పతనంతిట్ట జిల్లా

కేరళ లోని జిల్లా

పతనంతిట్ట జిల్లా, (మలయాళం:പത്തനംതിട്ട ജില്ല) భారతదేశం కేరళ రాష్ట్రంలోని జిల్లా.[2] పతనంతిట్ట పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. పతనంతిట్ట కేరళ రాష్ట్ర దక్షిణంలో ఉంది.పతనంతిట్ట జిల్లా, కేరళ రాష్ట్రంలోని పదమూడవ రెవెన్యూ జిల్లా. ఇది 1982 నవంబరు 1 నవంబరు నుండి అమలులోకి వచ్చింది.జిల్లా మొత్తం విస్తీర్ణంలో సగానికి పైగా అడవులు విస్తరించి ఉన్నాయి. పతనంతిట్ట జిల్లా వైశాల్యంలో రాష్ట్రంలో 7వ స్థానంలో ఉంది.ఈ జిల్లా కేరళ, తమిళనాడులోని అల్లెపే, కొట్టాయం, కొల్లాం, ఇడుక్కి జిల్లాలతో సరిహద్దులను కలిగి ఉంది. సమీప నగరం తిరువల్ల, 30 కి.మీ దూరంలో ఉంది. తిరువల్ల రైల్వే స్టేషన్ తిరువల్ల-కుంబజా హైవే మీదుగా 30 కి.మీ. ప్రతి 4 నిమిషాలకు బస్సులు తిరుగుతాయి. తిరువల్ల నుండి పతనంతిట్ట వరకు & వైస్ వెర్సా. పతనంతిట్ల పట్టణం జిల్లా కేంద్రం, అదే పేరుగల పట్టణం. ఈ పట్టణం 23.50 కిలో మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 38,000 జనాభాతో ఉంది. ప్రసిద్ధ హిందూ పుణ్యక్ష్జేత్రం శబరిమలై ఈ జిల్లాలోనే ఉంది.

Pathanamthitta district
പത്തനംതിട്ട ജില്ല
district
Pathanamthitta, the district headquarters
Pathanamthitta, the district headquarters
దేశంIndia
రాష్ట్రంకేరళ
ప్రధాన కార్యాలయంPathanamthitta
Government
 • District CollectorP. Venugopal[1]
Area
 • Total2,642 km2 (1,020 sq mi)
Population
 • Total12,31,577
 • Density467/km2 (1,210/sq mi)
భాషలు
 • అధికారMalayalam,ఆంగ్లం
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-KL-

సరిహద్దులు మార్చు

ఈ జిల్లాకు తమిళనాడు, కొట్టాయం, ఇడుక్కి, ఆళప్పుజ్హ, కొల్లాం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.జిల్లాలో ప్రముఖ వ్యాపారకేంద్రం తిరువల్ల పట్టణం. జిల్లాలో తిట్ట, తిరువల్ల, అదూర్, పండలంలోని, రన్న, కొళెంచెరి, మల్లపలయ్, కొన్ని, కొయిపురం, ఉంబనద్, పుల్లద్ ప్రధాన పట్టణాలు.

పర్యాటకం మార్చు

పతనమ్ తిట్ట యాత్రాకేంద్రంగా గుర్తించబడుతుంది. జిల్లాకు యాత్రీకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జిల్లాలో ప్రఖ్యాత శబరిమల క్షేత్రం ఉంది. జిల్లాలో మూడు నదులు ప్రవహిస్తున్నాయి. పులుల అభయారణ్యంతో కూడిన ఆటవీ భూభాగం ఉంది. జిల్లాకు అధికసంఖ్యలో ప్రకృతి ప్రేమికులను, వన్యమృగ ఆరాధికులను తీసుకువస్తుంది. జిల్లా పర్యాటకం జిల్లాకు వచ్చే యాత్రీకుల సంఖ్య కారణంగా జిల్లాకు " దేవుని నివాసం " అనే పేరు వచ్చింది.

జనాభా గణాంకాలు మార్చు

2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,231,577[3] పతనంతిట్ట కేరళ రాష్ట్రంలో జనసంఖ్యా పరంగా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాలు ఉన్నాయి.[4] పత్తనంతిట్ట జిల్లా మొదటి పోలియో రహిత జిల్లాగా ప్రకటించబడింది. [5] జిల్లా 10.03% నగరీకరణ చేయబడింది. .[6]

పేరు వెనుక చరిత్ర మార్చు

జిల్లా పేరులోని మలయాళ పదాలలో పత్తనం, తిట్ట నదీతీర గృహాల వరుస అని అర్ధం.[7] జిల్లా కేంద్రం అచంకొవి నదీతీరంలో ఉంది.

చరిత్ర మార్చు

జిల్లా భూభాగం గతంలో పండలం భూభాగంలో భాగంగా ఉంది. పండలం భూభాగం పాండ్యరాజులతో సంబంధం ఉంది. [8] పండలం భూభాగం ట్రావన్‌కోర్ రాజ్యంలో విలీనం చేసిన తరువాత 1820లో ఈ ప్రాంతం ట్రావన్‌కోర్ ఆధీనంలోకి వచ్చింది. 1930లో పతనమ్‌తిట్ట జిల్లా " రియూనియన్ ఉద్యమం " కేంద్రంగా ఉంది. క్రిస్టియన్ డినామినేషన్ కాథలిక్ చర్చితో విలీనమై సిరో- మలంకర ఆర్థడాక్స్ చర్చిగా రూపొందాలని మలంకరా ఆర్థడాక్స్ చర్చి కేంద్రంగా ఉద్యమం సాగించారు.[9]

రూపకల్పన మార్చు

జిల్లా 1982 నవంబరు 1 న రూపొందించబడింది. మునుపటి కొల్లం, కొన్ని, ఇడుక్కి జిల్లాలలో కొంతభూభాగం తీసుకుని పత్తనంతిట్ట జిల్లా రూపొందించబడింది. ఆళంపుళా నుండి పతనమ్‌తిట్ట, అదూర, రన్ని, కొన్ని (పత్తనంతిట్ట), కోళెంచెర్రి, కొల్లాం జిల్లా నుండి తీసిన తిరువల్ల, మల్లపల్లి తాలూకాలు తీసుకొనబడ్డాయి.[7]

భౌగోళికం మార్చు

పతనమ్‌తిట్ట భూబంధిత జిల్లా. ఇది 9.27 డిగ్రీల ఉత్తర అక్షాంశంలోనూ 76.78 తూర్పు రేఖాంశంలోనూ ఉంది. జిల్లా వైశాల్యం 2637 చ.కి.మీ. [10] జిల్లా ఉత్తర సరిహద్దులో కొట్టయం, ఇడుక్కి, పశ్చిమ సరిహద్దులో ఆళప్పుళా, దక్షిణ సరిహద్దులో కొల్లం జిల్లా, తర్పు సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం ఉన్నాయి. [11] జిల్లా మూడు నైసర్గికంగా మూడు భాగాలుగా విభజించబడింది. హైలాండ్, మిడ్‌లాండ్, లోలాండ్. హైలాండ్ పశ్చిమ కనుమలకు సమీపంగా ఉంది. ఇక్కడ ఎత్తైన కొండలు, దట్టమైన అరణ్యాలతో నిండి ఉన్నాయి. పశ్చిమ ఘాట్ సరాసరి ఎత్తు 800 మీ.ఎత్తు ఉంది. మిడ్‌లాండ్‌లో చిన్న కొండలు ఉన్నాయి. చివరిగా లోలాండ్ భూములు ఉన్నాయి. చివరిగా ఉన్న దిగువభూములలో ఆళంపుళా వరకు విస్తారంగా కొబ్బరి చెట్లు ఉన్నాయి.[12]

వాతావరణం మార్చు

పతనంతిట్ట జిల్లా
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
16
 
32
22
 
 
236
 
33
23
 
 
76
 
33
24
 
 
167
 
33
25
 
 
125
 
32
25
 
 
595
 
30
24
 
 
232
 
29
23
 
 
563
 
29
23
 
 
297
 
30
23
 
 
196
 
30
23
 
 
93
 
30
23
 
 
88
 
31
23
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం అనుకూల వాతావరణం
సీజన్లు వేసవి కాలం, వర్హాకాలం, శీతాకాలం
వేసవి మార్చి - మే
శీతాకాలం డిసెంబరు - ఫిబ్రవరి
వర్షాకాలం జూన్- సెప్టెంబరు (నైరుతీ ఋతుపవనాలు)
అక్టోబరు - నవంబరు (ఈశాన్య ఋతుపవనాలు)
గరిష్ఠ ఉష్ణోగ్రత 39 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 20 ° సెల్షియస్
వర్షపాతం మి.మీ

అరణ్యం మార్చు

పత్తనంతిట్ట జిల్లాలో అభయారణ్యం ఉంది. జిల్లాలో 1385.27 చ.కి.మీ వైశాల్యంలో రన్ని అభయారణ్యం ఉంది. .[3] జిల్లాలో అరణ్యప్రాంతం దాదాపు 50% ఉంది. ఇది సగం సతతహరితారణ్యం, సగం చిత్తడి భూములను కలిగి ఉంది. వుడ్ ఆధారిత పరిశ్రమలకు అరణ్యాలు ముడిసరుకును అందిస్తుంది. ఇక్కడ టింబర్ ప్రధాన ఉత్పత్తిగా ఉంది.

నదులు మార్చు

జిల్లాలో మూడు ముఖ్యమైన నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులు పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలోని వివిధ పర్వతాల నుండి ఉద్భవించాయి. కేరళలో మూడవ పొడవైన నది అయిన పంబ (176 కి.మీ. లేదా 109 మై.) పులచిమలలో దాని మూలాన్ని కలిగి ఉంది. అచ్చన్‌కోవిల్ నది (128 కి.మీ. లేదా 80 మై.) పసుకిడ మెట్టు నుండి మణిమాల నది (90 కి.మీ. లేదా 56 మై.) తట్టమలై కొండల నుండి ఉద్భవించింది. కల్లాడ నదిలో కొంత భాగం జిల్లా దక్షిణ సరిహద్దులో కూడా వస్తుంది. పంబా, అచ్చన్‌కోవిల్ నదులు కలిసి పతనంతిట్ట మొత్తం వైశాల్యంలో 70% కంటే ఎక్కువ ప్రవహిస్తున్నాయి.[13][14]

రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో మూడో వంతు ఈ జిల్లా నుండి వస్తోంది. పంబా బేసిన్ వద్ద ఉన్న శబరిగిరి జలవిద్యుత్ ప్రాజెక్ట్, ఈ జిల్లాలో కక్కడ్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. సమృద్ధిగా ఉన్న నీటి వనరులను కల్లాడ, పంబ నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా సాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తారు.

నల్కలిక్కల్ వంతెన 50 సంవత్సరాలకు పైగా నిర్మించబడింది, దాని స్థానంలో కొన్ని సంవత్సరాల క్రితం కొత్త వంతెన, అప్రోచ్ రోడ్డు ఉంది. పాత వంతెనకు 4 స్పాన్‌లు ఉన్నందున ఈ పేరు 'నాలు' (నాలుగు), 'కల్' (కాళ్లు లేదా వంతెన విషయంలో స్పాన్‌లు) పదాల నుండి ఉద్భవించింది. ఇది అరన్ముల, సమీపంలోని 'కిడంగనూర్' గ్రామాన్ని కలుపుతుంది.

ఆర్ధికం మార్చు

వ్యవసాయం మార్చు

 
Pepper - the King of Spices - on a Pepper Vine
 
Cocoa pods in various stages of ripening
 
Sugar cane field

జిల్లా ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉంది. 75% ప్రజలు వ్యవసాయ ఆధారిత వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా రబ్బర్ పండించబడుతుంది. 478 చ.కి.మీ ప్రాంతంలో రబ్బర్ పండించబడుతుంది. కొంరాంతం అధిక తేమను కలిగి ఉంటుంది కనుక అది రబ్బర్ పంటకు అనుకూలంగా ఉంటుంది. తరువాత స్థానం వరి పంటకు ఉంది. జిల్లాలో 478 చ.కి.మీ ప్రదేశంలో వరి పండించబడుతుంది. వరిపంట చిత్తడి నేలలలో పండించబడుతుంది. మెట్ట పొలాలలో కర్రపెండెలం, పప్పుధాన్యాలు పండించబడుతున్నాయి. జిల్లాలో అదనంగా కొబ్బరి, అరటి, నల్లమిరియాలు, అల్లం పండుంచబడుతుంది. కొన్ని ప్రదేశాలలో జీడిపప్పు, అనాస, చెరకు, కోకో, సుగంధ సంబంధిత చెట్లు సాగుచేయబడుతున్నాయి. జిల్లాలో అభయారణ్యం ఉన్న కారణంగా వ్యవసాయానికి తక్కువగానే భూమి కేటాయించబడి ఉంది.

'ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు'
సాగు కింద ఉత్పత్తులు ఏరియా (km²) ప్రొడక్షన్ (టన్ను)
వరి 43,39 10784
చెరకు 1.23 601
నల్ల మిరియాలు 56,51 1328
అల్లం 5.26 1358
ఏలకులు 6.64 82
జీడిపప్పు 11.41 636
రబ్బర్ 478,47 69094
కర్రపెండలం 79,91 226993
కొబ్బరి 217,39 380
  • Source: Statistics for Planning-DES 2006

ఫిషరీలు మార్చు

పత్తనంమిట్ట జిల్లా మంచినీటి చేపల పరిశ్రమకు ప్రసిద్ధిచెంది ఉంది. నదులు, చెరువులు, మడుగులు, గుండాలు, జలశయాలు మొదలైన జలవనరులు ఉన్నందున జిల్లా మంచినీటి పెంపకానికి అనుకూలంగా ఉంది. మంచి నీటి వనరుల సర్వే తరువాత జిల్లాలో చేపల పెంపకం అధికరించింది. జిల్లాలో ఆర్నమెంటల్ ఫిష్ బ్రీడింగ్ కేంద్రం, నేషనల్ ఫిష్ సీడ్ ఫాంఉంది.[10] జిల్లాలో 2444 మంది మత్యకారులు జీవనోపాధికి చేపలపెంపకం మీద ఆధారపడి ఉన్నారు. పతనమ్‌తిట్ట ఫిష్ కల్చర్ రంగంలో సుసంపన్నంగా ఉంది. జిల్లాలో పిసి కల్చర్ కార్యక్రమాలకు సహకారం అందించడానికి 1990లో ఫిష్ డెవెలెప్మెంటు ఏజెంసీ (ఎఫ్.ఎఫ్.డి.ఎ) స్థాపించబడింది. ఈ ఏజెంసీ చేపల రైతులకు సాంకేతిక సహాయం, ఆర్థికసహాయం అందిస్తున్నారు. భవిష్యత్తులో ఎఫ్.ఎఫ్.డి.ఎ సరికొత్త చేపల పెంపకానికి అవసరమైన చెరువులు త్రవ్వించాలని, జలాశయాలను పూడిక తీయడం, చేపల విత్తనాలను సరఫరాచేయడం, చేపల ఆహారం సరఫరాచేయడం, ఔషధాలను అందించడం, సమైక్య వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, చిన్నచిన్న చేపల ఉత్పత్తిని ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలను ఆలోచిస్తున్నారు.

పరిశ్రమలు మార్చు

పతనమ్‌తిట్ట జిల్లాలో పారిశ్రామీకరణ తక్కువగా ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లాగా పతనమ్‌తిట్ట జిల్లా గుర్తించబడితుంది. 2006 గణాంకాలను అనుసరించి జిల్లాలో 13,898 చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల ద్వారా 46,421 మందికి ఉపాధి అవకాశం లభిస్తుంది.[10] చేనేత పరిశ్రమలో 378 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు ఎస్టేట్లు 8.5 హెక్టార్ల వ్యవసాయంలో ఉన్నాయి. డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ సెంటర్ పారిశ్రామికుల అభ్యర్ధన మీద అవసరమైన భూమిని కేటాయిస్తుంది. కింఫ్రా కొరకు 14.48 హెక్టారులు కేటాయించబడ్డాయి. " కేరళ స్మాల్ ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు కార్పొరేషన్ లిమిటెడ్ " (కేరళ చిన్నతరహా పరిశ్రమలకు (సిడ్కొ) ) 5 ఎకరాల భూమి కేటాయించబడింది. గ్రీన్ చానెల్ కమిటీ కమిటీ పారిశ్రామికుల సహాయార్ధం లైసెంసులు, క్లియరెంస్, ఎలెక్ట్రిక్‌సిటీ, నీటి సరఫరా జాప్యం లేకుండా అందిస్తుంది.

నిర్వహణ మార్చు

జిల్లా ప్రధాన కార్యాలయం పతనంతిట్ట పట్టణంలో ఉంది. జిల్లా పాలనా యంత్రాంగం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉంటుంది. సాధారణ వ్యవహారాలు, రెవెన్యూ రికవరీ, భూసేకరణ, భూ సంస్కరణలు, ఎన్నికల బాధ్యతలను కలిగి ఉన్న ఐదుగురు డిప్యూటీ కలెక్టర్లు అతనికి సహాయం చేస్తారు.[15] కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, సిపిఎం/సిపిఐ ప్రధాన రాజకీయ పార్టీలు.

విభాగాల వివరణ మార్చు

విషయాలు వివరణలు
రెవెన్యూ డివిషన్లు 2 తిరువల్ల - అడోర్
తాలూకాలు 6 అదూర్, కొన్ని, కొళెంచెర్ర్య్, రన్న, మల్లప్పల్లయ్, తిరువల్ల.
జిల్లా పంచాయితి 1 పంచాయితీ కేంద్రం (పత్తనం తిట్ట)
గ్రామపంచాయితీలు 53
గ్రామాలు 70
మండలాలు 9
పురపాలకాలు 3 అడోర్, పతనమ్‌తిట్ట, తిరువల్ల
సెంసస్ పట్టణం కొళెంచేరి
ప్రధాన పట్టణాలు పండలం, రన్ని, కొన్ని, మలపల్లి
అసెంబ్లీ జియోజకవర్గాలు 5
పార్లమెంటరీ నియోజకవర్గం 1 పత్తనం తిట్ట
  • తిరువళ్ల రెవెన్యూ డివిజన్: తిరువల్ల తాలూకా, మల్లాపల్లి తాలూకా, రన్ని తాలూకా
  • అదూర్ రెవెన్యూ డివిజన్: కోజంచెర్రి తాలూకా, కొన్ని తాలూకా, అదూర్ తాలూకా[16][17]

తిరువల్ల తాలూకా మార్చు

  • జిల్లాకేంద్రం: తిరువల్ల. గ్రామాలు: 12
  • గ్రామాలు: తిరువల్ల, కుత్తప్పుళ, తొత్తపుళస్సెర్య్, కొయిపురం, ఎరవిపెరూర్, కుత్తూర్, కవియూర్, కవుంభగం, పెరింగర, నెదుంపురం, కదప్ర, నిరనం

మల్లపల్లి తాలూకా మార్చు

  • కేంద్రం: మల్లపల్లి. గ్రామాలసంఖ్య 9
  • గ్రామాలు: కల్లూప్పర, ఆనిచదు, పురమత్తం, తెల్లియూర్, ఏళుమత్తూర్, పెరుంపెత్తి. కొత్తంగల్ మల్లప్పల్లి, కున్నంథనం.

రన్న తాలూకాలో మార్చు

'ప్రధాన కార్యాలయం:' రన్న. గ్రామాల: 10 '

'గ్రామాలు:' 'ఫెరునద్ రన్న-వదస్సెరిక్కర, ఆథిక్కయం, కొల్లముల, చెథక్కల్]], పళవంగది (తిట్ట), అంగడి, రన్న, చెరుకొలె, ఆయరూర్

కొళెంచెర్రి తాలూకా మార్చు

'ప్రధాన కార్యాలయం:' తిట్ట. గ్రామాల: 11 '

మెళువెలి, ములనద, కిదంగన్నూర్, అరణ్ముల, ంఅల్లప్పుజ్హస్సెర్య్, కొళెంచెర్ర్య్, నరంగనం: 'గ్రామాలు' ఎలంథూర్, చెన్నీర్కర, ఓమల్లూర్, తిట్ట

కొన్ని తాలూకా మార్చు

'ప్రధాన కార్యాలయం:' కొన్ని, భారతదేశం గ్రామాల: 14.

'గ్రామాలు:' 'వల్లిచొదె-కొట్టాయం, వల్లిచొదె, మలయలపుళ, మిలప్ర, కూడళ్, కలంజూర్, ప్రమదొం, కొన్ని, భారతదేశం, కొన్ని-తళం, ఈరవొన్, అరువప్పులం, తన్నిథొదు, సీథథొదు, చిత్తర్ (కేరళ)

అదూర్ తాలూకా మార్చు

'ప్రధాన కార్యాలయం:' అదూర్. ' గ్రామాల: 14 '.

  • 'గ్రామాలు': అదూర్, ఏరథు, ఏనతు, ఏళంకులం, అంగదిచ్కల్, కొదుమొన్, ఏనదిమంగలం, కదంపనద్, పెరింగనద్, పల్లిక్కల్ (పత్తనంతిట్ట ) తుంపమాన్, పండలం తెక్కెకర, కురంపాలకు, పండలం

ప్రయాణవసతులు మార్చు

రహదారి మార్గాలు మార్చు

జాతీయ రహదారి 220 (జాతీయ రహదారి 220) లో కొంత భాగం తిరువల్ల గుండా వెళుతుంది. రాష్ట్ర రహదారి 07, 08 ఇతర పట్టణాలు, జిల్లాలకు అనుసంధానం అందించే రెండు ప్రధాన రాష్ట్ర రహదారులు. రాష్ట్ర రహదారి 07, టి.కె. రోడ్ అని కూడా పిలుస్తారు, ఇది పతనంతిట్ట మీదుగా మాత్రమే వెళుతుంది. రాష్ట్ర రహదారి 08ని మెయిన్ ఈస్టర్న్ హైవే అని కూడా పిలుస్తారు, ఇది కేరళలో రెండవ పొడవైన రాష్ట్ర రహదారి. ఇది కొల్లాం జిల్లాలోని పునలూర్, ఎర్నాకులం జిల్లా లోని మువట్టుపుజ పట్టణాలను కలుపుతుంది. కేరళ పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ గ్రామ రహదారులతో సహా జిల్లాలోని అన్ని రహదారులను నిర్వహిస్తుంది. 2005 నాటికి, కేరళ పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ జిల్లాలో సుమారు 1,596 కిలోమీటర్లు (992 మై.) రహదారిని నిర్వహిస్తోంది.

టి.కె. త్రోవ రోడ్డుతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంచి కనెక్టివిటీ ఉంది. అయితే, ఇతర రహదారులపై, ముఖ్యంగా తూర్పు వైపు, రాష్ట్ర రవాణా సేవ తక్కువ తరచుగా ఉంటుంది. ఇక్కడ, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు రవాణా అవసరాలను సులభతరం చేస్తారు. జిల్లాలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడు ప్రధాన డిపోలు ఉన్నాయి. పతనంతిట్ట నుండి కోయంబత్తూరు, తెన్కాసికి రాష్ట్ర అంతర్గత సర్వీసులు ఉన్నాయి.

రైలుమార్గం మార్చు

తిరువళ్ల రైల్వే స్టేషన్ (TRVL) జిల్లాలో ఉన్న ఏకైక రైల్వే స్టేషన్. అయితే, అలప్పుజా జిల్లాలోని చెంగన్నూర్ రైల్వే స్టేషన్ జిల్లాలోని చాలా ప్రాంతాలకు సమీపంలో ఉంది. త్రివేండ్రం, కొచ్చిన్, చెన్నై, మంగళూరు, ముంబై, హైదరాబాద్, కలకత్తా, న్యూఢిల్లీ, గోవా, బరోడా, అహ్మదాబాద్ మొదలైన ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు స్టేషన్ల నుండి అందుబాటులో ఉన్నాయి. కంప్యూటరైజ్డ్ రైలు రిజర్వేషన్ కేంద్రాలు తిరువల్ల రైల్వే స్టేషన్, పతనంతిట్ట, చెంగన్నూర్ రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి.

వాయుమార్గం మార్చు

తిరువనంతపురంలోని త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం (TRV) (119 కి.మీ. లేదా 74 మై.) సమీప విమానాశ్రయం. నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియాకు తిరువల్లలో రిజర్వేషన్ కార్యాలయం ఉంది. అరన్ముల అంతర్జాతీయ విమానాశ్రయం పతనంతిట్ట పట్టణం నుండి 18 కిమీ, కోజెన్చేరి పట్టణం నుండి 3 కిమీ, తిరువల్ల నుండి 20 కిమీ దూరంలో అరన్ముల వద్ద ప్రణాళిక చేయబడింది. రూ. 2,000 కోట్లతో నిర్మించిన ఈ విమానాశ్రయం అనేక దశాబ్దాలలో మధ్య కేరళలో అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు.

2011 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,195,537, [4]
ఇది దాదాపు. తైమూర్- లెస్టె దేశ జనసంఖ్యకు సమానం.[18]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[19]
640 భారతదేశ జిల్లాలలో. 399వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 453 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. -3.12%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 1129:1000, [4]
జాతియ సరాసరి (928) కంటే. ఎక్కువ
అక్షరాస్యత శాతం. 96.93%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

2001 గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
2001 గణాంకాలను అనుసరించి - జనసంఖ్య 1,234,016
జనసాంధ్రత 467 [20]
జనసాంధ్రత స్థానం 2వ స్థానం 1 వ స్థానం ఇడుక్కి
షెడ్యూల్డ్ కులాలు, తెగలు 13%
స్త్రీలసంఖ్య
స్త్రీ: పురుష నిష్పత్తి 1094:1000, [21]
అక్షరాస్యతా శాతం 95%.
1991 నుండి 2001 వరకు జనసంఖ్య అభివృద్ధి.

మతం మార్చు

విషయాలు వివరణలు
హిందువులు 694,560 (56.28%)
క్రైస్తవులు 481,602 (39.03%)
ముస్లిములు 56,457 (4.58%)
ఇతర మతాలు భౌద్ధులు, జైనులు, సిక్కులు

[22]

క్రైస్తవం మార్చు

విషయాలు వివరణలు
మలంకర ఆర్ధడాక్స్ చర్చ్ 182, 352
మార్తోమా సిరియన్ 154, 751
కనయా జాకోబ్ 57,256
మలంకర కాథలిక్కులు 54,326
ఇతరులు ప్రొటెస్టేంట్లు

క్రైస్తవ తెగలలో, మలంకర ఆర్థోడాక్స్ చర్చి, మార్ థోమా సిరియన్ చర్చి, జాకోబైట్ చర్చి, మలంకర కాథలిక్ చర్చిలు ప్రధాన కమ్యూనిటీలు, మలంకర ఆర్థోడాక్స్ చర్చి జనాభా, మార్ థోమా సిరియన్ చర్చి.

సంస్కృతి మార్చు

పతనమ్‌తిట్ట జిల్లా పండుగలకు, ఉత్సవాలకు ప్రసిద్ధి. పాండ్యాని జానపద కళలకు ప్రసిద్ధి. ఈ జానపద కళలలో వర్ణరంజితమైన కళలు (పదేని) దక్షిణ కేరళ ఆలయ సంరదాంతోముడిపడి ఉంటాయి. సంగీతం, నృత్యం, పైంటింగ్, వ్యంగ్యం కలగలుపుగా ఉంటాయి.శబరిమల, మరమొన్ సమావేశం, ఆనందపల్లి, కదమ్మనిట్ట జిల్లాలో నిర్వహించబడుతున్న ప్రధాన ఉత్సవాలలో ప్రత్యేకమైనవి.[23] ఓనం, విషు వంటి సాంప్రదాయ కేరళీయ పండుగలు అలాగే ఇతర ప్రధాన క్రైస్తవ, ఇస్లాం పండుగలు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ ప్రాంతం సాంస్కృతిక వారసత్వం, మత సామరస్యానికి ప్రసిద్ధి చెందింది. వివిధ మతాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం కనిపిస్తుంది.

ఆహార సంస్కృతి మార్చు

పతనమ్‌తిట్ట ప్రజలు కేరళ భోజనం ఆహారంగా తీసుకుంటారు. కేరళ భోజనంలో విస్తారంగా కొబ్బరి, సుగంధద్రవ్యాలు అధికంగా ఉంటాయి. అదనంగా దక్షిణభారతీయ భోజనం, చైనీస్ ఆహారం కూడా ప్రజల ఆభిమాన ఆహారంగా ఉన్నాయు. జిల్లా ప్రజలు సాధారణాంగా దక్షణిభారతీయ దుస్తులను ధరిస్తుంటారు. యువత సంప్రదాయ వస్త్రాలతో మాత్రం ఇండో- వెస్టర్న్ దుస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

సాహిత్యం మార్చు

పతనమ్‌తిట్ట జిల్లాలో మలయాళం సాహిత్యం ఆరభకాల సాహిత్యం, మళ్యాళం కవిత్వం స్థానిక సంప్రదాయం మూలలు ఉన్నాయి. 1350, 1450 కాలానికి చెందిన నిరాణం కవులు ముగ్గురు ఈ జిల్లా ప్రాంతంలో నివసించారు. జిల్లాలో కవుల చేత భగవద్గీత, భరతమాల ( మహాభారతం సూక్ష్మ రూపం), రామాయణం, భారతం, శివరాత్రి మహత్యం మలయాళ అనువాదం చెయ్యబడ్డయి. మలయాళ భాషలో ఇలాంటి కవిత్వ కృషిలో ఇది చాలా ప్రధానమైనదని భావిస్తున్నారు.

ప్రముఖులు మార్చు

పతనమ్‌తిట్ట జిల్లాలో పలువురు కవులు జన్మించారు. వీరిలో కేరళ వర్మ (పండలం), ములూర్ ఎస్.పద్మనభ పణికర్, పుథెంకవు మథన్ తరకన్, వెన్నిక్కులం గోపాల రూప్, కదమ్మనిత్త రామకృష్ణన్, నెల్లిక్కల్ మురలీధరన్, కె.వి.సైమన్ మొదలైన వారు ముఖ్యులు. అలాగే గురు నిత్య చైతన్య యతి, డాక్టర్. కె. ఎం. జార్జ్, ఈదయరన్ముల కె.ఎం వర్గీస్, డాక్టర్. కె. ఎం. తరకన్, కొన్నియూర్ నరేంద్రనాథ్ మొదలైన రచయితలకు జిల్లాతో సంబంధాలు ఉన్నాయి. చిత్రకారులు, వి వంటి ఎస్ వలీథన్, సి కె. రా, పారిస్ విశ్వనాథన, కార్టూనిస్ట్స్, పి వంటి కె. మంథ్రి, ఎస్.జిథెష్, మధు ఒమల్లూర్ మొదలైన వారు జిల్లాలో జన్మించారు. చలచిత్ర సీమకు సంబంధించిన అదూర్ గోపాలకృష్ణన్, అరణ్ముల పొన్నమ్మ, అడూర్ భవాని, అదూర్ భసి, అదూర్ పంకజం, కవియూర్ పొన్నమ్మ, ఎం.జి. సోమన్, డైరెక్టర్ బ్లెస్సీ, మోహన్లాల్ మొదలైన వారు ఈ జిల్లాకు చెందినవారే. కేరళ లోని మొదటి, పురాతన కథాకళి గ్రామం పతనమ్‌తిట్ట జిల్లాలో ఉండడం జిల్లా ప్రత్యేకత.కేరళ రాష్ట్ర నృత్యంగా గుర్తించబడుతున్న కథాకళి నృత్యానికి మూలమైన కథాకళి గ్రామం ఈ జిల్లాలోనే ఉంది. కథాకళి నృత్యం ప్రపంచ ప్రసిద్ధి చెందిందింది. గ్రామమతా వేలాది కథాకళి కళాకారులు, కథాకళి ఆరాధకులు సంచరిస్తుంటారు. గ్రామంలోని ప్రజలందరూ కథాకళి నృత్యంతో సంబంధం కలిగి ఉంటారు. పతనమ్‌తిట్ట జిల్లా కథాకళి క్లబ్ గ్రామంలో కథాకళి క్లబ్ ఉంది. ఇది 1995లో స్థాపించబడింది. జిల్లాలోని అయరూర్- చెరుకోలా సాస్కృతిక గ్రామంలో పద్మానదీతీరంలో కథాకళి క్లబ్ ప్రధాన కార్యాలయం ఉంది.

పర్యాటకులు మార్చు

 
Temple at Aranmula

అనేక ఉత్సవాలు, పండుగలతో, పతనంతిట్ట జిల్లా "తీర్థయాత్ర పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.[24] జిల్లాకు పండుగ సమయాలలో శబరిమలై యాత్రకు 3 నుండి 4 యాత్రీకులు వస్తుంటారు.[25] శమరిమలై పశ్చిమకనుమలలో ఉంది. శబరిమలై హిందూ ఆలయం. ఆలయ ప్రధాన దైవం అయ్యాప్ప. జిల్లాలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద క్రైస్తవ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది.[26]

ఆధ్యాత్మిక ఉత్సవాలు, ఆలయాలు మార్చు

క్రైస్తవ ఆలయాలు మార్చు

ఫిబ్రవరి మాసంలో 8 రోజులు పంబా నదీతీరాలలో నిర్వహించబడుతున్న క్రైస్తవ సమావేశం మరమొన్ ఉత్సవం జిల్లాలోని ప్రధాన ఉత్సవంగా గుర్తించబడుతుంది. మలంకర ఆర్ధడాక్స్ చర్చి ఆఫ్హ్వర్యంలో మక్కంకున్ను వద్ద 3 రోజుల ఉత్సవం నిర్వహించబడుతుంది.

హిందూ ఆలయాలు మార్చు

చెరుకొల్పుళా హిందూ ఉత్సవం కదమ్మనిట్టా దేవి ఆలయం వద్ద నిర్వహించబడుతుంది. 10వ శతాబ్ధానికి చెందిన కవియూర్ మహాదేవన్ ఆలయం, అర్నాములా వద్ద ఉన్న పార్ధసారథి ఆలయం, అనికట్టిలమ్మక్షేత్రం మొదలైన హిందూ ఆలయాలు ఉన్నాయి.

 
anikkattilammakshethram

చర్చిలు మార్చు

క్రైస్తవ మతకేంద్రాలలో అత్యంత ప్రధానమైనదిగా పరుమల ఎస్.టి పీటర్స్, ఎస్.టి పల్స్, పరుమల తిరుమేనిలో ఉన్న ఎస్, టి గ్రిగోరియస్ ఆర్ధడాక్స్ చర్చి (ఇక్కడ సెయింట్ గ్రిగోరియస్ సమాధి ఉంది) ముఖ్యమైనవి. ఎస్, టి గ్రిగోరియస్ ఆర్ధడాక్స్ చర్చిని సందర్శించడానికి వేలాది భక్తులు వస్తుంటారు. జిల్లాలో ఉన్న ప్రధాన చర్చిలలో సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి (నిర్మం), నిలకల్, మంజనిక్కర, దయార సెయింట్ స్టీఫెన్స్ జాకోబైట్ చర్చ్, సెయింట్ థామస్ క్రైస్తవ చర్చి ( పరుమాల సెమినరీ), సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ కేథడ్రల్ ప్రధానమైనవి. మలకరా ఆర్ధడాక్స్ చర్చి ప్రధానకార్యాలయంగా ఉన్న తుంపమాన్ (తుంపమాన్ వలియపల్లి) క్రైస్తవ ప్రధాన్యత కలిగి ఉంది. నిరనం, నిలకల్ (చాయల్) థోమస్ అపోస్టల్ స్థాపించిన 7 చర్చీలలలోనివని భావిస్తున్నారు. .[27][28]

ముస్లిం ఉత్సవాలు మార్చు

ముస్లిములు జమ - అల్ - మసీదు వద్ద (పతనమ్‌తిట్ట) వద్ద వర్ణరంజితమైన చందనకుడం ఉత్సవం జరుపుకుంటారు. ఈ ఉత్సవం అనేకమందిని ఆకర్షిస్తుంది. ఈ కులమత రహితంగా అందరినీ ఆకర్షిస్తుంది.

 
Maramon Convention: Asia's biggest Christian gathering
 
Perunthenaruvi water falls

అభయారణ్యం మార్చు

ఆర్నములా మార్చు

జిల్లాలో పలు అదనపు పర్యాటక ఆకత్షణలు ఉన్నాయి. ఆర్నములా కణ్ణాడి, ఆర్నములా బోట్ పందాలు ఆర్నములా పట్టణానికి ప్రత్యేకత తీసుకువస్తుంది. " ది స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్" విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీనిని ఫ్రెంచ్ కళాకారుడు లౌబా స్చిల్డ్ స్థాపించాడు. ది స్కూల్ టీచర్స్ ఆఫ్ కథాకళి, సంప్రదాయ సంగీతం, సంప్రదాయ నృత్యం, అలాగే కలరిపయట్టు లలో శిక్షణ ఇవ్వబడుతుంది. ఆర్నములా కొట్టయానికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది.[29]

ములూర్ సమరకోం మార్చు

 
Muloor Smarakom

పతనమ్‌తిట్ట జిల్లా అభయారణ్యం, వన్యమృగాలకు ప్రత్యేకత కలిగి ఉంది. పెరుంతేనరువి జలపాతం, కక్కి రిజర్వాయర్ సమీపంలో వన్యమృగాలు మూణారు వద్ద ఉన్న ఆనకట్టలు, మణియారు, ఏనుగుల శిక్షణా కేంద్రం ప్రకృతి ఆరాధకులను ఆకర్షిస్తున్నాయి. శబరిపర్వతాలలో జనవరి - మార్చి వరకూ పతనమ్‌తిట్ట డిస్ట్రిక్ పర్యాటకం ప్రమోషన్ కౌంసిల్ ఇక్కడ పర్వతారోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది.పతనమ్‌తిట్ట జిల్లా చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేకత కలిగి ఉంది. వీటిలో పండలం కోటలు, వేలుతంబి దలవ, మన్నాడ్, ములూర్ ఎస్.పద్మనాభ పణికర్, సమరకోం (మూలూర్ మెమోరియల్) ముఖ్యమైనవి. ట్రావన్‌కోర్ రాజ్యానికి పండలం రాజధానిగా ఉండేది. .

వృక్షజాలం మార్చు

 
The Tiger inhabits Pathanamthitta's reserve forests
 
Aranmula Uthrattathi Boat Race

పతనమ్‌తిట్ట పర్యావరణ వైవిధ్యం కలిగి ఉంది. అరణ్యం, మొక్కలపెంపకం, నదులు, భూభాగం జిల్లాలో 50% భూభాగంలో వృక్షజాలం, జంతుజాలంతో సుసంపన్నమైన అరణ్యం విస్తరించి ఉంది. జిల్లా ఔషధ మొక్కలు, సుగంధద్రవ్యాలు, ట్యూబర్ పంటలు, పండులు పండించబడుతున్నాయి. జిల్లాలో నల్లమిరియాలు, అల్లం, ఏలుకలు, పసుపు మొదలైన సుగంధద్రవ్యాలలు పెద్ద ఎత్తున పండించబడుతున్నాయి. టేకు, ఎర్రచందనం, రోజ్‌వుడ్, జాక్ ట్రీ, మంజకడంబు, అంజిలి, పనస విస్తారంగా పండించబడుతున్నాయి.

జంతుజాలం మార్చు

జిల్లా అరణ్యాలలో అద్భుతమైన వన్యమృగాలు ఉన్నాయి. జిల్లా అరణ్యాలలో వైవిధ్యమైన జంతువులు, పక్షులు కనిపిస్తుంటాయి. బెంగాల్ పులి, భారతీయ ఏనుగు, గౌర్, జింక, కోత, ఇతర జతువులు ఉంటాయి. రాక్షస ఉడుత, లైన్- టెయిల్డ్ మకాక్వెలియన్, అరిచే జింక, ఎలుగుబంటు మొదలైన జంతువులు కూడా ఉంటాయి. మలబార్ గ్రే హాంబిల్ మొదలైన పక్షులు ఉంటాయి. సన్ బర్డ్స్, వడ్రంగిపిట్ట, కింగ్‌ఫియర్స్ కూడా ఉంటాయి. జిల్లాలో వివిధ ప్రాంతాలలో వన్యమృగ జీవితానికి ప్రమాదం ఎదురౌతుంది. ఎరువులు, పరిశ్రమల కాలుష్యం, అక్రమ ఇసుక త్రవ్వకాలు ప్రధాన ప్రామాదాలుగా ఉన్నాయి. శబరిమల యాత్రకారణంగా అరణ్యాల తొలగింపు, పెద్ద మొత్తంలో చెత్త చేరడం కూడా వన్యమృగాలు అంతరించి పోవడానికి కారణం ఔతున్నాయి.[13][30]

విద్య మార్చు

పతనమ్ తిట్ట జిల్లా రెండు విద్యా జిల్లాలుగా విభజించబడింది: పతనమ్‌తిట్ట, తిరువల్ల.జిల్లాలో విశ్వవిద్యాలయాలు లేవు. కాలేజీలు అధికంగా మహాత్మాగాంధీ (కొట్టయం) విశ్వవిధ్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. 2006 గణాంకాలను అనుసరించి జిల్లాలో 6 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజి ఉన్నాయి.[31][32] తొమ్మిది ప్రైవేట్ ఎయిడెడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు ఉన్నాయి.[10]

జిల్లాలో పాఠశాలలు ప్రభుత్వ, ట్రస్ట్, ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. జిల్లాలో పాఠశాలలన్నీ ఇండియన్ సెకండరీ ఎజ్యుకేషన్ (ఐ.సి.ఎస్.సి), ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎజ్యుకేషన్ (చి.బి.ఎస్.సి), కేరళ స్టేట్ ఎజ్యుకేషన్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలలో ఆగ్లం ప్రధాన బోధనా మాధ్యమంగా ఉంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలలో ఆగ్లం, మలయాళ భాషలలో బోధించబడుతుంది. 10 సంవత్సరాల సెకండరీ స్కూల్ తరువాత విద్యార్థులకు జీనియర్ కాలేజీ విద్యకు అర్హత సంపాదిస్తారు. జిల్లాలో అవసరాలకు తగినన్ని పాఠశాలలు ఉన్నాయి. మిగిలిన భారతీయ జిల్లాలో ఉన్నట్లుగా పతనమ్‌తిట్ట జిల్లాలోని వెచూచిరా (మన్నడిశిల) వద్ద జవహర్ విద్యాలయా పాఠశాల ఉంది.

క్రీడలు మార్చు

అరన్ముల వల్లం కాళి (పడవ పందెం) అనేది సెప్టెంబరు నెలలో జరుపుకునే పండుగలో భాగం. స్నేక్ బోట్ రేస్ సమీపంలోని ప్రదేశాలలో కూడా నిర్వహించబడుతున్నప్పటికీ, ఆరన్ముల వద్ద జరిగే రేసు పడవ ఆకృతి, డిజైన్ కారణంగా ప్రత్యేకంగా ఉంటుంది. మరమడిమత్సరం (ఎద్దుల పందెం) అటువంటి మరో కాలానుగుణ క్రీడ. సెంట్రల్ ట్రావెన్‌కోర్ ప్రాంతంలో జరిగే అతిపెద్ద వార్షిక పశువుల సంతలో భాగంగా ఇది జరుగుతుంది. రేసు మూడు విభాగాల్లో జరుగుతుంది.[33] ఫుట్‌బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ.

మూలాలు మార్చు

  1. "District collector". the hindu daily. Archived from the original on 2018-12-26. Retrieved 2009-08-27.
  2. "List of Districts in Kerala - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-06-10.
  3. 3.0 3.1 "Census of India". Government of India. Retrieved 2009-08-24.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. "District profile-Pathanamthitta". Department of Industries and Commerce, Kerala. Archived from the original on 2010-04-07. Retrieved 2009-08-27.
  6. "Pathanamthitta". Census of India. Archived from the original on 2015-04-25. Retrieved 2009-08-27.
  7. 7.0 7.1 "History". Government of India. Archived from the original on 2009-07-29. Retrieved 2009-08-27.
  8. "History — Pathanamthitta". Government of Kerala. Retrieved 2009-08-27.[permanent dead link]
  9. "EPARCHY OF PATHANAMTHITTA : Short History". The Official Website of the Syro-Malankra Catholic Church. The Syro-Malankra Catholic Church. Archived from the original on 2015-03-08. Retrieved 2014-06-30.
  10. 10.0 10.1 10.2 10.3 "District level database of Pathanamthitta" (PDF). Government of Kerala. 2006. Archived from the original (PDF) on 2008-11-22. Retrieved 2009-08-25.
  11. "Pathanamthitta information". Kerala tourism. Retrieved 2009-08-25.
  12. "Pathanamthitta- Physiograpy". Government of India. Archived from the original on 2009-07-29. Retrieved 2009-08-25.
  13. 13.0 13.1 "Pampa pollution". Pampa Parirakshana Samithy, N.G.O. Archived from the original on 2009-05-06. Retrieved 2009-08-27.
  14. "General features — Kerala". Government of Kerala. Archived from the original on 2006-11-02. Retrieved 2009-08-27.
  15. "Sections in Collectorate". Government of India. Archived from the original on 2009-04-10. Retrieved 2009-08-27.
  16. "Parliamentary Constituencies of Kerala - 2008". Government of Kerala. Archived from the original on 2009-09-03. Retrieved 2009-08-27.
  17. Radhakrishnan Kuttoor (2008-01-31). "Due recognition for the youngest district". The Hindu. Retrieved 2009-08-27.[permanent dead link]
  18. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est.
  19. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
  20. "Data sheet — Pathanamthitta" (PDF). Census of India. Retrieved 2009-08-27.
  21. "Demography — Kerala". Government of India. Retrieved 2009-08-27.
  22. Govind, Biju (2004-09-23). "Increase in Muslim population in the State". The Hindu. Archived from the original on 2004-11-28. Retrieved 2009-09-15.
  23. "District information — Pathanamthitta". Culture Holidays India Pvt. Ltd. Archived from the original on 2009-09-25. Retrieved 2009-08-27.
  24. "Places of Interest". Official website — Pathanamthitta. Archived from the original on 2009-09-27. Retrieved 2009-08-29.
  25. "Sabarimala Sri Dharmasastha Temple". Official website — Pathanamthitta. Archived from the original on 2009-08-18. Retrieved 2009-08-29.
  26. "Maramon". Department of tourism, Kerala. Archived from the original on 2011-01-03. Retrieved 2010-07-10.
  27. "St Thomas the Apostle of India". St.Thomas Syro Malabar Mission of San Antonio. Archived from the original on 2010-09-13. Retrieved 2009-09-15.
  28. "Syro Malabar Church History". St. Thomas Syro-Malabar Church of the Catholic Parish. Archived from the original on 2008-06-04. Retrieved 2014-06-30.
  29. "Aranmula". Ministry of Tourism, Government of India. Archived from the original on 2010-05-31. Retrieved 2010-10-07.
  30. "TDB to get forest land at Nilackal today". The Hindu. 2005-06-16. Archived from the original on 2012-11-06. Retrieved 2009-08-27.
  31. http://www.pushpagiri.in/
  32. http://www.zonkerala.com/Private-Medical-Colleges-26/
  33. "Maramadimatsaram". Department of tourism, Kerala. Archived from the original on 2012-03-01. Retrieved 2009-08-27.

బయటి లంకెలు మార్చు