ధన్‌బాద్ జిల్లా

ఝార్ఖండ్ లోని జిల్లా

జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ధన్‌బాద్ జిల్లా ఒకటి. ధన్‌బాద్ పట్టణం జిల్లకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలు రాష్ట్రంలో ధన్‌బాద్ జిల్లా జనసంఖ్యాపరంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది. మొదటి స్థానంలో రాంచీ జిల్లా ఉంది. .[1] ధన్‌బాద్ జిల్లా భారతదేశం బొగ్గు రాజధానిగా గుర్తించబడుతుంది.

ధన్‌బాద్ జిల్లా
धनबाद जिला
జార్ఖండ్ పటంలో ధన్‌బాద్ జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో ధన్‌బాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుఉత్తర ఛోటా నాగ్‌పూర్
ముఖ్య పట్టణంధన్‌బాద్
Government
 • లోకసభ నియోజకవర్గాలుధన్‌బాద్
Area
 • మొత్తం2,074.68 km2 (801.04 sq mi)
Population
 (2011)
 • మొత్తం26,82,662
 • Density1,300/km2 (3,300/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత75.71 %
 • లింగ నిష్పత్తి908
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర మార్చు

మునుపటి మంభుం జిల్లాలోని 1956లో పాత ధన్‌బాద్ ఉపవిభాగం, సాదర్ ఉపవిభాగానికి చెందిన చాస్, చందంకియారీ పోలీస్ స్టేషన్లు భూభాగం కలిపి ధన్‌బాద్ జిల్లాను రూపొందించారు. ధన్‌బాద్ పోలీస్ జిల్లా 1928 నుండి ఉంది. 1971లో బిహార్ రాష్ట్ర జిల్లాల పునర్నిర్మాణం ధన్‌బాద్‌ను ప్రభావితం చేయలేదు. ధన్‌బాద్ పురపాలకం జిల్లాలో ప్రధాన పట్టణం, జిల్లాకు కేంద్రంగా ఉంది. 1991లో ధన్‌బాద్ జిల్లాలోని చాస్ ఉపవిభాగం, గిరిడి జిల్లాలోని బెర్మొ ఉపవిభాగం కలిపి బొకారో జిల్లాగా రూపొందించారు.

పురాతన చరిత్ర మార్చు

చోటా నాగపూర్ మైదానం లోని ప్రధాన భాగంగా ఉన్న ధన్‌బాద్ గురించి పురాతన ఆధారాలు ఏవీలేవు. తరువాత కాలం గురించిన వివరాలు కూడా మర్మంగానే ఉండిపోయింది. 1928లో మంభుం ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి శిలాఫలకాలుగాని, రాగి రేకులు గాని, తాళపత్రాలుగాని లేవు. ఒపాందానికి ప్రామాణికమైన పాత దస్తావేజులు మాత్రమే

మన్భుం మార్చు

1964 ధన్‌బాద్ జిల్లా గజటీర్ 1928 ఒప్పందపు దస్తావేజులను తిరిగి రూపొందించారు. ఇందులో మంభుం గురించిన పూర్తి వివరాలు లభిస్తున్నాయి. మునుపటి మంభుం జిల్లాలో ధన్‌బాద్ చిన్న కుగ్రామంగా ఉండేది. మంభుం జిల్లాకు పురూలియా (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో భాగం) కేంద్రంగా ఉండేది. మంభుం ప్రాంతాన్నిరాజా మాన్‌సింగ్‌కు బహుమాంగా ఇచ్చాడు. మాన్‌సింగ్‌ అక్బర్ యుద్ధంలో విజయం సాధించడానికి సహకరించినందుకు బదులుగా ఈ ప్రాంతం బహూకరించబడింది. మాన్‌సింగ్‌ పేరు మీద ఈ ప్రాంతానికి మంభుం అనే పేరు వచ్చింది. అత్యంత పెద్ద ప్రాంతంగా ఉన్న మంభుం జిల్లా పాలనాసౌలభ్యం కొరకు బిర్బం, మంభుం, సింగ్భుం జిల్లాలుగా విభజించబడింది. 1956 అక్టోబరు 24 న ధన్‌బాద్ జిల్లాగా ప్రకటించబడింది. భౌగోళికంగా ధన్‌బాద్ ఉత్తర దక్షిణాలుగా 43 మైళ్ళు, తూర్పు పడమరలుగా 47 మైళ్ళు విస్తరించి ఉంది. 1991లో ధన్‌బాద్ జిల్లా నుండి బొకారో జిల్లాను వేరుచేసిన తరువాత జిల్లా వైశాల్యం 2995 చ.కి.మీ ఉంటుంది.

మొదటి విభజన మార్చు

ఆరంభంలో ఈ జిల్లా 2 ఉప విభాగాలుగా (ధన్‌బాద్ సాదర్, బఘ్మర ) విభజించబడింది. జిల్లా 6 బ్లాకులుగా విభజించబడింది. తరువాత 4 బ్లాకులుగా మార్చబడి 30 నగర పాలికలు, 228 గ్రామపంచాయితీలు, 1654 గ్రామాలుగా ఉప విభజన చేయబడ్డాయి. తరువాత విశాలమైన జిల్లా భూభాగంలో 2 పోలీస్ ప్రధానకార్యాలయ భూభాగాలుగా (బొకారో, ధన్‌బాద్) విభజించబడింది. తరువాత జిల్లా ప్రస్తుత స్థితికి మారింది. జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం (ధన్‌బాద్ సాదర్) మాత్రమే ఉంది.

  • ప్రస్తుతం జిల్లా 8 బ్లాకులుగా విభజించబడింది : ఝరియా, ధన్‌బాద్, నిర్స, గోవింద్పూర్, బలియపూర్, తుండి, టాప్‌చంచి. బ్లాకులు 181 గ్రామపంచాయితీలు, 1348 గ్రామాలుగా విభజించబడింది. 1991 గణాంకాలు జిల్లా జనసంఖ్య 19,49,526. వీరిలో పురుషులు 10,71,913 స్త్రీలు 8,77,613 ఉన్నాయి. జిల్లాలో 100850 కొండ గుట్టలు, 56454 ఎకరాల అరణ్యాలు ఉన్నాయి. జిల్లా భూభాగం సముద్రమట్టానికి 500-1000 అడుగుల ఎత్తున ఉంది. భూమిలో చిన్నవి పెద్దవిగా కంకరరాళ్ళు నిండి ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కారిడార్‌లో భాగం.[2]

భౌగోళికం మార్చు

జిల్లా పశ్చిమ సరిహద్దులో గిరిడి, ఉత్తర సరిహద్దులో బొకారో, తూర్పు సరిహద్దులో దుమ్కా, గిరిడి, దక్షిణ సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పురూలియా జిల్లాలు ఉన్నాయి. జిల్లా 23°37'3" ఉ, 24°4' ఉ అక్షాంశం, 86°6'30" తూ, 86°50' తూ రేఖాంశంలో ఉంది.

సహజ విభాగాలు మార్చు

భౌగోళికంగా ధన్‌బాద్ జిల్లా 3 భాగాలుగా విభజించబడింది. ఉత్తర, వాయవ్య భూభాలు పర్వత భూభాగం. ఎగువభూములు ఇందులో బొగ్గుగనులు, అధికంగా పరిశ్రమలు ఉన్నాయి. దామోదర్ నదికి దక్షిణంగా మిగిలిన ఎగువ భూములు, మైదానాలు వ్యవసాయ భూములుగా ఉన్నాయి. ఉత్తర, వాయవ్య భూభాగాన్ని పూర్తిగా గ్రాండ్ ట్రంక్ రోడ్డు విభజించింది. జిల్లా పశిమ భూభాగంలో ధంగి కొండలు ఉన్నాయి. ఇవి గ్రాండ్ ట్రంక్ రోడ్డు, తూర్పు రైలు మార్గం మద్యలో విస్తరించి ఉన్నాయి. ఈ కొండలు ప్రధాన్‌కంట నుండి గోవింద్‌పూర్ వరకూ విస్తరించి ధంగివద్ద క్రమంగా 1256 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఉత్తరంలో ప్రశాంత్ కొండలు తూప్చంచి, తుండి వరకు విస్తరించి లఖి వద్ద క్రమాంగా 1,500 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. జిల్లా దక్షిణ భూభాగం అధికంగా ఎగుడుదిగుడు భూమిగా ఉంది. ఇది పడమర నుండి తూర్పుకు విస్తరించి 2 ప్రధాన నదులు దామోదర్, బరకర్‌తో ముగుస్తుంది.

నదులు మార్చు

చోటానాగ్పూర్ మైదానంలో ప్రధానమైన నది దామోదర్. పాలము జిల్లాలో జన్మించిన దామోదర్ నది తూర్పుగా ప్రవహించి రాంచి, హజారీబాగ్ మైదానాల గుండా ప్రవహిస్తూ బొకారో కోనార్, బర్కర్ ఉపనదులను తనలో కలుపుకుంటుంది. తరువాత దామోదర్ నది ధన్‌బాద్‌ జిల్లాలో ప్రవేశిస్తుంది. తరువాత ఈ నదిలో జమూరియా (ధన్‌బాద్ పశ్చిమ సరిహద్దులో ఉంది) కలుస్తుంది. తరువాత మరి కొంత తూర్పుగా ప్రవహించి కార్తి నదిని తనలో కలుపుకుని ప్రశాంత్ పర్వత పాదాలను తాకుతూ కోయల్ ఫీల్డులో ప్రవహిస్తుంది. దామోదర్ నది జిల్లా గుండా 77 కి.మీ దూరం ప్రవహిస్తుంది. దామోదర్ నదిమీద నిర్మించబడిన పంచెత్ ఆనకట్ట దాదాపు 6 కి.మీ పొడవుంటుంది. ఇక్కడ నిర్మించబడిన హైడల్ స్టేషను 40,000 కి.వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

జిల్లాకు బర్కర్ నది జిల్లాకు పశ్చిమ సరిహద్దుగా ఉంది. ఇది 77 కి.మీ దూరం ప్రవహించి జిల్లాకు ఆగ్నేయ దిశలో ప్రవహిస్తూ క్రమంగా దక్షిణ దిశకు చేరి చిర్కుడా వద్ద దామోదర్ నదితో కలుస్తుంది. ఈ నది దామోదర్ నదితో సంగమించే 13 కి.మీ ముందు మైతన్ ఆనకట్ట నిర్మించబడింది. ఇక్కడ నిర్మించబడిన మైతాన్ పవర్ స్టేషను 60,000 కి.వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

  • జిల్లాలో ప్రవహిస్తున్న ఇతరనదులలో గోబై, ఇర్జి, ఖుడియా, కర్తి గురినతగినవి.

వాతావరణం మార్చు

విషయ వివరణ వాతావరణ వివరణ
శీతాకాలం నవంబ-ఫిబ్రవరి
వాతావరణ విధానం పొడి వాతావరణం (నవంబరు-ఫిబ్రవరి ఆహ్లాదకరం)
వేసవి ఫిబ్రవరి-జూన్
వర్షపాతం 1300 మి.మీ
అత్యధిక వర్షపాతం జూలై-ఆగస్టు
వర్షాకాలం జూలై-అక్టోబరు
జూలై సరాసరి వర్షపాతం 287 మి.మీ
ఆగస్టు సరాసరి వర్షపాతం 445 మి.మీ

ఆర్ధికం మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ధన్‌బాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,682,662,[1]
ఇది దాదాపు. కువైట్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 148వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1284 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.91%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 908:1000 [1]
జాతీయ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 75.71%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు మార్చు

ధన్‌బాద్ జిల్లాలో పలు సాంస్కృతిక సంప్రదాయాలకు చెందిన ప్రజలు మిశ్రితమై ఉన్నారు. జిల్లాలో బెంగాలీలు, బిహారీలు, గిరిజనులు అధికంగా జీవిస్తున్నారు. బెంగాలీ ప్రజలు మరాఠీ మిశ్రిత బెంగాలీని, ఖొర్తా భాషలను మాట్లాడుతుంటారు. జిల్లాలో గుజరాయీ, పంజాబీలు, తమిళులు, మలయాళీలు, తెలుగు వారు, రాజస్థానిక్ మార్వారీ ప్రజలు నివసిస్తున్నారు. అందుకే ధన్‌బాద్ సాంస్కృతిక సంగమ ప్రాంతంగా గుర్తించబడుతుంది. ఈ కారణంగా జిల్లాలో పలుభాషలు వాడుకలో ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 11 December 2009. Archived from the original on 27 అక్టోబరు 2011. Retrieved 17 September 2011.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Kuwait 2,595,62
  5. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Nevada 2,700,551

వెలుపలి లింకులు మార్చు