మీర్ అమీర్ అలీఖాన్

మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 జనవరి 25న తెలంగాణ శాసనసమండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1][2]

మీర్ అమీర్ అలీఖాన్

పదవీ కాలం
2024 జనవరి 27 – 2030 జనవరి 26
నియోజకవర్గం గవర్నర్ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1970
హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జావెద్‌ అలీఖాన్‌
నివాసం హైదరాబాద్

మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు.[3]

మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించగా ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేయగా ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని 2024 జనవరి 30న ఉత్తర్వులు ఇచ్చింది.[4]

మూలాలు మార్చు

  1. Eenadu (25 January 2024). "గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక.. తమిళిసై ఆమోదం". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  2. Prabha News (25 January 2024). "గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్…". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  3. Andhrajyothy (25 January 2024). "TS Politics: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీ.. చర్చనీయాంశమైన తమిళిసై..!!". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
  4. Eenadu (30 January 2024). "గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.