రక్తతిలకం (1964 సినిమా)

దాదా మిరాసి దర్శకత్వంలో 1964లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా

రక్త తిలకం 1964, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. మణీరాం మూవీస్ పతాకంపై సండే టైమ్స్ రామయ్య నిర్మాణ సారథ్యంలో దాదా మిరాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి, మనోరమ, నగేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1]

రక్త తిలకం
రక్త తిలకం సినిమా పోస్టర్
దర్శకత్వందాదా మిరాసి
రచనకన్నదాసన్ (కథ),
శ్రీశ్రీ (మాటలు)
స్క్రీన్ ప్లేదాదా మిరాసి
నిర్మాతసండే టైమ్స్ రామయ్య
తారాగణంశివాజీ గణేశన్,
సావిత్రి,
మనోరమ,
నగేష్
ఛాయాగ్రహణంజాగీర్దార్
కూర్పువి. రాజు, బిపి కృష్ణన్
సంగీతంపెండ్యాల శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
మణీరాం మూవీస్
విడుదల తేదీ
ఫిబ్రవరి 7, 1964
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
రక్తతిలకం తమిళ వెర్షన్ పోస్టర్

కథా నేపథ్యం మార్చు

చైనా-ఇండియన్ యుద్దం మధ్యలో దేశంలో చైనా దండయాత్ర గురించి వార్తలు విన్న తరువాత, భారత సైన్యంలో చేరాలనుకున్న కుమార్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • చిత్రానువాదం, దర్శకత్వం: దాదా మిరాసి
  • నిర్మాత: సండే టైమ్స్ రామయ్య
  • కథ: కన్నదాసన్
  • మాటలు: శ్రీశ్రీ
  • సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
  • ఛాయాగ్రహణం: జాగీర్దార్
  • కూర్పు: వి. రాజు, బిపి కృష్ణన్
  • నిర్మాణ సంస్థ: మణీరాం మూవీస్

పాటలు మార్చు

ఈ చిత్రానికి పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించాడు. ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, పి. సుశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి పాటలు పాడారు.

  • ఓ భారతవీరా ఓయీ భారతవీరుడా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
  • బుద్ధుడున్న ధాత్రినే - ఘంటసాల బృందం- రచన: శ్రీశ్రీ
  • మహిమగల హిమాద్రిమీద - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

మూలాలు మార్చు

  1. "Raktha Thilakam (1964)". Indiancine.ma. Retrieved 2020-08-30.

ఇతర లంకెలు మార్చు