నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడుగా పనిచేశాడు. [1] నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కుమారుడు. ఏబీఎన్ ఛానల్ సర్వేలో 175 మంది ఎమ్మెల్యేలలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొదటి స్థానంలో నిలిచారు.
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి | |
---|---|
నియోజకవర్గం | అనపర్తి |
వ్యక్తిగత వివరాలు | |
రాజకీయ పార్టీ | తెలుగు దేశం పార్టీ |
వృత్తి | రాజకీయ నాయకుడు |
తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, వారితో నేరుగా మమేకం అవ్వడానికి మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేపట్టారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేపట్టిన కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్ఫూర్తినిచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు 2014 నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గాన్ని 5 వేలకోట్లతో అభివృద్ధి చేశారు, 2018 నుంచి 2019 వరకు మరో 1.50 వేల కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు.నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేశారు.[ వివరణ అవసరం
]
- ↑ "FOURTEENTH ANDHRA PRADESH LEGISLATIVE ASSEMBLY Constituted on 20.05.2014". Legislative Assembly of Andhra Pradesh. Archived from the original on 6 July 2015. Retrieved 10 August 2021.