పిఠాపురం
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 533450.
పిఠాపురం | |
---|---|
![]() పైన ఎడమ నుండి. కుక్కటేశ్వర పాదగయ దేవాలయం, రైల్వే స్టేషన్, పిఠాపురం పంటభూమి. | |
నిర్దేశాంకాలు: 17°07′00″N 82°16′00″E / 17.1167°N 82.2667°ECoordinates: 17°07′00″N 82°16′00″E / 17.1167°N 82.2667°E | |
ప్రభుత్వం | |
• Member of Legislative Assembly | Pendem Dhorababu[1] |
విస్తీర్ణం | |
• మొత్తం | 41.13 కి.మీ2 (15.88 చ. మై) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 10 మీ (30 అ.) |
జనాభా (2011)[3] | |
• మొత్తం | 52,360 |
• సాంద్రత | 1,300/కి.మీ2 (3,300/చ. మై.) |
Languages | |
• Official | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
చారిత్రక ఆధారాలు, కథనాలుసవరించు
యాత్ర చరిత్ర పిఠాపురంసవరించు
పిఠాపురము అను గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము.పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము బుద్ద రాజధానిగా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ ఒక తటాక మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున ఒక చిన్న శివాలయమున్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో ఒకపాడుకూపములో అష్టాదశపీఠములతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు. ఈ వూళ్ళో కాపు కులస్తులు ఇతరుల ఆస్తులను బెదిరించి హస్తగతం చేసుకొనెదరు. దళిిిత కుటుంబం వారు అదికం. వీరిలో బొజ్జ్జా వారు ఉన్నారువ్
యిన్నూరు బ్రాహ్మణయిండ్లు ఉన్నాయి. వారందరు తీర్ధవాసులుగా యాచకవృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపు లేని బ్రాహ్మణుేడు. యీ దినము తొలిఏకాదశి. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప పండగగా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, భోజనములు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.
యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కుటుంబస్థులు ఒక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన చెరువులు కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర అడుసు నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, మొగిలిచెట్లు, జెముడు, యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.
మరో కథనంసవరించు
సముద్ర గుప్తుడు అలహాబాదు శాసనములో పిఠాపురము పదునాలుగో శతాబ్దపు తొలిపాదములో ఒక రాజధానిగా ఉండినట్లు తెలుపబడి యున్నది. పిఠాపురములోని దొరికిన విగ్రహముల మీది ఉపవాస క్లేశ చిహ్నాలు, వాటి రొమ్ము మీద ఉన్న కొన్ని గాడులూ, తాటిపర్తి విగ్రహములు, పెనుమంచిలి చౌముఖములు మొదలైనవి అన్నీ కోన రాజ్యము ఏర్పడిన క్రీ.పూ.రెండవ వ శతాబ్దము ప్రారంభము తరువాతవని తెలియుచున్నవి. వీటిని బట్టి పిఠాపురము గర్భములో చాలా చరిత్ర ఉన్నట్లు తెలియుచున్నది.దీనిని గ్రామం అని కూడా అనేవారు.
పిఠాపురాన్ని పూర్వం పీట్పురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో అమృతం పాత్ర, వేరొక చేత బాగుగా పండిన మాదీఫలము కాయ, మూడవ చేత డాలు, నాల్గవ చేత లోహ లోహదండము ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో స్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీరాములు ఈశ్వర పురాణంలో ఈ కింది విధంగా చెబుతాడు.
- "సురా పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
- మోదము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
- కంటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
- గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది ( ప్రస్తుతం దీనిని చెరుకుల కాలువ అని అంటున్నారు). ఈ ఏలేరుని "పడతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీరాములు అలా అనేసి ఊరుకోకుండా-
- "గోదావరి విరినీట నిరుగారునుంబండు
- ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాథుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాథుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడా సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాథ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డే రాజులతో వైరం పూనిన విజయనగరం గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ఠ చేసేరుట. ఈ జగన్నాథ స్వామి చేతులు ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని ప్రాంతీయులు పిలుస్తారు.
పాదగయ క్షేత్రంసవరించు
కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంబంధించిన ఒక కథనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. అన్నవరం తదనంతర కాలంలో ప్రశస్తి చెందినది. అందువలననే శ్రీనాథుని రచనలలో ఎక్కడా అన్నవరం చరిత్ర కనబడదు.
పౌరాణిక ప్రశస్తిసవరించు
గయాసురుడు కావడానికి రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంవత్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి.
ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.[4]
బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.[5]
గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు.
ఈ కథలోనే కొన్ని వేర్వేరు చిరు భేదాలు ఉన్నాయి. మరో కథనం ప్రకారం గయుడు ఇంద్రుడు కావడం కాక గయుని మహా ప్రభావం వల్ల ఆయనను చూసినవారు, తాకినవారు నేరుగా బ్రహ్మమును పొందుతూండగా వేదకర్మలు నశిస్తూన్న స్థితి ఏర్పడింది. దానితో లోకంలో వేదకర్మలు నశించగా, ఇంద్రాదుల కోరికపైన (కొన్ని కథనాల్లో స్వయంగానూ) బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని సంకల్పించి, గయుని తలపై చేస్తారు. రాత్రి మొత్తం ఉండే ఈ యాగం తెల్లవారినాకా పూర్తవుతుంది. ఐతే శివుడు కుక్కుటరూపంలో (కోడిపుంజుగా) వచ్చి కూయడంతో నిజంగా తెల్లవారిందేమోనని భ్రమించిన గయాసురుడి హఠాత్ కదలికల వల్ల యాగం అర్ధాంతరంగా ఆగిపోతుంది. నిర్ణయించిన దాని ప్రకారం శిక్షగా ఆయన తలను పాతాళానికి తొక్కుతారు అనేది ఆ ప్రత్యామ్నాయ కథనం చెప్పే విషయం.
ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది.
పురుహూతికా దేవి ఆలయంసవరించు
కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.
శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రంసవరించు
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం, శ్రీ గురు గణపతి సచ్చిదానంద స్వామి ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు, భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు, మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.
త్రిశక్తిగాయత్రీ మహాసంస్ధానంసవరించు
బ్రహ్మశ్రీ వింజమూరిగణేష్ శర్మ(పిఠాపురంగురూజీ) "సువర్ణసింహతలాటసన్మానిత జ్యోతిష్యరత్న"గారిచే 2010సంవత్సరములో కాశీ (వారణాసి) క్షేత్రంలో అనుష్ఠానములో ఉండగా సంకల్పించబడింది. ఈసంస్థముఖ్యఉద్దేశములు:
- బ్రహ్మశ్రీఇంద్రకంటిసూర్యనారాయణశర్మగారు (పెదపూడి) వద్ద అభ్యసించిన సప్రమాణజ్యోతిష్యవిషయములు అతిసామాన్యలతోసహ అందరికీ ఉచితంగా అందాలని హైందవసంసృతి సంప్రదాయములు దశదిశలావ్యాపించాలనే ఆశయము,
- గోసంరక్షణ, వైదీక, వేదధర్మపరిరక్షణ,
- లోకకళ్యాణార్ధం యజ్ఞయాగాదులు ఉచితంగా చేయడం.
- అనాధ, వృధ్ద, బాల సంరక్షణను ఉచితంగా చేయడం.
- సంస్ధానమువారు దేశవిదేశాల్లో కూడా గురువుగారు దేవతాప్రతిష్ఠలు, యఙ్ఞయాగాది పూజా కార్యక్రమాలు వైదీకవిధిగా సశాస్త్రియముగానూ ఉచితంగాను వారిబృందముతో నిర్వహించుతూ ఉందురు.
- విద్య, ఉద్యోగ, వ్యాపార, సినిమా, రాజకీయ, సంతాన, దాంపత్య, విదేశీ ఇలా ఏవిధమైనసమస్యకైనా పరీక్షారమార్గలు గురువుగారినిసంప్రదించిన కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది.
ఇతర ఆలయాలుసవరించు
- కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)
- నూకాలమ్మ గుడి
- రాముని కోవెల (మంగాయమ్మరావు పేట)
- వెంకటేశ్వరస్వామి
- సాయిబాబా గుడి (చిన్న పోస్టాఫీస్ వద్ద)
- కోట సత్తెమ్మ తల్లి గుడి (సీతయ్యగారి తోట)
- శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం (పాత బస్టాండ్ వద* శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం (వేణుగోపాలస్వామి గుడి వద్ద)
- దత్తాత్రేయుడి గుడి (దూళ్ళ సంత దగ్గర, అగ్రహారం)
- పిఠాపురంగురూజీ (త్రిశక్రిగాయత్రిమహాసంస్ధానం)
చర్చిలుసవరించు
ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, బెతెస్థ బాప్టిస్ట్ చర్చి, ఎల్-షద్దాయి మినిస్ట్రీస్ చర్చి, జియన్ ప్రార్థనా మందిరం, హౌస్ ఆఫ్ హోప్, బైబిల్ మిషన్ చర్చి, ట్రినిటీ లూథరన్ చర్చి, డోర్ ఆఫ్ హోప్ చర్చి, సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చి, మరి కొన్ని
సౌకర్యాలుసవరించు
రవాణసవరించు
- ఈ పట్టణం మద్రాసు-హౌరా రైలు మార్గంలో ఉంది.
- జాతీయ రహదారి కాకినాడ నుండి విశాఖపట్నం వైపుగానూ, రాజమహేంద్రవరం వైపుగానూ వెళుతుంది. కనుక బస్సులు విరివిగా తిరుగుతాయి.
విద్యసవరించు
- సూర్యరాయ డిగ్రీ కాలేజి
- సి.బి.ఆర్.డిగ్రీ కాలేజి,
- ఆర్.ఆర్.బి.హెఛ్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
- ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కాలేజి,
- శ్రీ హనుమంతరాయ జూనియర్ కాలేజి,
- నవచైతన్య జూ.కాలేజి,
- ప్రియదర్శిని జూ.కాలేజి,
- అంజనా జూ.కాలేజి
కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు:సవరించు
- పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ - మంగయమ్మారావు పేట
సినిమా థియేటర్లుసవరించు
శ్రీ సత్యా, పూర్ణా, అన్నపూర్ణా, శివదుర్గా, శ్రీవెంకటేశ్వర
క్రికెట్ మైదానాలుసవరించు
ఆర్.బి.హెచ్.ఆర్. క్రికెట్ గ్రౌండ్, రాజుగారి కోట, దూళ్ళ సంత
ప్రముఖులుసవరించు
- రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
- రామజోగయ్య శాస్త్రి( వ్యాకరణ సిద్ధాంతి బిరుదాంకితులు)
- వంకాయల సత్యనారాయణ ( కవులలో ఒకరు)
- తిరుపతి వేంకట కవులు
- అంబటి బ్రాహ్మణయ్య
- ఉమర్ ఆలీషా (తెలుగు పండితులు)
- చిలకమర్తి లక్ష్మీనరసింహం (సారా వ్యాసాల రచయిత)
- చాగంటి సోమయాజులు (సాహితీవేత)
- భద్రిరాజు కృష్ణమూర్తి ( విద్వాంసులు)
- దాసరి నారాయణరావు
- రాజశ్రీ
- పిఠాపురం నాగేశ్వరరావు
- రేలంగి వెంకట్రామయ్య
- బందా కనకలింగేశ్వరరావు
- చింతామణి
- మిక్కిలినేని
- సముద్రాల రాఘవాచార్య
- పిఠాపురం గురూజీ
- వింజమూరిగణేష్ శర్మ
- శాసనాల వీరభద్ర స్వామి కవి, అవధాని, కథా రచయిత, నాటక రచయిత, నటుడు.[6]
ఇతర విశేషాలుసవరించు
- సా. శ. పూ 1830 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా రామేశ్వరంలో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారు ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (మాంసం వ్యాపారి అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, సూట్ కేసులో పెట్టేసి ఆ పెట్టెని చెన్నై పేసెంజరు లోనోక్కించేసేరు. దరిమిలా రైలు రామేశ్వరం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం రామేశ్వరంలో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
- పిఠాపురంలో గిటార్ల తయారీ జరుగుతోంది. దత్త క్షేత్రానికి దగ్గరలో గిటార్లు తయారు చేస్తారు. పిఠాపురానికి చెందిన ఎ.ఆర్.రహమాన్, ఎస్.ఎస్.తమన్ విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. రహమాన్ గారు మోడీ గారి ఉపన్యాసాలు కూడా గిటార్ మీద వాయించేవారని నానుడి.
- కాకినాడ లోని పిఠాపురం రాజా కళాశాల పూర్వపు రోజుల్లో మంచి పేరున్న కళాశాల. ఇప్పటికీ పేరు లోని జిగి తగ్గలేదు.
పిఠాపుర సంస్థాన విశేషాలుసవరించు
పిఠాపురం సంస్థానాన్ని కాపు రాజులు పాలించే వారు. వీరిలో సూర్యారావు బహదూర్ ప్రముఖులు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించారు. వింజపూడి సోమేశ్వరుడు (రాఘవీయం), వక్కంతం వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), కూచిపూడి జగ్గ కవి, కూచిపూడి గంగన్న, దేవులపాటి బాపన్న, పలు రామలక్ష్మన్న, అనువాదం సుబ్రహ్మణ్య కవి, దేవులపాటి సుబ్బరాయశాస్త్రి, దేవులపాటి వెంకటసుబ్బారాయ శాస్త్రి, కొణిదల వెంకటరావు విశ్వ నగరం-పిఠాపురం పుస్తకాన్ని రచించారు. ఇందులో శ్రీ వెంకటరావు గారు పిఠాపురం మహారాజ సంగతులతో పాటుగా కథలు అనేకం రచించి రాబోయే తరాలకు పిఠాపుర చరిత్రను, సంస్కృతిని అందిస్తున్నారు.
శాసనసభ నియోజకవర్గంసవరించు
- పూర్తి వ్యాసం పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో చూడండి.
చిత్రమాలికసవరించు
వనరులుసవరించు
వేమూరి వేంకటేశ్వరరావు, "పిఠాపురంలో నా మొదటి మజిలీ" ఈమాట అంతర్జాతీయ పత్రిక, 2004 సెప్టెంబరు
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 1,29,282 - పురుషులు 64,906 - స్త్రీలు 64,376
మూలాలుసవరించు
- ↑ "MP, MLA participate incockfight at Pithapuram". The Hindu. 11 January 2018. Retrieved 18 August 2018.
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 28 January 2016.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 24 August 2014.
- ↑ కమల, ఎం. (నవంబర్ 13, 2010). "దేహమే దేవాలయం-పాదగయే పిఠాపురం". ఆంధ్రప్రభ. Archived from the original on 26 ఏప్రిల్ 2015. Retrieved 20 December 2014. Check date values in:
|date=
and|archive-date=
(help) - ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
- ↑ "Aaramadravidulu". Aaramadravidulu. Retrieved 16 May 2020.[permanent dead link]