రాయపూడి

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలంలోని గ్రామం

రాయపూడి, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తుళ్ళూరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1268 ఇళ్లతో, 4817 జనాభాతో 2434 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2419, ఆడవారి సంఖ్య 2398. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1001 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 75. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589964[1].ఇది వెలనాటి చోళులు, కాకతీయులు పాలించిన ప్రదేశం.ఇక్కడ వీరభధ్రాలయం ఎదురుగా తెలుగులో వచనరూపంలో రాసిన వెలానాటి శాసనం ఒకటి దొరికింది.ఈ గ్రామం నిమ్మకాయల వ్యాపారానికి ప్రసిద్ధి.

రాయపూడి
—  రెవిన్యూ గ్రామం  —
రాయపూడి is located in Andhra Pradesh
రాయపూడి
రాయపూడి
అక్షాంశరేఖాంశాలు: 16°32′53″N 80°28′53″E / 16.548085°N 80.481317°E / 16.548085; 80.481317
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తుళ్ళూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,817
 - పురుషుల సంఖ్య 2,419
 - స్త్రీల సంఖ్య 2,398
 - గృహాల సంఖ్య 1,268
కాలాంశం భారత ప్రామాణిక కాలమానం (UTC)
పిన్ కోడ్ 522237
ఎస్.టి.డి కోడ్ 08645

సమీప గ్రామాలు మార్చు

అబ్బరాజుపాలెం 2 కి.మీ, బోరుపాలెం 2 కి.మీ, దొండపాడు 2 కి.మీ, లింగాయపాలెం 2 కి.మీ, వెలగపూడి 4 కి.మీ.

గ్రామ చరిత్ర మార్చు

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి..

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి తుళ్ళూరులో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల తుళ్ళూరులోను, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల మంగళగిరిలోను, పాలీటెక్నిక్‌ విజయవాడలోను, మేనేజిమెంటు కళాశాల గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం విజయవాడలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

రాయపూడిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

తాగు నీరు మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.

పారిశుధ్యం మార్చు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

రాయపూడిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైన సౌకర్యాలు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకువ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, అసెంబ్లీ పోలింగ్ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

రాయపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1287 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 66 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1079 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 81 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 997 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

రాయపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • బావులు/బోరు బావులు: 931 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

రాయపూడిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

అరటి, కూరగాయలు, వరి

గ్రామ పంచాయతీ మార్చు

  1. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటినుండి ఇప్పటివరకూ, ఒకే కుటుంబ సభ్యులు సర్పంచులుగా గ్రామాన్ని పాలించారు. ఈ గ్రామంలో 1952 నుండి 2013 వరకూ, అంటే 60 ఏళ్ళపాటు ఈ గ్రామ పంచాయతీ, "మల్లెల" కుటుంబం ఏలుబడిలో కొనసాగింది. ఈ గ్రామానికి 1952లో మొదటి సర్పంచిగా మల్లెల శెషగిరిరావు ఎన్నికై 5 ఏళ్ళపాటు పనిచేసి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రహదార్లూ, లింకు రోడ్ల నిర్మాణం, పాలవాగు, ఉన్నత పాఠశాలల అభివృద్ధి, గ్రామంలో సమాచారస్రవంతి ఏర్పాటు తదితర పనులు చేపట్టారు. ఆదర్శంగా నిలిచారు.
  2. 2008వ సంవత్సరంలో ఈ గ్రామాన్ని నిర్మల్ పురస్కారం గ్రామంగా ఎంపిక చేశారు.
  3. ఈ గ్రామంలో ప్రజలంతా ఒకేసారి ఏదైనా సమాచారాన్ని తెలుసుకొనేలాగా సమాచార స్రవంతిని ఏర్పాటు చేసారు. గ్రామంలోని ముఖ్యమైన కూడళ్ళలో మైకులు ఏర్పాటుచేసి, వాటిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన యాంప్లిఫైయర్లకు అనుసంధానం చేసారు. ఈ ఎలక్ట్రానిక్ పరికరంతో మైకులన్నీ ఒకేసారి పనిచేస్తాయి. ఏదైనా సమాచారం గ్రామస్తులకు తెలియజేయాలంటే పంచాయతీ కార్యాలయంలో కూర్చొని, మైకులో చెప్పడంతో, ఆ మాటలు ముఖ్యకూడళ్ళలో నెలకొల్పిన మైకుల ద్వారా ఊరంతా ఒకేసారి వినిపిస్తాయి. ఈ గ్రామంలో మొదలైన ఈ సమాచార స్రవంతి, నేడు తుళ్ళూరు మండలంలోని అన్ని గ్రామాలలో విస్తరించింది. ఈ సమాచార వ్యవస్థ ద్వారా అందించే సామాచారం:- చౌక డిపోలో సరకుల పంపిణీ, కూరగాయల ధరల వివరాలు, పింఛనుల పంపిణీ వివరాలు, విద్యుత్తు బిల్లుల చెల్లింపులు, త్రాగునీటి సరఫరాలో అంతరాయాలు, గ్రామంలో జరిగే సభలు, సమావేశాల వివరాలు, రేడియో వార్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు, సీజనులో వచ్చే వ్యాధులు, అవి రాకుండా ముందస్తు జాగ్రత్తల సమాచారం, సూచనలు, అలా అనేకరకాలుగా సమాచారం, ప్రజలకు తేలికగా అర్ధమయ్యే విధంగా క్షణాలలో తెలియజేస్తునారు. ఇటువంటి వ్యవస్థ జిల్లాలో మరెక్కడా లేదు. రాయపూడి గ్రామానికి చెందిన మల్లెల హరేంద్రనాధ చౌదరి, ఈ గ్రామ సర్పంచి పనిచేయుచున్నాప్పుడు ఈ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసారు.

గ్రామ విశేషాలు మార్చు

ఈ గ్రామంలో 25 ఏళ్ళుగా మద్యనిషేధం అమలు చేస్తూ ఆదర్శగ్రామంగా నిలుచుచున్నది. గత 25 ఏళ్ళుగ ఇక్కడ మద్యం దుకాణంగానీ, గొలుసు దుకాణంగానీ లేకుండా గ్రామస్థులు కఠినంగా వ్యవహరించుచున్నారు. 1987 లో శ్రీ మల్లెల హరీంద్రనాథచౌదరి సర్పంచిగా ఉన్నప్పుడు దీనికి పునాది పడింది. మద్యపానం వలన కుటుంబాలు పతనం కావటం చూసిన ఆయన రాయపూడిని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పించి కఠినంగా ప్రవర్తించారు. ఎంతమంది ఒత్తిడితెచ్చినా తగ్గలేదు.

ఈ గ్రామ మెయిన్ స్కూలులో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న సుబ్బారావు, పాఠశాలలోని విద్యార్థులకు చదువుతోపాటు యోగాసనలు వేయడంలో గూడా శిక్షణనిచ్చుచూ, వారికి చదువుతోపాటు అరోగ్యాన్ని గూడా సమకూర్చుచున్నారు. వీరి శ్రీమతి, కుమార్తె, కుమారుడు గూడా యోగాసనాలు వేయడంలో దిట్టలే. ఎక్కడ యోగాసనాలలో పోటీలు జరిగినా కుటంబసమేతంగా పాల్గొంటారు. శ్రీ సుబ్బారావు, తుళ్ళూరులో, "శ్రీ ధర్మా యోగా సేవా కేంద్రం" స్థాపించి, స్థానికులకు గూడ శిక్షణనిచ్చుచూ ప్రోత్సహించుచున్నారు. వీరు ఒక సంవత్సరంలోనే, జిల్లా నుండి అంతార్జాతీయ స్థాయిలో, 4 పతకాలు సాధించారు.

గణాంకాలు మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,459. ఇందులో పురుషుల సంఖ్య 2,240, స్త్రీల సంఖ్య 2,219, గ్రామంలో నివాస గృహాలు 1,054 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 2,434 హెక్టారులు.

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
"https://te.wikipedia.org/w/index.php?title=రాయపూడి&oldid=3573807" నుండి వెలికితీశారు