లవుల ఆధిపత్య ప్రభావాలకు దూరంగా, తమ సొంత రాజ్యాన్ని స్థాపించడానికి పల్లవుల కాలంలో తమిళ చోళుల శాఖ ఉత్తరప్రాంతాలకు వలస వెళ్ళడానికి అవకాశం ఉంది.[i]కాంచీపురంలో చాలా నెలలు గడిపిన చైనా యాత్రికుడు జువాన్జాంగు 639–640 సమయంలో ఈ తెలుగు చోళుల గురించి "కులీ-యా రాజ్యం" గురించి వ్రాశారు.[23][32]
రాజరాజ చోళుడు
మార్చుఅసలు పేరు అరుమేలి బిరుదు ముమ్మడిచోళ. రాజరాజ చోళుడు ప్రముఖ చోళరాజులలో ఒకడు. స్థానిక స్వపరిపాలనకు సంబంధించి అనేక సంస్కరణలు చేశాడు. తంజావూరులో గొప్ప బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించినది ఇతడే.
పాద పీఠికలు
మార్చు- ↑ The age of Sangam is established through the correlation between the evidence on foreign trade found in the poems and the writings by ancient Greek and Romans such as Periplus. K.A. Nilakanta Sastri, A History of Cyril and Lulu Charles, p 106
- ↑ The period covered by the Sangam poetry is likely to extend not longer than five or six generations.[6]
- ↑ The Ashokan inscriptions speak of the Cholas in plural, implying that, in his time, there were more than one Chola.[8]
- ↑ The direct line of Cholas of the Vijayalaya dynasty came to an end with the death of Virarajendra Chola and the assassination of his son Athirajendra Chola. Kulothunga Chola I, ascended the throne in 1070.[9]
- ↑ The only evidence for the approximate period of these early kings is the Sangam literature and the synchronisation with the history of Sri Lanka as given in the Mahavamsa. Gajabahu I who is said to be the contemporary of the Chera Senguttuvan, belonged to the 2nd century and this means the poems mentioning Senguttuvan and his contemporaries date to that period.[మూలం అవసరం]
- ↑ Pandya Kadungon and Pallava Simhavishnu overthrew the Kalabhras. Acchchutakalaba is likely the last Kalabhra king.[24]
- ↑ Periyapuranam, a Shaivite religious work of 12th century tells us of the Pandya king Nindrasirnedumaran, who had for his queen a Chola princess.[26]
- ↑ Copperplate grants of the Pallava Buddhavarman (late 4th century) mention that the king as the "underwater fire that destroyed the ocean of the Chola army".[27]Simhavishnu (575–600) is also stated to have seized the Chola country. Mahendravarman I was called the "crown of the Chola country" in his inscriptions.[మూలం అవసరం]
- ↑ K. A. Nilakanta Sastri postulates that there was a live connection between the early Cholas and the Renandu Cholas of the Andhra country. The northward migration probably took place during the Pallava domination of Simhavishnu. Sastri also categorically rejects the claims that these were the descendants of Karikala Chola.[31]
వనరులు
మార్చు- Chopra, P.N; Ravindran, T.K; Subrahmanian, N (2003) [2003]. History of South India ; Ancient, Medieval and Modern. New Delhi: S. Chand & Company Ltd. ISBN 81-219-0153-7.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link) - Das, Sisir Kumar (1995) [1995]. History of Indian Literature (1911–1956) : Struggle for Freedom - Triumph and Tragedy. New Delhi: Sahitya Akademi. ISBN 81-7201-798-7.
- Gupta, A.N; Gupta, Satish. Sarojini Naidu's Select Poems, with an Introduction, Notes, and Bibliography. Prakash Book Depot.
- Harle, J.C (1994). The art and architecture of the Indian Subcontinent. New Haven, Conn: Yale University Press. ISBN 0-300-06217-6.
మూలాలు
మార్చు- ↑ Prasad (1988), p. 120
- ↑ "KING ASHOKA: His Edicts and His Times". www.cs.colostate.edu. Retrieved 2018-10-07.
- ↑ Raju Kalidos. History and Culture of the Tamils: From Prehistoric Times to the President's Rule. Vijay Publications, 1976. p. 43.
- ↑ Sastri (1984), pp. 19–20
- ↑ Archaeological News A. L. Frothingham, Jr. The American Journal of Archaeology and of the History of the Fine Arts, Vol. 4, No. 1 (Mar., 1998), pp. 69–125
- ↑ Sastri (1984), p. 3
- ↑ Columbia Chronologies of Asian History and Culture by John Bowman p.401
- ↑ Sastri (1984), p. 20
- ↑ Sastri (2002), pp. 170–172
- ↑ Sastri (2002), pp. 19–20, 104–106
- ↑ 11.0 11.1 Tripathi (1967), p. 457
- ↑ Majumdar (1987), p. 137
- ↑ 13.0 13.1 Kulke & Rothermund (2001), p. 104
- ↑ 14.0 14.1 Tripathi (1967), p. 458
- ↑ Sastri (2002), p. 116
- ↑ Sastri (2002), pp. 105–106
- ↑ Sastri (2002), p. 113
- ↑ R, Narasimhacharya (1942). History of the Kannada Language. Asian Educational Services. p. 48. ISBN 9788120605596.
{{cite book}}
: ISBN / Date incompatibility (help) - ↑ Sastri (2002), pp. 130, 135, 137
- ↑ Majumdar (1987), p. 139
- ↑ Thapar (1995), p. 268
- ↑ Sastri (2002), p. 135
- ↑ 23.0 23.1 Sastri (2002), pp. 130, 133Quote:"The Cholas disappeared from the Tamil land almost completely in this debacle, though a branch of them can be traced towards the close of the period in Rayalaseema – the Telugu-Chodas, whose kingdom is mentioned by Yuan Chwang in the seventh century A.D."
- ↑ 24.0 24.1 Sastri (1984), p. 102
- ↑ Kulke & Rothermund (2001), p. 115
- ↑ 26.0 26.1 26.2 Chopra, Ravindran & Subrahmanian (2003), p. 95
- ↑ Sastri (1984), pp. 104–105
- ↑ Tripathi (1967), p. 459
- ↑ Chopra, Ravindran & Subrahmanian (2003), p. 31
- ↑ Sastri (2002), p. 4Quote:"it is not known what relation, if any, the Telugu-Chodas of the Renadu country in the Ceded District, bore to their namesakes of the Tamil land, though they claimed descent from Karikala, the most celebrated of the early Chola monarchs of the Sangam age."
- ↑ Sastri (1984), p. 107
- ↑ Tripathi (1967), pp. 458–459
బయటి లింకులు
మార్చు
నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి
- UNESCO World Heritage sites - Chola temples
- Art of Cholas
- Chola coins Archived 2011-06-17 at the Wayback Machine
- Chola coins of Sri Lanka Archived 2016-03-04 at the Wayback Machine