తాతా మనవడు

(తాతామనవడు నుండి దారిమార్పు చెందింది)

వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని, ఇప్పుడు మనము అనుసరించిన మార్గాన్నే ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పే సందేశాత్మక చిత్రం ఇది. దాసరి నారాయణరావు సినీ ప్రస్థానం (దర్శకునిగా) ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. "నీ అయ్యకు చేసిన ఈ మర్యాద రేపు నీకు చెయ్యాలి కదయ్యా" అని కొడుకు తండ్రితో అనడమే చిత్రంలోని ప్రధాన కథాశం. పిల్లలు మన చర్యల్ని, నడిచే మార్గాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పే చిత్రం; ఒక కొత్త ఒరవడికి నాంది పలికి విజయవంతమైంది.

తాతా మనవడు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం కె.రాఘవ,
ఏకాంబరరావు
కథ దాసరి నారాయణరావు
చిత్రానువాదం దాసరి నారాయణరావు
తారాగణం ఎస్వీ రంగారావు ,
అంజలీదేవి,
రాజబాబు,
విజయనిర్మల,
కైకాల సత్యనారాయణ,
రాజసులోచన,
అల్లు రామలింగయ్య,
రమాప్రభ,
ఛాయాదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
పి.సుశీల,
మాధవపెద్ది సత్యం
ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య
సంభాషణలు దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణం ఎమ్.కన్నప్ప
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిడివి 177 నిమిషాలు
అవార్డులు నంది అవార్డు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఎస్.వి.ఆర్, రాజబాబు అత్యద్భుత నటన, కొత్త తరహా సంభాషణలు, దర్శకత్వం, చక్కటి నేపధ్యగీతాలు(బాలు, రామకృష్ణ - అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం చి త్రవిజయానికి కారణభూత మయ్యాయి. చిత్రంలో హీరో, హీరోయిన్ల వంటి మూస పాత్రలు లేకపోయినా, తక్కువ బడ్జెట్‌తో నిర్మించినా ప్రేక్షకులు ఆదరించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి 1972 సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజిత నంది అవార్డు ప్రకటించింది.

పాత్రలు-పాత్రధారులు మార్చు

పాటలు మార్చు

  1. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం - గానం: వి.రామకృష్ణ
  2. ఈనాడే బాబూ నీ పుట్టినరోజూ, ఈ ఇంటికే వెలుగు వచ్చినరోజూ - గానం: పి.సుశీల
  3. ఏమిటో ఈ లోకమంతా ఎంతకూ అంతుపట్టని వింత - గానం: వి.రామకృష్ణ
  4. సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది వీడికి పేరేదీ పుట్టే వాడికి చోటేదీ
  5. నూకాలమ్మని నేనే నీ పీకని నొక్కేతానే - గానం: ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. రాయంటీ నా మొగుడు రంగామెల్లీ తిరిగి రాలేదు - గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

మూలాలు మార్చు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు మార్చు