వల్లభనేని వంశీ మోహన్

వల్లభనేని వంశీ మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సినిమా నిర్మాత. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

వల్లభనేని వంశీ మోహన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1972
గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
సంతానం 2

జననం, విద్యాభాస్యంసవరించు

వల్లభనేని వంశీ 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గన్నవరంలో జన్మించాడు. ఆయన 1995లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంవీఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. వంశీ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మెనేజే మెంట్ కోర్సు చేస్తున్నాడు.[2]

రాజకీయ జీవితంసవరించు

వల్లభనేని వంశీ మోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దుట్టా రామచంద్రరావుపై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

నిర్మించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. News18 Telugu (11 July 2021). "పాలిటిక్స్ లోనే కాదు చదువులోనూ టాపర్.. స్టూడెంట్ నెం.1గా ఎమ్మెల్యే.. ప్రతిష్టాత్మక సంస్థలో సీటు". Retrieved 6 January 2022.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.