డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం

పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సమీపంలో వెంకటరమన్నగూడెం వద్ద ఉన్న రాష్ట్ర విశ్వవిద్యా
(డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)

డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం (ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం) , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, తాడేపల్లిగూడెం సమీపంలో వెంకటరమన్నగూడెం వద్ద ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయం.[1] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007లో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. ఉద్యాన శాస్త్రంను చదవడానికి, పరిశోధనచేయడానికి ఈ విశ్వవిద్యాలయం ప్రోత్సాహం అందిస్తోంది.

డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం
పూర్వపు నామము
ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం
రకంప్రజా
స్థాపితం2007
స్థానంవెంకట్రామన్నగూడెం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
16°52′59″N 81°27′05″E / 16.8831°N 81.4513°E / 16.8831; 81.4513
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్

చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2007లో దీనిని స్థాపించింది. దీనితోపాటు మహబూబ్ నగర్ జిల్లా లోని మొజెర్ల, కడప జిల్లాలోని అనంతరాజుపేట లలో కూడా ఈ ఉద్యాన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆచార్య ఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. 2008లో మొదటి వైస్-ఛాన్సలర్‌ను నియమించే వరకు దీనిని ప్రభుత్వ అధికారి నిర్వహించేవారు.[2] 2011లో దీనికి డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు.[3]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "DR. YSR Horticultural University". www.drysrhu.edu.in. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  2. "Welcome to Dr.Y.S.R Horticultural University". Dr. Y.S.R. Horticultural University. Archived from the original on 8 మే 2021. Retrieved 25 May 2021.
  3. "Dr.Y.S.R Horticultural University". Dr. Y.S.R. Horticultural University. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.

బయటి లింకులు మార్చు