పిఠాపురం

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, పిఠాపురం మండల పట్టణం

పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పిఠాపురం మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల కుక్కుటేశ్వర ఆలయం, పురుహూతికా దేవి ఆలయం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు అనుసందాన దేవాలయము శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము విశేషముగా ఉన్నది

పట్టణం
పటం
Coordinates: 17°07′N 82°16′E / 17.12°N 82.27°E / 17.12; 82.27
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ జిల్లా
మండలంపిఠాపురం మండలం
విస్తీర్ణం
 • మొత్తం22.71 కి.మీ2 (8.77 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం54,859
 • జనసాంద్రత2,400/కి.మీ2 (6,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1020
ప్రాంతపు కోడ్+91 ( 8869 Edit this on Wikidata )
పిన్(PIN)533450 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

పేరు వ్యుత్పత్తి

మార్చు

పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ.ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో అమృతం పాత్ర, వేరొక చేత బాగుగా పండిన మాదీఫల కాయ, మూడవ చేత డాలు, నాల్గవ చేత లోహ లోహదండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో స్వామి ఆలయంలో ఉంది.

భౌగోళికం

మార్చు

జిల్లా కేంద్రమైన కాకినాడ కు ఉత్తరంగా 15 కి.మీ దూరంలో వుంది.

జనగణన గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా- మొత్తం 1,29,282 - పురుషులు 64,906 - స్త్రీలు 64,376

పరిపాలన

మార్చు

పిఠాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణ సౌకర్యాలు

మార్చు
దస్త్రం:APtown Pithapuram 1.JPG
పిఠాపురం రైల్వేస్టేషను

జాతీయ రహదారి 216 పైనుంది. ఈ పట్టణం మద్రాసు-హౌరా రైలు మార్గంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

మార్చు
 
శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం
  • సూర్యరాయ డిగ్రీ కాలేజి

పర్యాటక ఆకర్షణలు

మార్చు

పురుహూతికా దేవి ఆలయం

మార్చు
 
పురుహూతికా దేవి

కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.

ఇతర ఆలయాలు

మార్చు
  • కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి)
  • నూకాలమ్మ గుడి
  • శ్రీ మహాలక్ష్మీ ఆలయం.ఈ ఆలయం పురుహూతికా దేవి ఆలయమునుండి 1కి॥మీ దూరములో ఉన్నది.గ్రామదేవత నూకాలమ్మ గుడి ప్రక్కన ఉన్నది.శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారి కరకమలములతో ప్రథమశిలాన్యాసము(శంకుస్థాపన)చేయబడి,2021 వ సంవత్సరములో ప్రతిష్ఠింపబడినది.మరియు శృంగేరి శంకరమఠముగా వెలుగొందుచున్నది. ఈ ఆలయమునకు ధర్మాధికారి బ్రహ్మశ్రీ డా॥ఇంద్రకంటి వేంకట గోపాలకృష్ణ శర్మ.

ఇతర విశేషాలు

మార్చు
  • సా. శ. 1830 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా రామేశ్వరంలో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారు ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (మాంసం వ్యాపారి అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, సూట్ కేసులో పెట్టేసి ఆ పెట్టెని చెన్నై పేసెంజరు లోనోక్కించేసేరు. దరిమిలా రైలు రామేశ్వరం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం రామేశ్వరంలో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
  • పిఠాపురంలో వీణల తయారీ జరుగుతోంది. దత్త క్షేత్రానికి దగ్గరలో వీణలు తయారు చేస్తారు.

పిఠాపుర సంస్థాన విశేషాలు

మార్చు

పిఠాపురం సంస్థానాన్ని వెలమ రాజులు పాలించే వారు. వీరిలో సూర్యారావు బహదూర్ ప్రముఖుడు. ఈయన సాహిత్యాన్ని బాగా పోషించాడు.

చిత్రమాలిక

మార్చు

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పిఠాపురం&oldid=4236692" నుండి వెలికితీశారు