జంధ్యాల గౌరీనాథశాస్త్రి

జంధ్యాల గౌరీనాథశాస్త్రి పాతతరం తెలుగు చలనచిత్ర నటులు. గౌరీనాథశాస్త్రి జమీందారీ వంశం లాంటి శ్రీమంతుల ఇంట 1904లో తెనాలి తాలూకాలోని పిడమర్రు గ్రామంలో జన్మించాడు. శాస్త్రి పెద్దగా చదువుకోలేదు కానీ, ఆయనకు నాటక ప్రదర్శనలు చూడడం, సంగీత కచేరీలు వినడం, సినిమాలు చూడటం ఇష్టం.[1]

తన తొలి చిత్రమైన భక్త పోతన (1942)లో శ్రీనాథునిగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి

సినీరంగ ప్రవేశం మార్చు

నిండైన విగ్రహమూ, విశాల నేత్రాలు గల వ్యక్తి కోసం అన్వేషిస్తున్న తరుణంలో దర్శకుడు కె.వి.రెడ్డికి ఒక సభలో గౌరీనాథశాస్త్రి తారపడ్డాడు. నాటకానుభవం లేకపోయినా ఉత్సాహం ఉంది గనుక, పాత్రకు న్యాయం జరుగుతుందని శ్రీనాథుడి పాత్రకు ఎంపిక చేశారు. శాస్త్రి గారి మంచి కంఠం, చక్కని వాచికం, రెండూ ఉన్నాయి కనుక ఇరువురికీ అంగీకారమైంది. సంభాషణల వల్లె వేయించి, క్షుణ్ణంగా రిహార్సల్సు చేయించారు. దృశ్యాలు షూట్‌ చేసే ముందు, కనీసం మూడు, నాలుగు రోజులైనా రిహార్సల్సు ఉండేవి. పోతన పాత్రలాంటిది నటించడం నాగయ్యకీ కొత్త. కొత్తవాడైన గౌరీనాథశాస్త్రికి మరీ కొత్త. పాత్ర లక్షణాలను గ్రహించి, దర్పాన్ని జోడించి ఎంతో సహజంగా నటించాడు శాస్త్రి. పోతన చిత్రం విజయవంతమై శ్రీనాథుడి పాత్రధారి గురించి ఒక గొప్ప సహజ నటుడు లభించాడు అని అందరూ చెప్పుకున్నారు.

1956లో వచ్చిన 'బలే రాముడు' సినిమాలో కూడా గౌరీనాథశాస్త్రి నటించాడు. నాగయ్య 'రామదాసు' చిత్రం ఆరంభిస్తూ శాస్త్రిని కబీర్‌ పాత్రకు తీసుకున్నారు. కాని, కొన్ని దృశ్యాల్లో నటించిన తర్వాత 1958లో గౌరీనాథ శాస్త్రి మరణించడంతో ఆ పాత్రను గుమ్మడి పూర్తి చేశాడు.

చిత్ర సమాహారం మార్చు

నటుడిగా మార్చు

నిర్మాతగా మార్చు

లింకులు మార్చు

మూలాలు మార్చు