నగరి

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, నగరి మండల పట్టణం

నగరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా లో పట్టణం, అదే మండలానికి కేంద్రం. నగరిలో కరియ మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం ఇక్కడ జరిగిందని శ్రీ మహా విష్ణువు ఇక్కడే గజరాజుని మకరం బారి నుండి రక్షించాడనీ చెబుతారు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా జరిగే ఉత్సవాలు కంచి గరుడ సేవ, కనుమ, రథ సప్తమి, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.

పట్టణం
పటం
నిర్దేశాంకాలు: 13°20′N 79°35′E / 13.33°N 79.58°E / 13.33; 79.58
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండలంనగరి మండలం
విస్తీర్ణం
 • మొత్తం35.45 km2 (13.69 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం62,253
 • సాంద్రత1,800/km2 (4,500/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి985
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 91-8577 Edit this on Wikidata )
పిన్(PIN)517590 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

చరిత్ర సవరించు

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. వీరాస్వామయ్య తాను విడిది చేసిన బుగ్గగుడి క్షేత్రం, పుత్తూరు పట్టణాలకు మధ్య ఈ నగరి మీదుగా ప్రయాణించారు. ఆ ప్రయాణంలో నగరి వద్దనే కొండ కనుమ దాటాలని అతను వ్రాశారు. నగరి పేట స్థలం (పట్టణం అని అర్థం) అని వర్ణించారు. ఆ పట్టణంలో 1830 నాటికే బాటసారులకు అవసరమైన అన్ని సామాన్లు కొనదొరికేవని తెలిపారు. అతను ప్రయాణం చేసే సమయంలో వెంకటేశ నాయుడి కుమారుడు గొప్ప సత్రం కట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.[2]

భౌగోళికం సవరించు

నగరి సమీప నగరమైన తిరుపతికి 51 కి.మి దూరంలో ఉంది

జనగణన విషయాలు సవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం నగరి పట్టణ పరిధిలో మొత్తం 14,271 కుటుంబాలు నివసిస్తున్నాయి. నగరి మొత్తం జనాభా 62,253, అందులో 31,363 మంది పురుషులు, 30,890 మంది స్త్రీలు ఉన్నారు. నగరి పట్టణ సగటు లింగ నిష్పత్తి 985. నగరి పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6842, ఇది మొత్తం జనాభాలో 11%. 0-6 సంవత్సరాల మధ్య 3571 మంది మగ పిల్లలు, 3271 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరిలో పిల్లల లింగ నిష్పత్తి 916, ఇది సగటు లింగ నిష్పత్తి (985) కంటే తక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం, నగరి అక్షరాస్యత రేటు 77.8%. ఆ విధంగా చిత్తూరు జిల్లాలో 71.5% అక్షరాస్యతతో పోలిస్తే నగరి అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. నగరిలో పురుషుల అక్షరాస్యత రేటు 86.49%, స్త్రీల అక్షరాస్యత రేటు 69.15%.[3]

పరిపాలన సవరించు

నగరి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

పర్యాటక ఆకర్షణలు సవరించు

  • కరియ మాణిక్యస్వామి దేవాలయం

మూలాలు సవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  3. "Nagari Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2022-03-11.[permanent dead link]

బయటి లింకులు సవరించు

నగరి గురించి తి.తి.దే. వారి సైటు నుండి

"https://te.wikipedia.org/w/index.php?title=నగరి&oldid=3884110" నుండి వెలికితీశారు