జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి

(జాగర్లమూడి కుప్పుస్వామి ఛౌదరి నుండి దారిమార్పు చెందింది)

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి మహాదాత, గొప్ప విద్యాపోషకుడు. కవి పండిత పోషకునిగా . నిష్కలంక రాజకీయవేత్తగా. సంఘ సేవకునిగా . ధార్మికవేత్తగా . విద్యాదాతగా జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి చరిత్ర గుంటూరు జిల్లా పుటల్లో సువర్ణాక్షర లిఖితం[1].

జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి
దస్త్రం:Kuppuswami chowdary.jpg
మహాదాత, గొప్ప విద్యాపోషకుడు.నిష్కలంక రాజకీయ సంఘ సేవకుడు
జననం1892 ఆగస్టు 15
ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామము
మరణం1960 డిసెంబరు 14
పదవీ కాలంమద్రాసు రాష్ర శాసన సభ్యులు -1920- 1936 గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులు -1927 - 31
రాజకీయ పార్టీజస్టీస్ పార్టీ
మతంహిందువు
భార్య / భర్తఆదిలక్ష్మీ
పిల్లలుముగ్గురు కుమారులు. జాగర్లమూడి చంద్రమౌళి బాబు. మదనమోహన చౌదరి, లక్ష్మయ్య చౌదరి
తల్లిదండ్రులులక్ష్మయ్య నాయుడు,రంగమ్మ
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారి విగ్రహము, గుంటూరు

జననం మార్చు

కుప్పుస్వామి చౌదరి ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామములో ఒక సంపన్న భూస్వాముల కుటుంబములో లక్ష్మయ్య నాయుడు,రంగమ్మ గార్లకు 1892 ఆగస్టు 15న జన్మించారు. వీరికి ఒక తమ్ముడు నలుగురు చెల్లెళ్ళు.

రాజకీయాలు మార్చు

భూస్వామ్య కుటుంబంలో జన్మించినా రైతాంగ సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ఆంగ్ల భాష ఆవశ్యకతను గుర్తించి కులమతా లతో సంబంధం లేకుండా విద్య అందరికీ చేరువ కావడానికి కృషి చేశారు. జస్టిస్ పార్టీలో చేరినా ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడక విద్యా వ్యాప్తికి అన్ని కులాల వారినీ పోత్సహించారు. 1920లో మద్రాసు రాష్ర శాసనసభకు గుంటూరు జిల్లా నుంచి జస్టీస్ పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1936 వరకు అన్ని ఎన్నికలలోనూ కుప్పస్వామి గెలుపొందడం గమనా రం.

1927లో గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి మొదటిగా కల్పించింది వీరి హయాంలోనే.

భాష పరిరక్షణ మార్చు

తెలుగు సంస్కృతిని పరిరక్షించుటకు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు, కవి పండితులను ప్రోత్సహించుటకు విశేష కృషి చేశాడు. ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి, 1931లో చెన్నపట్టణములో జరిగిన ఆంధ్ర మహా సభలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశబెట్టి నెగ్గించాడు.

కవులను ఆదరించి భాషాసేవ చేశాడు. మైసూరు అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.

ఏటుకూరి. తుమ్మల, జాషువా వంటి మహాకవులను డిగ్రీ లతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు.

కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు వీరికి మంచి మిత్రులు. 1930 లో త్రిపురనేని గారు కుప్పుస్వామి అనే మకుటంతో " కుప్పుస్వామి శతకం " రాసి వీరికి అంకితం ఇచ్చారు.

పరుని నీముందు దిట్టెటివాడు నిన్ను

నొరిని ముందు దిట్టకయుండ బోడు

చనువు రవ్వంత వానికి ఒసంగ రాదు

ముప్పుఒచ్చున్ దప్పక దాన గుప్పుస్వామి

కవికోకిల గుర్రం జాషువా కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:

శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
ముగ్గురు శ్రీమంతులు వర్ణ ఖండన విగగ్ధున్
గొనబు పంటల అసామి కుప్పుసామి

దానశీలి మార్చు

ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు వీరికి సాహిత్య మిత్రులు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన స్థాపించిన శారదా నికేతన్ కి భూరి విరాళం ఇచ్చారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్థులకు దానాలు చేశాడు.

కావూరులో గొల్లపూడి సీతారామశాస్త్రి స్థాపించిన వినయాశ్రమం కు కుప్పుస్వామి గారు 26 ఎకరాలు భూమిని దానంగా ఇచ్చారు.

విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవాలయాల పునరుద్దరణకు విశేషంగా కృషి చేశారు.

కుటుంబం మార్చు

కుప్పుస్వామి గారి మొదటి భార్య కనకదుర్గా దేవి. వీరికి సంతానం కలుగలేదు. వీరి రెండవ భార్య ఆదిలక్ష్మీ. వీరికిముగ్గురు కుమారులు. పెద్దవారు జాగర్లమూడి చంద్రమౌళి.తరువాత వారు మదనమోహన చౌదరి, లక్ష్మయ్య చౌదరి. తండ్రి అడుగుజాడలలో పయనించి జాగర్లమూడి చంద్రమౌళి గారు కూడా మంచి ప్రజాసేవకుడిగా పేరు గడించారు.

మరణం మార్చు

1960 డిసెంబరు 14న కుప్పుస్వామి చౌదరి కన్నుమూశారు.

గుంటూరు నగరంలోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల కుప్పుస్వామి పేరిట 1967లో స్థాపించబడింది.[2] [3]

కుప్పుస్వామి గారి గౌరవార్దం గుంటూరులో JKC - రింగ్ రోడ్ కూడలిలో వారి కాంస్య విగ్రహం  తమిళనాడు గవర్నర్ శ్రీ కే. రోశయ్య గారిచే 2011 డిసెంబర్ 23 న ఆవిష్కరించబడినది.[4]

మూలాలు మార్చు

  1. http://epaper.andhrajyothy.com/c/11695336[permanent dead link]
  2. "J K C College". Archived from the original on 2009-03-18. Retrieved 2009-03-31.
  3. "Language lab in JKC College". www.hindu.com. Archived from the original on 2007-10-01. Retrieved 2009-03-31.
  4. శ్రీనివాస్, కొడాలి (December 25, 2011). "శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి". హేతువాది.